జగన్ పారిస్ పర్యటన ఖర్చు ప్రజలదేనా !?

సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత పర్యటన కోసం లగ్జరీ విమానంలో సతీ సమేతంగా పారిస్ వెళ్లారు. కుమార్తెకు కాన్వొకేషన్‌లో పాల్గొని తిరిగి వస్తారు వచ్చే నెల మూడో తేదీన తిరిగి వస్తారు. ఇందులో ఎక్కడా అధికారికం అనే ప్రశ్నే లేదు. పూర్తిగా వ్యక్తిగతం. అయితే ఈ పర్యటన ఖర్చుపై ఇప్పుడు జోరుగా చర్చ సాగుతోంది. ఎందుకంటే సీఎం జగన్ వెళ్లిన ఫ్లైట్ ఖర్చు గంటకు లక్షల్లోనే చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. మామూలు ఫ్లైట్‌లో వెళ్లి ఉంటే ఎవరూ పెద్దగా చర్చించేవారు కాదేమో.

ఎలా లేదన్న కనీసం పది కోట్ల వరకూ ప్రస్తుతం సీఎంజగన్ పారిస్ టూర్ వల్ల ఖర్చవుతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఈ మొత్తాన్ని ఎవరు పెట్టుకుంటారన్నది ఇప్పుడు కీలకంగా మారింది. సహజంగా వ్యక్తిగత పర్యటనలకు ప్రజధనాన్ని ఉపయోగించరు. కానీ సీఎం జగన్ తీరు మాత్రం భిన్నంగా ఉంది. ముఖ్యమంత్రిగా తాను ఒక్క రూపాయే జీతం తీసుకుంటానని చెబుతారు కానీ.. సీఎంగా వచ్చే శాలరీపై కట్టాల్సిన ఆదాయపు పన్ను కూడా ప్రజాసొమ్మునే తీసుకుంటారు. అందుకే జగన్ వ్యక్తిగత పర్యటనలకు కూడా ప్రజాధనమే వాడుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.

నిజానికి ఈ విషయంలో విమర్శలు వస్తాయని ముందుగానే తెలుసు కాబట్టి.. అధికారులు కానీ ప్రభుత్వం కానీ..అలాంటిదేమీ లేదని క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. మొత్తం వ్యక్తిగత ఖర్చుతోనే వెళ్తున్నారని ప్రకటిస్తే ఇలాంటి సమస్యలు వచ్చేవి కావు. కానీ అలా ప్రకటించలేదంటే ప్రజాధనంతోనే ఆయన లగ్జరీ విమానాలను అద్దెకు తీసుకుని ప్రయాణిస్తున్నారన్న విమర్శలు ఎదుర్కోక తప్పదు. ఏపీలో ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందుకే ఈ అంశం చర్చకు వస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చెల్లిని కించపర్చి జాతీయ మీడియాలో జగన్ నవ్వులపాలు

జాతీయ మీడియాకు జగన్ ఇచ్చిన ఇంటర్యూలు నవ్వుల పాలయ్యాయి. ఇతర విషయాల సంగతేమో కానీ చెల్లి షర్మిలపై ఆయన చేసిన వ్యాఖ్యలు బీహార్ లో పురుషాహంకారం ఉండే నేతలు కూడా...

పోస్టల్ బ్యాలెట్స్ కూడా రీపోలింగ్ – ఇదేం ఎన్నికల నిర్వహణ ?

ఎన్నికల నిర్వహణ ఎంత అసమర్థుల చేతుల్లో ఉందో తెలిపే ఘటన ఇది. పల్నాడు జిల్లాలో చిలకలూరిపేట లో పోస్టల్ బ్యాలెట్లకు బదులు ఉద్యోగులకు డమ్మీ బ్యాలెట్లు ఇచ్చారు. రోజంతా ఉద్యోగులు కష్టపడి...

రైతు భరోసా స్టార్ట్ … క్రెడిట్ బీఆర్ఎస్ దేనా..?

రైతు భరోసాకు ప్రభుత్వం నిధులు విడుదల చేయడంతో కేసీఆర్ తనదైన రాజకీయం ప్రదర్శిస్తున్నారు. ఎన్నికల వేళ పెట్టుబడి కింద రైతుల అకౌంట్లో డబ్బులు జమ అవుతుండటంతో ఆ క్రెడిట్ బీఆర్ఎస్ ఖాతాలో వేస్తున్నారు....

ఓటేస్తున్నారా ? : కష్టాల్లో నేనున్నానని భరోసా ఇచ్చే పాలకుడెవరో ఆలోచించండి !

ఓ డ్యామ్ పగిలిపోయింది.. కొట్టుకుపోయింది. డ్యామ్ అంటే చిన్న విషయం కాదు. ఆ డ్యామ్ ఎందుకు కొట్టుకుపోయిందన్న సంగతి తర్వాత ముందుపాలకుడు ఏం చేయాలి ?. ఉన్న పళంగా అక్కడికి వెళ్లి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close