నిర్మాత కాట్రగడ్డ మురారి ఇక లేరు

సీనియర్ నిర్మాత కాట్రగడ్డ మురారి కన్నుమూశారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న ఆయన చెన్నై లో తుది శ్వాస విడిచారు. సినిమాలపై ఆసక్తితో వైద్య విద్య మధ్యలో ఆపేసి సినీ నిర్మాణ రంగంలోకి ప్రవేశించారు మురారి. త్రిశూలం, శ్రీనివాస కళ్యాణం, జానకి రాముడు, నారి నారి నడుమ మురారి లాంటి పలు విజయవంతమైన సినిమాలు నిర్మించారు.

మురారి తన సినిమాల్లో సంగీతానికి ప్రాముఖ్యం ఇచ్చేవారు. ఆయన నిర్మించిన సినిమాల్లో ఎక్కువగా కె. వి. మహదేవన్ స్వరపరిచినవే. సాహిత్యం, సంగీతంకు ఎక్కువ విలువల ఇచ్చేవారు. మహదేవన్ స్వరం, ఎస్పీబీ పాట లేకుండా ఆయన సినిమా తీసేవారు కాదు. ‘నవ్విపోదురుగాక’ పేరతో ఆయన రాసిన ఆయన ఆత్మకథ కొన్ని వివాదాలకు కూడా దారితీసింది. ఎక్కడా రాజీపడని నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు మురారి. ఆయన మృతి పట్ల పలువులు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పోలింగ్ తగ్గించాలనే వైసీపీ “దాడుల ప్లాన్” పెయిల్ !

వీలైనంత వరకూ పోలింగ్ తగ్గించాలని వైసీపీ ముందుగానే ప్లాన్ చేసుకుంది. కీలకమైన నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రారంభం కాక ముందే టీడీపీ ఏజెంట్లపై దాడులు చేసి వాటిని విస్తృతంగా ప్రచారం చేయాలనుకున్నారు. అనుకున్నట్లుగా...

ఆ చెంపదెబ్బ వైసీపీ ఎమ్మెల్యేకి కాదు వైసీపీకే !

ఏపీలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన వెంటనే అ పెద్ద అపశకునం వైసీపీకి వచ్చింది. అది కూడా తమ ఎమ్మెల్యేకు చెంపదెబ్బ రూపంలో. తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చెంప...

థియేట‌ర్ Vs ఓటీటీ… తీర్పు మారుతోందా?

సినిమా వెండితెరపై ఆస్వాదించే వినోదం. ఒక సమూహంతో కలసి థియేటర్ లో సినిమా చూడటంలో కిక్కే వేరు. అయితే ఇప్పుడు థియేటర్ కి సమాంతరంగా ఓటీటీ కూడా ఎదుగుతోంది. సినిమా వ్యాపారంలో కీలక...

ఇదేందయా ఇది- కిషన్ రెడ్డిపై కంప్లైంట్..!

కేంద్రమంత్రి, సికింద్రాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి కిషన్ రెడ్డి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఈసీకి ఫిర్యాదు అందింది. ఓటు వేసిన అనంతరం ఎన్నికల ప్రవర్తన నియామళికి విరుద్దంగా ఆయన వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close