టు స్టేట్స్ టూర్ : తెలంగాణలో మాత్రమే అవినీతి పాలన చూసిన మోదీ !

ప్రధాని మోదీ ఒకే రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్యటించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చాలా స్పష్టంగా ప్రసంగాల్లో తేడా కనిపించింది. ఏపీలో చాలా సాదాసీదాగా ప్రసంగించారు. వైసీపీ ప్రస్తావన కానీ .. జగన్ పాలన తీరు కానీ ఆయన దృష్టికి వెళ్లలేదు. మాట్లాడలేదు. కానీ తెలంగాణలో మాత్రం అటు పార్టీ కార్యకర్తల సమావేశంతో పాటు.. అధికారిక కార్యక్రమంలోనూ రాజకీయ వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్‌ను టార్గెట్ చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ నేతలు వైసీపీ ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు చేస్తూ ఉంటారు. అవినీతి పాలన అంటారు. ఏపీని భ్రష్టు పట్టించారని మూడు రాజధానుల పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపిస్తూ ఉంటారు. కానీ ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటనలో మాత్రం అలాంటి విమర్శలేమీ వినిపించలేదు. తెలంగాణ వెళ్లిన వెంటనే మోదీ మాట మారిపోయింది. పూర్తి స్థాయిలో టీఆర్ఎస్‌ను టార్గెట్ చేశారు. తెలంగాణ ప్రజలు ఇక్కడి అవినీతి, కుటుంబ పాలనపై పోరాడుతున్నారని ప్రకటించారు. అవినీతి, కుటుంబ పాలన వల్ల జరుగుతున్న నష్టాన్ని బీజేపీ భర్తీ చేస్తుందన్నారు. బీజేపీ నేతల పోరాటంతో మోదీ మాటలు సింక్ అయ్యాయి.

మోదీ పర్యటన ఎఫెక్ట్ ఏపీ బీజేపీపైనే ఎక్కువ పడే అవకాశం కనిపిస్తోంది. వారు ఇక ఏ పోరాటం చేసినా ప్రయోజనం ఉండే అవకాశం లేదు. ఎందుకంటే మోదీనే ఏపీకి వచ్చి ఏమీ మాట్లాడకుండా వెళ్లిపోయారు. తెలంగాణలో బీజేపీ ప్రధాన పోటీదారుగా ఎదిగింది. ఏపీలో లేదు.అందుకే మోదీ.. ఏపీలో మద్దతుగా ఉంటున్న వైఎస్ఆర్‌సీపీ విషయంలో సాఫ్ట్‌గా ఉండి.. ప్రత్యర్థిగా మారిన టీఆర్ఎస్ విషయంలో కఠినంగా మాట్లాడారని అంటున్నారు. అదే సమయంలో.. ఏపీలో రాజకీయ సభ పెట్టలేదని కవరింగ్ చేసుకుంటున్నారు. ఎవరు పెట్టవద్దన్నారు.. రోడ్ షో బదులు చిన్న సభ పెట్టుకుంటే సరిపోయేదిగా? ఇవన్నీ వైసీపీ ని విమర్శించకుండా తప్పించుకోవడానికి సాకులు.

మొత్తంగా అవినీతి పాలన విషయంలో మోదీది అందరిపై ఒకే అభిప్రాయం లేదని.. తనకు వ్యతిరేకులైన వారిపై మాత్రమే అవినీతి ముద్ర ఉంటుందని ఆయన మరోసారి నిరూపించినట్లయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అప్పుడే ఓటమికి కారణాలు చెప్పేసిన మంత్రి..!?

సర్వేలన్నీ కూటమిదే అధికారమని తేల్చడం, పోలింగ్ శాతం పెరగడంతో వైసీపీ నేతలు అప్పుడే ఓటమికి కారణాలు వెతుక్కుంటున్నారు. కారణం ప్రభుత్వ వ్యతిరేకత కాదని, సొంత పార్టీ నేతలే వెన్నుపోటు పొడిచారని ఆరోపిస్తున్నారు. సాధారణ...

ఏపీలో ముగిసిన పోలింగ్ …పోలింగ్ పెరగడంతో వైసీపీలో టెన్షన్..?

ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. కొన్ని ప్రాంతాల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పలుచోట్ల ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పలు జిల్లాలో వైసీపీ , టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు...

పోలింగ్ తగ్గించాలనే వైసీపీ “దాడుల ప్లాన్” పెయిల్ !

వీలైనంత వరకూ పోలింగ్ తగ్గించాలని వైసీపీ ముందుగానే ప్లాన్ చేసుకుంది. కీలకమైన నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రారంభం కాక ముందే టీడీపీ ఏజెంట్లపై దాడులు చేసి వాటిని విస్తృతంగా ప్రచారం చేయాలనుకున్నారు. అనుకున్నట్లుగా...

ఆ చెంపదెబ్బ వైసీపీ ఎమ్మెల్యేకి కాదు వైసీపీకే !

ఏపీలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన వెంటనే అ పెద్ద అపశకునం వైసీపీకి వచ్చింది. అది కూడా తమ ఎమ్మెల్యేకు చెంపదెబ్బ రూపంలో. తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చెంప...

HOT NEWS

css.php
[X] Close
[X] Close