వాలంటీర్ల పేరుతో సాక్షికి నెలకు ఐదున్నర కోట్లు !

ముఖ్యమంత్రి కుటుంబానికి చెందిన సాక్షి పత్రికలకు వందల కోట్ల ప్రకటనలు ఇస్తున్నారని ఇది నిబంధనలకు విరుద్ధమని.. నైతికంగా కూడా కరెక్ట్ కాదనే వాదనలు వినిపిస్తున్నా అలాంటివేమీ తాము పట్టించుకోబోమని ప్రభుత్వ పెద్దలు ఎప్పటికప్పుడు నిరూపిస్తూనే ఉన్నారు. తాజాగా వాలంటీర్లను అడ్డం పెట్టుకుని సాక్షి పత్రికకు నెలకు రూ. ఐదున్నర కోట్లు చెల్లించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు జీవో జారీ చేశారు. అయితే ఇలాంటి వ్యవహారాల్లో దొరికిపోకుండా ఆదేశాలు జారీ చేయడం.. అడ్డగోలుగా వ్యవహారాలు నడపడం అలవాటు కాబట్టి… ఆదేశాలు అలాగే జారీ చేశారు.

దినపత్రికను కొనుక్కోవడానికి వాలంటీర్లకు నెలకు రెండువందలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏ దిశపత్రిక అంటే నేరుగా సాక్షి అని చెప్పలేదు. ప్రభుత్వ పథకాల సమాచారం తెలుసుకోవడానికి.. విపక్షాలు చేసే దుష్ప్రచారాన్ని అడ్డుకోవడానికి విస్త్రతంగా సర్క్యూలేషన్ ఉన్న పత్రికను కొనుక్కోవడానికట. అంటే సాక్షి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏ వాలంటీర్ అయినా సాక్షి మినహా దేన్నైనా కొనుగోలు చేస్తే వాలాంటీర్ ఉద్యోగం ఊడుతుంది. ఏపీ వ్యాప్తంగా రెండున్నర లక్షల మంది వాలంటీర్లు ఉన్నారని వారందరికీ డబ్బులు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ లెక్కన నెలకు ఐదున్నర కోట్ల వరకూ అవుతుంది.

ఇటీవలి కాలంలో సాక్షి పత్రిక సర్క్యూలేషన్ దారుణంగా పడిపోయింది. కొనేవారు లేరు. దీంతో రెండున్నర లక్షల సర్క్యూలేషన్ పెంచుకోడానికి కూడా ప్రజాధనమే ఉపయోగిస్తారన్నమాట. ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాల్లో ఒకటి కాదు రెండు సాక్షి పేపర్లు కొంటున్నారు. ఇప్పుడు వాలంటీర్లకు అంటగడుతున్నారు. అటు ప్రకటనలు.. ఇటు పత్రిక కొనుగోలు మొత్తం ప్రజాధనంతో నడిచిపోయేలా చూసుకుంటున్నారు. ఇప్పటికే సాక్షిలో పని చేసిన సగం మంది ఉద్యోగుల ప్రభుత్వంలో భాగం అయి ప్రజాధనం జీతాలుగా తీసుకుంటున్నారు. మొత్తంగా సాక్షి కోసం ప్రజాధనాన్ని విచ్చలవిడిగా వాడేస్తున్నారు .

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఉత్తరాంధ్ర… ‘అధికార’ నిర్ణయాంధ్ర !

రాజకీయంగా ఎంతో చైతన్యంగా ఉండే ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర జిల్లాలు ముందు వరుసలో ఉంటాయి... ఏదో ఒక మూలకు విసిరేసినట్లు ఉన్నప్పటికీ... ఈ మూడుజిల్లాలు... నేడే కాదు, నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా......

భీమిలి… ‘గంటా’ మజిలీ!

మాజీ మంత్రి, TDP నాయకుడు గంటా శ్రీనివాసరావు... వాస్తవానికి విశాఖ జిల్లాకు వలస వచ్చిన నాయకుడే అయినా... దాదాపు పాతికేళ్ళుగా ఓటమి ఎరుగని నాయకుడుగా ఉండటంతో స్థానికుడు అయిపోయాడు. ఎన్నికలు వస్తున్నాయి అంటే......

గుండు సున్నా కావాలా.. గుండె ధైర్యం కావాలా… ఇందూరు గడ్డపై కేసీఆర్ గర్జన

ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నిజామాబాద్ రోడ్ షోలో పాల్గొన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీజేపీపై నిప్పులు చెరిగారు. నరేంద్ర మోడీ పాలనలో అచ్చేదిన్ కాదు... సచ్చేదిన్ వచ్చిందని మండిపడ్డారు. ప్రధాని మోడీ...

బటన్ల నొక్కిన డబ్బులపై వైసీపీ డ్రామా ఫెయిల్

ఏపీ లో అధికార పార్టీకి పుట్టెడు తెలివితేటలు. ఓటర్లకు తాము పంచే డబ్బులు కాకుండా పెండింగ్ పెట్టిన డబ్బులు వేయాలని అనుకున్నారు. చివరికి ఎటూ కాకుండా పోయింది. చేయూత సహా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close