కేసీఆర్ సైలెన్స్ కూడా వయోలెంటే – బీజేపీకి టెన్షన్ !

బాగా సౌండ్ వచ్చిన తరవాత ఒక్కసారిగా నిశ్మబ్దం ఆవరిస్తే.. అది కూడా చాలా వయోలెంట్‌గానే ఉంటుంది. ఒక్కోసారి నిశ్మబ్దమే భయంకరంగా ఉంటుంది. ఇప్పుడు కేసీఆర్ మౌనం బీజేపీ నేతలకు అలాగే అనిపిస్తోంది. ఇంత జరుగుతున్నా కేసీఆర్ ఎందుకు మాట్లాడటం లేదని వారు మథనపడుతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే.. ఆయన మాట్లాడితే ఇంకెలా ఉంటుందోననే బీజేపీ నేతల ఆందోళనకు కారణం.

తెలంగాణ సీఎం కేసీఆర్ నోరు తెరవడం లేదు. టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చే ప్రక్రియను దసరా రోజు ప్రారంభించారు. ఆ రోజే ప్రెస్ మీట్ పెడతామన్నారు. కానీ రోజులు గడిచిపోతున్నాయి. మధ్యలో వారం రోజులు ఢిల్లీ వెళ్లి వచ్చారు. కానీ ఇప్పటి వరకూ మాట్లాడలేదు. ఇప్పుడు బీజేపీ తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిందని స్టింగ్ ఆపరేషన్ చేయించి మరీ బయట పెట్టించారు. సాక్ష్యాలు కూడా ప్రజల్లోకి విడుదల చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా కేసీఆర్ మీడియా ముందుకు రాలేదు. ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పలేదు.

కేసీఆర్ మౌనం వెనుక వ్యూహం ఉంటుందని టీఆర్ఎస్ నేతలు చెబుతారు. నిజంగానే కేసీఆర్.. మౌనంగా ఉన్న తర్వాత ఒక్క సారిగా రాజకీయ వ్యూహం మార్చేసుకుని రంగంలోకి దిగుతారు. తెలంగాణ ఉద్యమం నుంచి అదే జరుగుతోంది. మూడు రోజులుగా కేసీఆర్ ఇవాళ మీడియాతో మాట్లాడుతారని లీకులు వచ్చాయి. కానీ అలాంటిది జరగలేదు. ముగ్గురు ఎమ్మెల్యేలు ప్రగతి భవన్‌లోనే ఉన్నారు. వారితో ఏం చేస్తున్నారో కానీ.. ఇంకా మీడియా సమావేశంపై స్పష్టత ఇవ్వలేదు.

మరో వైపు ఎమ్మెల్యేల్ని తీసుకుని ఢిల్లీ వెళ్తారని అక్కడే విషయాన్ని బయట పెడతారన్న ప్రచారం జరుగుతోంది. దానిపైనా స్పష్టత లేదు. బీజేపీ నేతలు మాత్రం కేసీఆర్ ఎంత త్వరగా మౌనం వీడి.. తాను చెప్పాలనుకున్నది.. చేయాలనుకున్నది చేస్తే..తమ ఎదురుదాడి చేసుకోవచ్చని అనుకుంటున్నారు. కేసీఆర్ ఆ చాన్స్ ఎంత వరకూ ఇస్తారో మరి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close