చేరే వాళ్లంతా కాంగ్రెస్ వైపే – బీజేపీపై నమ్మకం లేదా ?

భారతీయ జనతా పార్టీ అతి కష్టం మీద మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డిని ఒప్పించి పార్టీ కండువా కప్పారు. ఆయన మాస్ లీడర్ కాదు. కానీ ఆయనకు గుర్తింపు ఉంది. ఈ గుర్తింపు బీజేపీలో పెద్దగా ఉపయోగపడుతుందని ఎవరూ అనుకోరు. ఆయన తప్ప ఇటీవలి కాలంలో పార్టీలో చేరిన వారు లేరు. చేరుతామన్న వారు కూడా వెనక్కి తగ్గుతున్నారు. గతంలోబండి సంజయ్ పాదయాత్రలో సునామీలా చేరికలు ఉంటాయని ప్రకటించారు. మాట్లాడుకున్న వారు కూడా చేరలేదు. అందరూ వెనక్కి తగ్గారు. ఇప్పుడు తర్వాత ఎవరు చేరుతారన్నదానిపై స్పష్టత లేదు. పార్టీలో చేరికలు చాలా డల్‌గా ఉన్నాయి.

అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ వైపు మాత్రం క్యూ కడుతున్నారు. మాజీ ఎమ్మెల్యేలు.. నియోజకవర్గ స్థాయి నేతలు కాంగ్రెస్ పార్టీ వైపే చూస్తున్నారు. పదవికి గండం వస్తుందని తెలిసినా ఓ నగర పాలక సంస్థ మేయర్ కాంగ్రెస్ పార్టీలో చేరారంటే చిన్న విషయం కాదు. తన భార్య జడ్పీ చైర్మన్ అయినా సరే మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు కాంగ్రెస్‌లోనే చేరారు. రాబోయే రోజుల్లో చాలా మంది ప్రముఖ నేతలు కాంగ్రెస్‌లో చేరబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఎవరూ కూడా బీజేపీ వైపు చూస్తున్నారన్న లీక్ రావడం లేదు.

బీజేపీకి మీడియాలో హైప్ కనిపిస్తోంది కానీ జనం లేదన్న అభిప్రాయం కాంగ్రెస్ నేతల్లో ఉన్నట్లుగా కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి లాంటి లీడర్ ఉండటం ప్లస్ పాయింట్‌ అని.. ఆయన పార్టీని గట్టెక్కిస్తారని ఎక్కువ మంది నమ్ముతున్నట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో బీజేపీలో అలాంటి నాయకత్వం కరవైంది. పైగా బీజేపీలో ఇతర పార్టీల నేతలు ఇమడటం సాధ్యం కాదు. అక్కడ అంతా పార్టీ నేతలు రింగ్ అయిపోయి ఉంటారు.. ఇతరులకుచాన్స్ రానివ్వరు. అందుకే హైకమాండ్ ఈటలకు చేరికల బాధ్యతలు ఇచ్చారు. కానీ ఆయనకే నిన్నామొన్నటిదాకా ప్రాధాన్యం లేదని.. ఇప్పుడు ఆయన మాత్రం ఏం చేయగలరనేది ప్రశ్న.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close