మీడియా వాచ్ : ఈనాడు డైరక్ట్ ఎటాక్ – కిక్కురుమనని వైసీపీ !

ఇటీవలి కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో ఈనాడు పేపర్ చూస్తున్న వారికి స్పష్టమైన మార్పు సులువుగానే తెలిసిపోతుంది. ప్రభుత్వంపై నేరుగా ఎటాక్ చేస్తున్నారు. ప్రభుత్వ తప్పిదాలను మొహమాటం లేకుండా ఎత్తి చూపుతున్నారు. పాలనా వైఫల్యాలు.. శాంతిభద్రతల వైఫల్యాలపై విపక్షాలు ఆరోపిస్తున్నట్లుగా కాకుండా.. నేరుగా తామే పోరాటం చేస్తున్నారు. ఈ కథనాలు అందర్నీ ఆలోచింపచేసేవిలా ఉంటున్నాయి. ఈ రోజు కూడా సీఐడీ తీరుపై స్పష్టమైన కథనం ఇచ్చారు. ఆ కథనం చదివిన ఎవరికైనా.. ఏపీసీఐడీ అనే పోలీసు వ్యవస్థ చట్టబద్ధమైన ప్రైవేటు సైన్యంగా మారి… రాజ్యాంగ వ్యతిరేకంగా పని చేస్తుందని తీర్మానానికి వచ్చేస్తారు.

రాజధాని, పోలవరం, ఇసుక విధానం, రోడ్లు, అభివృద్ధి పనులు ఇలా ప్రతి అంశంలోనూ ఈనాడు డైరక్ట్ ఎటాక్ చేస్తోంది. కానీ వైసీపీ దగ్గర సమాధానం ఉండటం లేదు. ఎందురుదాడి చేసి బూతులు తిట్టడానికి కూడా సంశయిస్తున్నారు. దీనికి కారణం ఆ కథనాల్లో ఉన్న స్పష్టతేనని అనుకోవచ్చు. సాక్షి పత్రిక ఖండిస్తే అందులో ఎదురు ఆరోపణలు ఉంటాయి కానీ నిజాలు రాయరు. ఎందుకంటే.. రాసినవన్నీ నిజాలే కాబట్టి.. మీరు చేయలేదా.. చరిత్రలో ఎవరూ చేయలేదా.. ఇప్పుడు మేం చేస్తే నోప్పెంటి అని అసభ్యకరమైన భాషలో తిట్టి కార్టూన్లు వేసి.. ఎదురుదాడి చేయడమే చేస్తూంటారు.

గత మూడున్నరేళ్లుగా ఈనాడు చాలా వరకూ సంయమనం పాటించింది. రిపోర్టింగ్ చేస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు నేరుగా బాధ్యత తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. అందుకే పత్రికలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఇది చాలా మందిని ఆకర్షిస్తోంది. బాధితుల పక్షాల నిలబడటం అంటే ఇదీ అంటున్నారు. ఈనాడులో గత ఫ్లేవర్ రావడానికి ఓ రకంగా వైసీపీనే కారణం. వీలైనంత సంయమనంతో ఉన్న ఈనాడును వైసీపీ నేతలే అనవసర విమర్శలతో రెచ్చగొట్టారు. ఇది ఎక్కడి వరకూ వెళ్తుందో చూడాల్సి ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

పదేళ్ల తర్వాత ఓయూపై స్పందించిన కేసీఆర్

తెలంగాణ ఉద్యమ సమయంలో నిత్యం ఓయూను పలవరించిన కేసీఆర్.. గద్దెనెక్కాక ఒక్కసారి కూడా ఓయూను సందర్శించలేదు. విద్యార్థులు రోడ్డెక్కి ప్రొఫెసర్లను నియమించాలని,స్కాలర్ షిప్స్ పెంచాలని, వసతి గృహాల్లో నాణ్యమైన ఆహారం అందించాలని డిమాండ్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close