తాడికొండ ఎమ్మెల్యేకు చెక్ పెట్టిన జగన్ !

తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి జగన్ చెక్ పెట్టేశారు. ఆమెను చాలా రోజులుగా దూరం పెడుతూ వచ్చారు. ఇప్పుడు ఆమె ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ తాడికొండకో అదనపు సమన్వయకర్తగా డొక్కా మాణిక్యవరప్రసాద్‌ను నియమించారు. సాధారణంగా ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల వారే సమన్వయకర్తలు. ఇతరులను నియమించరు. కానీ తాడికొండలో మాత్రం సీన్ మారిపోయింది. ఉండవల్లి శ్రీదేవి అవసరం ఇక వైసీపీకి లేదని భావించడంతో డొక్కాకు బాధ్యతలిచ్చినట్లుగా తెలుస్తోంది.

వివాదాస్పద ప్రవర్తన ఉండవల్లి శ్రీదేవిపై పార్టీ హైకమాండ్‌కు విముఖత పెరిగేలా చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఆమె పార్టీ చేయమన్నట్లుగా చేశారు. రాజధానికి వ్యతిరేకంగా గళమెత్తారు. తమకు రాజధాని అవసరం లేదన్నారు. సొంత నియోజకవర్గంలోని రైతుల్ని పెయిడ్ ఆర్టిస్టులన్నారు. భూములన్నీ ఓ సామాజికవర్గానివే అన్నారు. చివరికి తమ పార్టీలో వర్గ పోరాటాల్ని కూడా టీడీపీకి అంటగట్టి కుల గొడవలు రేపారు. అయితే ఎన్ని చేసినా సొంత పార్టీలో ఆమెకు ప్రాధాన్యం దక్కలేదు.

ఆమెపై తరచూ వివాదాలు వచ్చాయి. డబ్బులు తీసుకుని ఎగ్గొట్టారని పలువురు నేతలు ఆరోపించారు. ఈ పరిణామాలతో వచ్చే ఎన్నికల్లో ఆమెకు టిక్కెట్ ఇస్తే నిండా మునిగిపోతామని భావించి జగన్ జాగ్రత్త పడినట్లుగా తెలుస్తోంది. డొక్కా మాణిక్యవరప్రసాద్ గతంలో తాడికొండ నుంచి రెండు సార్లు గెలిచారు. మంత్రి కూడా అయ్యారు. ఓడిపోయిన తర్వాత టీడీపీలో చేరి ప్రత్తిపాడు నుంచిపోటీ చేశారు. ఓడిపోవడంతో…. మూడు రాజధానులకు వ్యతిరేకంగా టీడీపీకి.. ఎమ్మెల్సీకి రాజీనామా చేశారు. అయితే విచిత్రంగా మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్న వైసీపీలో చేరి తాను రాజీనామా చేసిన ఎమ్మెల్సీ స్థానానికే వైసీపీ తరపున ఎన్నికయ్యారు. ఇప్పుడు ఉండవల్లి శ్రీదేవి సీటుకే ఎసరు పెట్టారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీ టెన్షన్ : చంద్రబాబు ఎక్కడికెళ్లారు ?

చంద్రబాబు ఎక్కడికి వెళ్లారు..మాకిప్పుడే తెలియాల్సిందే అని వైసీపీ నేతలు గింజుకుటున్నారు. చంద్రబాబు, లోకేష్ కనిపించకపోయే సరికి వారేమీ చేస్తున్నారో .. ఆ చేసే పనులేవో తమను బుక్ చేసే పనులేమో అని...

వైసీపీ విమర్శలకు చెక్ పెట్టిన పవన్

పిఠాపురంలో జనసేనానిని ఓడించాలని వైసీపీ ఎన్ని ప్రయత్నాలు చేసిందో లెక్కే లేదు. వ్యక్తిగత విషయాలను తెరమీదకు తీసుకొచ్చి పవన్ పాపులారిటీని తగ్గించాలని ప్రయత్నించింది.ఇందుకోసం పవన్ నాన్ లోకల్ అని, నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో...

గుర్తొస్తున్నారు.. నాయుడు గారు

"ఆయన లేని లోటు పూడ్చలేనిది" సాధారణంగా ప్రఖ్యాత వ్యక్తులు వెళ్ళిపోయినప్పుడు జనరల్ గా చెప్పే వాఖ్యమిది. కానీ నిజంగా ఈ వాఖ్యానికి అందరూ తగిన వారేనా?! ఎవరి సంగతి ఏమోకానీ మూవీ మొఘల్...

చీఫ్ సెక్రటరీ బోగాపురంలో చక్కబెట్టి వెళ్లిన పనులేంటి ?

చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి సీక్రెట్ గా చాలా పనులు చక్క బెడుతున్నారు. అందులో బయటకు తెలిసినవి.. తెలుస్తున్నవి కొన్నే. రెండు రోజుల కిందట ఆయన భోగాపురం విమానాశ్రయం నిర్మాణం జరుగుతున్న...

HOT NEWS

css.php
[X] Close
[X] Close