ఆ అమ్మాయి కోసం… విజ‌య్ వెయిటింగ్‌!

రేపు ఏకంగా 4 సినిమాలు విడుద‌ల అవుతున్నాయి. వాటిలో… ఆ అమ్మాయి గురించి చెప్పాలి సినిమా ఒక‌టి. ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సినిమా ఇది. సుధీర్ బాబు హీరో. ఈ సినిమా ఫ‌లితం ఎలా ఉంటుందా..? అని విజ‌య్ దేవ‌ర‌కొండ ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే దిల్ రాజు బ్యాన‌ర్‌లో విజ‌య్ ఓ సినిమా చేయాలి. దిల్ రాజు.. చాలా మంది ద‌ర్శ‌కుల‌తో క‌థ‌ల విష‌యంలో చ‌ర్చిస్తున్నాడు. అందులో ఇంద్ర‌గంటి మోహ‌న కృష్ణ ఒక‌డు. ఇంద్ర‌గంటితో సినిమా అంటే కొన్ని సౌల‌భ్యాలున్నాయి. ఒక‌టి.. సినిమాని తొంద‌ర‌గా, అనుకొన్న బ‌డ్జెట్ లో పూర్తి చేసి ఇవ్వ‌గ‌ల‌డు. మినిమం గ్యారెంటీ ఉంటుంది. అన్నింటికంటే ముఖ్యంగా విజ‌య్‌కి ఓ రొమాంటిక్ ఎంట‌ర్‌టైనర్ కావాలిప్పుడు. ఈ జోన‌ర్‌లో.. ఇంద్ర‌గంటి దిట్ట‌. సో.. విజ‌య్ ఇంద్ర‌గంటితో సినిమా చేయ‌డానికి చాలా ఇంట్ర‌స్ట్ చూపిస్తున్నాడు. అయితే.. ఎవ‌రికి ఛాన్స్ ఇవ్వాల‌న్నా.. హిట్‌, ఫ్లాపుల ట్రాక్ చూడ‌డం త‌ప్ప‌నిస‌రి. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి హిట్ట‌యితే… విజ‌య్ – ఇంద్ర‌గంటి కాంబోకి త‌లుపులు తెర‌చుకొన్న‌ట్టే. ఫ‌లితం తేడా కొడితే మాత్రం విజ‌య్ అంత రిస్క్ చేయ‌క‌పోవొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ లైగ‌ర్ రూపంలో.. విజ‌య్‌కి గ‌ట్టి దెబ్బ త‌గిలింది. ఇలాంటి టైమ్ లో విజ‌య్ రిస్క్ చేయ‌డు. సో… ఈ కాంబో ఉంటుందా, లేదా? అనేది రేపు ఈపాటికి తేలిపోతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close