ఎక్స్‌క్లూజీవ్‌: సోషియో ఫాంట‌సీ క‌థ‌లో విజ‌య్‌దేవ‌ర‌కొండ‌

లైగ‌ర్‌, జన‌గ‌ణ‌మ‌న‌… ఇలా వ‌రుస‌గా రెండు సినిమాల‌తో పూరి జ‌గ‌న్నాథ్ – విజ‌య్ దేవ‌ర‌కొండ‌ల ప్ర‌యాణం దిగ్విజ‌యంగా సాగుతోంది. ఈ బంధం రెండు సినిమాల‌తోనే ప‌రిమితం కాదు. ముచ్చ‌ట‌గా మూడో సినిమా కూడా ఈ కాంబినేష‌న్‌లో రాబోతోంద‌న్న విష‌యం… తెలుగు 360 ముందే చెప్పింది. జ‌న‌గ‌ణ‌మ‌న చివ‌రి ద‌శ‌లో.. ఈ హ్యాట్రిక్ సినిమాకు సంబంధించిన ఓ అధికారిక ప్ర‌క‌ట‌న వ‌స్తుంది. అయితే… ఈ సినిమా నేప‌థ్యం గురించి ఓ ఆస‌క్తిక‌ర‌మైన అంశం.. బ‌య‌ట‌కు వ‌చ్చింది. విజ‌య్ కోసం.. పూరి ఇప్పుడు ఓ సోషియో ఫాంట‌సీ క‌థ‌ని త‌యారు చేశాడ‌ట‌. అది ‘జ‌గ‌దేక వీరుడు అతిలోక సుంద‌రి’, ‘యమ‌దొంగ‌` జోన‌ర్‌లో సాగుతుంద‌ని స‌మాచారం. పూరి ఇలాంటి క‌థ రాయ‌డం ఇదే తొలిసారి. విజ‌య్ దేవ‌ర‌కొండ కూడా ఇది వ‌ర‌కు ఈ జోనర్ ట్రై చేయ‌లేదు. సో.. వీరిద్ద‌రికీ ఇది కొత్త క‌థే!

పూరి దగ్గ‌ర క‌థ‌ల‌కు లోటు ఉండ‌దు. ఆయ‌న ద‌గ్గ‌ర బౌండెడ్ స్క్రిప్టులు 50 వ‌ర‌కూ ఉన్నాయి. అందులో… ఇదొక‌టి. ‘లైగ‌ర్’ జ‌రుగుతున్న‌ప్పుడు ‘జ‌న‌గ‌ణ‌మ‌న‌’ క‌థ చెప్పి విజ‌య్ దేవ‌రకొండ‌ని ఇంప్రెస్ చేశాడు పూరి. ఇప్పుడు ‘జ‌న‌గ‌ణ‌మ‌న‌’ చేస్తున్న‌ప్పుడే ఈ సోషియో ఫాంట‌సీ క‌థ చెప్పి మ‌రోసారి ఓకే చేయించుకొన్నాడట‌. ఇది కూడా పాన్ ఇండియా స్థాయిలో తెర‌క‌క్కించ‌నున్నార‌ని తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చంద్రముఖి కన్నా ఘోరం… ఆర్ఎస్పీ పై సోషల్ మీడియా ఫైర్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి తీహార్ జైల్లోనున్న ఎమ్మెల్సీ కవితను కలిసిన బీఆర్ఎస్ నేత ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్...

‘విద్య వాసుల అహం’ రివ్యూ: మ‌ళ్లీ పాత పెళ్లి కథే!

తెలుగు ఓటీటీ వేదిక 'ఆహా' ప్రతి వారం ఎదో ఒక కొత్త సినిమా ఉండేలా ప్లాన్ చేస్తుకుంటుంది. ఈ వారం రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ నటించిన 'విద్య వాసుల అహం' ప్రేక్షకులు...

కడప కోర్టు తీర్పు రాజ్యాంగవిరుద్ధంగా ఉందన్న సుప్రీంకోర్టు

వివేకా హత్యపై మాట్లాడవద్దని కడప కోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు మండిపడింది. కడప కోర్టు ఉత్తర్వులు సుప్రీం తీర్పునకు విరుద్ధంగా ఉన్నాయని.. వాక్ స్వాతంత్ర్యం, స్వేచ్ఛను హరించేలా ఉన్నాయని స్పష్టం...

కౌంటింగ్‌లో సహకరించాలన్నట్లుగా ఈసీని బెదిరిస్తున్న సజ్జల !

అయిందేదో అయిపోయింది.. ఇక తప్పు దిద్దుకో అని ఈసీని హెచ్చరించారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఈసీ ఏం తప్పు చేసిందో.. ఎలా దిద్దుకోవాలనుకుంటున్నారో ఆయన పరోక్షంగానే తన మాటలతో సందేశం పంపారు. అదేమిటంటే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close