కవితను పార్టీ మారమని బెదిరించారు : కేసీఆర్

తన కుమార్తెను కూడా బీజేపీలోకి రావాలని బెదిరించారని..ఇంత కంటే దుర్మార్గం ఉంటుందని టీఆర్ఎస్ అధినేత కేటీఆర్ .. పార్టీ కార్యవర్గ సమావేశంలో వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది. కవితపై ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు వచ్చిన తర్వాత కేసీఆర్ ఎలాంటి స్పందనా వ్యక్తం చేయలేదు. బహిరంగంగా కానీ.. పార్టీ నేతలతో కానీ ఎప్పుడూ మాట్లాడలేదు. అయితే కార్యవర్గ సమావేశంలో మాత్రం కవిత అంశాన్ని ప్రస్తావించారు. ఈడీ దాడులు చేసిన తర్వాత కవితను బీజేపీలోకి రావాలని ఒత్తిడి చేసినట్లుగా కేసీఆర్ చెప్పారు. ఇంత కంటే దుర్మార్గం ఏముంటుందని ఆయన వ్యాఖ్యానించడం టీఆర్ఎస్ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.

ఐటీ, ఈడీ, సీబీఐ దాడుల గురించి చెబుతూ.. కేసీఆర్ ఈ వ్యాఖ్యలుచేసారు. బీజేపీతో ఇక యుద్ధమే ఉంటుందని.. బీజేపీ ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తోంది..జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఐటీ, ఈడీ దాడులు జరిగే అవకాశం ఉందని అయినప్పటికీ భయపడవద్దని.. ఆందోళనకు గురి కావొద్దని ఎమ్మెల్యేలకు ముఖ్య నేతలకు కేసీఆర్ భరోసా ఇచ్చారు. ఇప్పటికే పది మంది ఎమ్మెల్యేలపై గురి పెట్టారని.. వారి పేర్లను సమావేశంలో కేసీఆర్ వివరించినట్లుగా చెబుతున్నారు. ఫిర్యాదులు బీజేపీ నేతలే చేయించి.. దాడులు చేస్తారని కేసీఆర్ అంచనా వేశారు. ప్రస్తుతం బీజేపీతో జరుగుతున్న పోరాటం ముందు ముందు ఇంకా ఎక్కువగా జరుగుతుది కావున.. పొరపాట్లు చేయవద్దని సూచించినట్లుగా తెలుస్తోంది.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితను ఇరికించడానికి కారణం పార్టీ మారడానికి అంగీకరించకపోవడమేనన్న అర్థంలో కేసీఆర్ చెప్పినట్లుగా ఉండటం కూడా చర్చనీయాంశమవుతోంది. మరో వైపు ఈ సమావేశంలో ముందస్తు ఎన్నికలు ఉండని కేసీఆర్ స్పష్టం చేశారు. మరో పది నెలల్లో ఎన్నికలు ఉంటాయని.. అందరూ జనంలోనే ఉండాలని ఆదేశించారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలెవరూ ఆందోళన చెందవద్దని.. అందరికీ మళ్లీ అవకాశం కల్పిస్తామని భరోసా ఇచ్చారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close