ఒక్క డాలర్‌కి రూ. 80 – ఇది మోదీ విక్టరీనే !

మోదీ ప్రధానమంత్రి అయితే రూపాయికే్ పది డాలర్లు వస్తాయని ప్రచారం చేశారు. మన్మోహన్ సింగ్ పీఎంగా ఉన్నప్పుడు డాలర్‌కు నలభై ఐదు రూపాయలు ఉంటే.. ప్రధాని లాగే చాలా వీక్‌గా ఆర్థిక వ్యవస్థ ఉందని దుయ్యబట్టారు. తాము రాగానే రూపాయి కండలు పెంచుతుందని డాలర్‌ను మించిపోతామని చెప్పారు. ఇప్పటికి ఎనిమిదేళ్లు అయింది. ఇప్పుడు డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 80కి చేరింది. అంటే ఆర్థిక వ్యవస్థ క్లిష్ట పరిస్థితుల్లోకి పోయిందన్నమాట. మన దగ్గర ఉన్న విదేశీ మారక ద్రవ్య విల్వలు వేగంగా తగ్గిపోవడానికి ఇదో సూచిక.

భారత్ దిగుమలు చేసుకుంటున్న ప్రతి వస్తువుకు.. బిల్లు డాలర్లలోనే చెల్లించాల్సి ఉంటుంది. ఎగుమతులకు డాలర్లే వస్తాయి. కానీ ఈ రెండింటి మధ్య. హస్తిమశకాంతరం తేడా ఉంటుంది. చాలా కాలంగా నిల్వ చేసుకుంటూ వస్తున్న విదేశీ మారక ద్రవ్య నిల్వలు తగ్గిపోయే ప్రమాదం ఉంది. రూపాయి పతనం విదేశాల నుంచి డబ్బులు పంపేవారికి మాత్రమే మేలు చేస్తుంది. అది కూడా ఓ వైపే. మరో రకంగా వారికీ ఇబ్బందికరమే. ఇక విదేశాల్లో చదువుకుంటున్న వారి పరిస్థితి దుర్భరంగా మారుతుంది.

డాలర్‌తో పోలిస్తే రూపాయి ఎంత బలంగా ఉంటే… ఆర్థిక వ్యవస్థ అంత బలంగా ఉందని ఆర్థిక నిపుణులు చెబుతూ ఉంటారు. అయితే గత ఎనిమిదేళ్లుగా బలమైనప్రభుత్వంలో రూపాయి మాత్రం బలహీనపడుతూ వస్తోంది. దీన్ని ఎవరూ అడ్డుకోలేకపోతున్నారు. ఆర్బీఐ కూడా ఏమీ చేయలేకపోతోంది. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలే దీనికి కారణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మన్మోహన్ ప్రధానిగా ఉన్నప్పుడు రూపాయిపతనంపై మోదీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆయననుఉద్దేశించే వైరల్ చేస్తున్నారునెటిజన్లు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ముగ్గురు ఎస్పీలు, కలెక్టర్‌పై వేటు – ఈసీ కఠిన చర్యలు

ఏపీలో ఎన్నికల అనంతర హింసపై ఈసీ కొడఢా ఢుళిపించింది. పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు, శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. తిరుపతి ఎస్పీపై బదిలీ వేటుతో పాటు శాఖాపరమైన విచారణకు ఆదేశాలు...

పవన్ పోటీ చేసిన పిఠాపురంలో బిగ్ డిబేట్ ఇదే..!!

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి పిఠాపురం నియోజకవర్గంనే నెలకొంది. కూటమి గెలుపు అవకాశాలపై ఎంత చర్చ జరుగుతుందో అంతకుమించిన స్థాయిలో పవన్ గెలుపు అవకాశాలపై డిస్కషన్ కొనసాగుతోంది.పవన్ గెలుపు...

కౌంటింగ్‌కు ముందే జీవోల క్లీనింగ్ !

ఏపీ అధికారులు తొందర పడుతున్నారు. ఓ వైపు పోలింగ్ జరిగి తీర్పు ఈవీఎంలలో ఉన్న సమయంలో అనుమానాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ ఆఫీస్ సాఫ్ట్ వేర్ అప్ గ్రేడ్ పేరుతో మూసేస్తున్నారు. ఈ...

ఏపీ పోలీసు అధికారులపై మరో సారి ఈసీ కొరడా రెడీ !

ఏపీలో ఎన్నికల కోడ్ ఉన్నంత వరకూ ఏ చిన్న ఘటన జరిగినా కఠిన చర్యలు తీసుకునేందుకు ఈసీ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఢిల్లీలో ఎన్నికల సంఘం ఎదుట ఏపీ సీఎస్, డీజీపీ హాజరయ్యారు. ఏపీలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close