కవిత స్కాం చెస్తే చెప్పాల్సింది సీబీఐ కదా !?

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత అంటూ బీజేపీ నేతల చేస్తున్న హడావుడి చాలా ఎక్కువగా ఉంది. దీంతో ఆమె తనపై అసత్య ఆరోపణలు చేస్తున్న వారిపై దావా వేయాలని నిర్ణయించుకున్నారు. ఈ అంశంపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అందులో ఎక్కడా కవిత పేరు ప్రస్తావించలేదు. ఢిల్లీ లిక్కర్ స్కాంకు కేంద్రం హైదరాబాద్ అని.. మనీష్ సిసోడియా చాలా సార్లు హైదరాబాద్ వెళ్లి చర్చలు జరిపి డీల్ కుదుర్చుకున్నారని బీజేపీ ఆరోపిస్తోంది. నేరుగా కల్వకుంట్ల కవితను టార్గెట్ చేశారు.

నిజంగా ఇలాంటిదేమైనా ఉంటే.. సీబీఐ దర్యాప్తులో తేలుతుంది. బీజేపీ నేతల దగ్గర ఖచ్చితమైన సమాచారం ఏదైనా ఉంటే.. ముందుగా సీబీఐ చట్టపరమైన చర్యలు తీసుకుంటే నమ్మశక్యంగా ఉంటుంది కానీ..బీజేపీ నేతలు ఇలా ఆరోపణలు చేస్తే ఖచ్చితంగా రాజకీయమనే అనుకుంటారు. బీజేపీ నేతలు చెప్పిన విషయాల్నే రేపు తాము దర్యాప్తులో కనుగొన్నామని సీబీఐ అధికారులు ప్రకటిస్తే.. చాలా మందికి సందేహాలు వస్తాయి. బీజేపీ నేతలు చెప్పిందే సీబీఐ చెబుతోందని విమర్శలు వస్తాయి.

ఒక వేళ సీబీఐ ఆ ఆరోపణలు చేయకపోతే బీజేపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేసినట్లు ప్రజలు నమ్ముతారు. ఇలాంటి పరిస్థితి వస్తుందని తెలిసి కూడా బీజేపీ నేతలు ఎందుకు కవితపై ఆరోపణలను హైలెట్ చేస్తున్నారన్నది చర్చనీయాంశం మారింది. రాజకీయంగా కేసీఆర్‌పై ఒత్తిడి తీసుకు రావాలని ప్రయత్నిస్తున్నట్లుగా భావిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close