ప్ర‌స్తుతానికి బ‌తికే ఉన్నా: స‌మంత ఎమోష‌న‌ల్ కామెంట్స్‌

స‌మంత ఆరోగ్య ప‌రిస్థితి ఏం బాలేదు. ఆ విష‌యాన్ని స‌మంతే ప్ర‌క‌టించింది. త‌ను చికిత్స తీసుకొంటున్న‌ట్టు చెప్పింది. త్వ‌ర‌లోనే కోలుకొంటాన‌ని ధీమా వ్య‌క్తం చేసింది. అయితే… కొన్ని వెబ్ సైట్లూ, యూ ట్యూబ్ ఛాన‌ళ్లూ స‌మంత‌పై ర‌క‌ర‌కాల వార్త‌లు రాసేసి, క‌థ‌నాలు ప్ర‌చారం చేశాయి. `స‌మంత చావు బ‌తుకుల్లో ఉంది` అంటూ హెడ్డింగులు పెట్టి వ్యూస్ కోసం అడ్డదారులు తొక్కింది. ఈ విష‌యం స‌మంత వ‌ర‌కూ వెళ్లింది. అందుకే కాస్త ఎమోష‌న‌ల్ గా స్పందించింది.

స‌మంత న‌టించిన ‘య‌శోద‌’ శుక్ర‌వారం విడుద‌ల అవుతోంది. ఇంత అనారోగ్యంలోనూ.. స‌మంత ఈ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో పాల్గొంటోంది. స‌మంత వీడియో ఇంట‌ర్వ్యూ ఇప్పుడు బ‌య‌ట‌కు వ‌చ్చింది. అందులో… స‌మంత ప్ర‌తీ ప్ర‌శ్న‌కు ఓపిగ్గా స‌మాధానం ఇచ్చింది. ఆరోగ్యంపై వ‌చ్చిన వార్త‌లపై స్పందించింది. ఎలా ఉన్నారు? అని అడిగితే.. ”బతికే ఉన్నా – ప్ర‌స్తుతానికైతే చావ‌లేదు” అంటూ ఎమోష‌న‌ల్ గా బ‌దులు ఇచ్చింది. `నా ఆరోగ్యంపై వ‌చ్చిన వార్త‌లు హెడ్డింగులు చ‌దివా. వాటి గురించి ప్ర‌స్తుతం అన‌వ‌స‌రం` అంటూ స‌మాధానం దాటేసింది. త‌న ఆరోగ్యంపై వ‌చ్చిన క‌థ‌నాల ప‌ట్ల‌.. స‌మంత పూర్తి అసంతృప్తితో, అస‌హ‌నంతో ఉన్న‌ట్టు స‌మంత మాట‌ల్ని బ‌ట్టి అర్థ‌మ‌వుతోంది. ”నేను ఫైట్ చేస్తున్నా. ప్ర‌స్తుతం ఉన్న స్థితిలో అది అంత ప్రాణాంత‌కం కాదు. చాలామంది ఎన్నో స‌వాళ్ల‌తో యుద్ధం చేస్తున్నారు. అంతిమంగా విజ‌యం మ‌న‌దే” అంటూ ఆశాభావం వ్య‌క్తం చేసింది స‌మంత‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సీఎస్‌ను తప్పిస్తే మొత్తం సెట్ రైట్ – ఎందుకు మార్చరు ?

ఏపీలో జరుగుతున్న సర్వ అవకతవకలకు కారణం చీఫ్ సెక్రటరీ. జగన్ రెడ్డి జేబులో మనిషిగా వ్యవహరిస్తూ వ్యవస్థలన్నింటినీ భ్రష్టుప్టటిస్తున్నారు. చివరికి అల్లర్లపై విచారణ చేయడానికి సిట్ అధికారులుగా ఏసీబీ వాళ్లను..సీఐడీలో పని...

ఏబీవీపై అవే కుట్రలు – భస్మాసుర సివిల్ సర్వీస్ ఆఫీసర్లు !

మీరు ఏది చేస్తే మీకు అది తిరిగి వస్తుందని గీత చెబుతోంది. చాలా మంది అధికారంలో ఉన్నప్పుడు చెలరేగిపోయి.. తర్వాత అలాంటివే తమకు జరుగుతూంటే.. గగ్గోలు పెడుతూంటారు.కానీ ఎవరి సానుభూతి రాదు. చరిత్రలో...

మౌనంగా విజయసాయిరెడ్డి – ఆడిటింగ్‌లోఉన్నారా ?

జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు విదేశాలకు వెళ్లినా విజయసాయిరెడ్డి కూడా వెళతారు. అయితే జగన్ వెళ్లిన దేశానికి కాదు. వేరే దేశాలకు వెళ్తారు. ఈ లింక్ ఏమిటో తెలియదు కానీ.....

అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్‌కు అలా అనిపించలేదా ?

" ఈ రోజు తెలంగాణకు కావలసింది అధికార స్వరాలు కాదు.. ధిక్కార స్వరాలు.. ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకలు" అని గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ గురించి కేటీఆర్ చేసిన ట్వీట్ పై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close