షర్మిల 3 వేల కి.మీ నడక పూర్తి – ఎవరైనా పట్టించుకున్నారా?

వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల చేపట్టిన పాదయాత్ర మంచిర్యాల జిల్లాలో మూడు వేల కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. గత ఏడాది జూలై 8న షర్మిల వైఎస్సార్ తెలంగాణ పార్టీ పేరుతో రాజకీయ పార్టీ స్థాపించారు. అ గత సంవత్సరం అక్టోబర్ 20న రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల నుంచి ఆమె ఈ యాత్రను ప్రారంభించారు. తెలంగాణలోని హైదరాబాద్ మినహా అన్ని ఉమ్మడి జిల్లా మీదుగా షర్మిల యాత్ర కొనసాగుతోంది. ఇప్పటికి మూడు వేల కిలోమీటర్లు అయింది. వెయ్యి..రెండు వేల కి.మీ మైలు రాయి దాటినప్పుడు ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడూ అంతే.

ఎప్పట్లాగే మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకున్న సందర్భంగా విజయమ్మ వెళ్లారు. తన కుమార్తెకు ఒక్క చాన్స్ ఇవ్వాలన్నారు. రాజశేఖర్ రెడ్డి స్వర్ణయుగాన్ని తెలంగాణలో మళ్లీ తేవాలన్న ఉద్దేశంతోనే షర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టిందని చెప్పుకొచ్చారు. యాత్ర ఆపాలని ఎన్నో కుట్రలు చేసినా..షర్మిల తలవంచలేదు..తలదించలేదన్నారు. సంకల్పంతోనే పాదయాత్ర చేస్తూ…ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంటోందని చెప్పారు.

పాదయాత్రను ఎవరూ పట్టించుకోకపోవడంతో విపక్ష నేతలపై తిట్ల దండకం అందుకుంటున్నారు. వారు స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తే నన్ను చంపేస్తారా అంటూ డ్రామాలాడే ప్రయత్నంచేశారు. కానీ ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పటీకీ ప్రధాన రాజకీయ పార్టీల్లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరు వినిపించడం లేదు. పార్టీ పెట్టిన తర్వాత రెండు సార్లు ఉపఎన్నికలు వచ్చాయి. హుజూరాబాద్‌లో పాటు మునుగోడు ఉపఎన్నికలు వచ్చినా.. షర్మిల పోటీ చేయలేదు. తమ బలం ఎంతో ప్రదర్శించాలని అనుకోలేదు. పార్టీలో షర్మిల తప్ప గుర్తుంచుకునే మరొక నేత లేకపోవడం కూడా మైనస్ అవుతోంది. షర్మిల కోసం ఆమె తల్లి పని చేస్తున్నారు. కానీ ఎంత వరకు వర్కవుట్ అవుతుందనేది అంచనా వేయడం కష్టమే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కవిత బెయిల్ పిటిషన్ పై నేడే తీర్పు..

లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పై సోమవారం తీర్పు వెలువరించనుంది రౌస్ అవెన్యూ కోర్టు. ఈ కేసులో తనను ఈడీ, సీబీఐలు అక్రమంగా అరెస్ట్ చేశాయని, తనకు బెయిల్...

నేడు ఏపీలో ప్రధాని పర్యటన..వైసీపీని టార్గెట్ చేస్తారా.?

సోమవారం ఏపీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు ప్రధాని నరేంద్ర మోడీ.అనకాపల్లిలో బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ కు మద్దతుగా బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. సాయంత్రం 5 : 30 గంటలకు...

ఓటేస్తున్నారా ? : మీ పిల్లలు బానిసలుగా బతకాలనుకుంటున్నారా ?

ఊరంటే ఉపాధి అవకాశాల గని కావాలి. మనం ఊళ్లో బతకాలంటే పనులు ఉండాలి. ఆ పనులు స్థాయిని బట్టి రియల్ ఎస్టేట్ పనుల దగ్గర నుంచి సాఫ్ట్...

తెలంగాణ మోడల్…బీజేపీ, బీఆర్ఎస్ కు రాహుల్ అస్త్రం ఇచ్చారా..?

కేంద్రంలో అధికారంలోకి వస్తే దేశమంతా తెలంగాణ మోడల్ ను అమలు చేస్తామని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటన చర్చనీయాంశం అవుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి ఆరు నెలలే అవుతున్నా అప్పుడే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close