మళ్లీ బీజేపీకి టీడీపీ సపోర్ట్.. అడగకుండానే !

తెలుగుదేశం పార్టీ బీజేపీతో పరిచయాలు పెంచుకునేందుకు ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. రాష్ట్రపతి ఎన్నికల్లో అడగకుండానే మద్దతు ప్రకటించిన టీడీపీ నేతలు ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనూ అదే ఉత్సాహం చూపిస్తున్నారు. చంద్రబాబునాయుడు ఢిల్లీ వెళ్లడానికి రెండు రోజుల ముందు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏకు మద్దతు ప్రకటించారు. మద్దతు కావాలని బీజేపీ అడగలేదు. పైగా కీలకమైనన్ని ఓట్లు టీడీపీకి లేవు. కేవలం నలుగురు మాత్రమే ఉన్నారు. లోక్‌సభలో ముగ్గురు, రాజ్యసభలో ఒక ఎంపీ ఉన్నారు. వీరంతా ఎన్డీఏ అభ్యర్థి జగదీప్ ధన్‌కడ్‌కు మద్దతుగా ఓటేయనున్నారు.

తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ నుంచి గత ఎన్నికలకు ముందు బయటకు వచ్చిన తర్వాత బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. అయితే ఎన్నికల్లో ఓడిపోవడతో సైలెంట్ అయ్యారు. బీజేపీపై ఎలాంటి విమర్శలు చేయడం లేదు. వీలైనప్పుడు మద్దతు పలుకుతున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లోనూ టీడీపీ మద్దతును బీజేపీ నేతలు అడగకపోయినప్పటికీ సామాజిక న్యాయం కోసం తాము మద్దతు ప్రకటిస్తున్నామని చంద్రబాబు ప్రకటించారు. ఆ తర్వాత ఏపీ పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపతి ముర్ము.., తెలుగుదేశం పార్టీ నేతలతో ఆత్మీయ సమావేశంలో కూడా పాల్గొన్నారు.

ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనూ టీడీపీ మద్దతు ఎన్డీఏకు ప్రకటించింది. బీజేపీ నేతలు అడిగారో లేదో స్పష్టత లేదు. అయితే తెలుగుదేశం పార్టీ ఇప్పటికిప్పుడు వేసుకున్న రాజకీయ ప్రణాళికల ప్రకారం బీజేపీకి వ్యతిరేకంగా వెళ్లాలని అనుకోవడం లేదు. ఇతర విపక్ష పార్టీలతో కానీ.. కాంగ్రెస్ పార్టీ కూటమి అయిన యూపీఏతోనూ కలిసే అవకాశాలు లేవు. బీజేపీతో గత శుత్రుత్వాన్ని వీలైనంతగా తగ్గించుకుని సుహృద్భావ సంబంధాలు ఏర్పాటు చేసుకోవడానికి చంద్రబాబు ప్రాధాన్యం ఇస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close