శరత్ చంద్రారెడ్డికీ ముప్పు ఉందంటున్న టీడీపీ!

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టయిన శరత్ చంద్రారెడ్డికి జడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పించాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. ఆయనతో డిల్లీలో చెవిరెడ్డి జరిపిన చర్చలు దేనికని అడుగుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టయిన శరత్‌ చంద్రారెడ్డిని రౌజ్‌ అవెన్యూ కోర్టు ఆవరణలో వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కలిశారు. దాదాపు గంట సేపు మాట్లాడారు. కుటుంబసభ్యులు మాత్రమే కలవడానికి పర్మిషన్ ఉంటుంది. కానీ చెవిరెడ్డి మాత్రం దర్జాగా కలిశారన్న ఆరోపణలు వస్తున్నాయి.

అసలు చెవిరెడ్డికి ఏం సంబంధం ఉందని.. బాబాయ్‌ని చంపిన గొడ్డలికి ఇంకా రక్తం మరకలు ఆరలేదని బెదిరించడానికా .. అమిత్ షా కాళ్లుపట్టుకుని అయినా కాపాడతాడని చెప్పడానికి కలిశారా అని టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి ప్రశఅనించారు. శరత్ చంద్రారెడ్డి ప్రాణాలకి మాఫియా వల్ల ప్రాణహాని ఉందని, ఈడీ, సీబీఐ అధికారులు వెంటనే జెడ్ క్యాటగిరీ సెక్యూరిటీ కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక విమానాలను జగన్ గతంలో కూడా బేగంపేట నుంచే ఏర్పాటు చేసుకున్నారని.. విజయవాడ నుంచి ఎందుకు ఏర్పాటు చేసుకోలేదని ఆనం ప్రశ్నించారు.

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ పెద్దలకు అత్యంత సన్నిహితులు. వ్యక్తిగత విషయాలకు సంబంధించిన పనులు ఆయనే చేస్తూంటారు. సీఎం క్యాంపాఫీసులో పశువులతో ఓ మందిరాన్ని కూడా ఆయన కట్టించారు. ఇలాగే వ్యక్తిగత అంశాల్లో ఆయనే ఎక్కువగా కనిపిస్తూంటారు. అయితే ఇప్పుడు.. ఈ శరత్ చంద్రారెడ్డి విషయంలోనూ ఆయన తెర ముందుకు రావడం.. ఢిల్లీలో నిబంధనలకు విరుద్ధంగా కలిసి మాట్లాడటం చర్చనీయాంశమవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ మానసిక స్థితిపై డౌట్ గా ఉంది : షర్మిల

జగన్ మానసిక పరిస్థితిపై తేడాగా ఉందని బ్యాలెన్స్ తప్పిందేమోనని డౌట్ గా ఉందని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. కడపలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ కు ఓ...

ఖమ్మంలో నామా వైపు టీడీపీ సానుభూతిపరులు !

పరిస్థితి క్లిష్టంగానే ఉన్నా ఖమ్మంలో నామా నాగేశ్వరరావు ధైర్యంగా పోరాడుతున్నారు. బీజేపీ తరపున సరైన అభ్యర్థి లేకపోవడం ఎవరికీ తెలియని వినోద్ రావు అనే వ్యక్తిని బీజేపీ నిలబెట్టింది. బీజేపీకి ఉన్న...

రోహిత్ శ‌ర్మ ఫీల్డ్ లో ఉండ‌డం కూడా ఇష్టం లేదా పాండ్యా…?!

ఈ ఐపీఎల్ లో ముంబై ఆట ముగిసింది. ప్లే ఆఫ్ రేసు నుంచి ఈ జ‌ట్టు దూర‌మైంది. ఐదుసార్లు ఐపీఎల్ విజేత‌గా నిలిచిన ముంబై ఈసారి క‌నీసం ప్లే ఆఫ్‌కు కూడా అర్హ‌త...

డైరెక్టర్స్ డే ఈవెంట్.. కొత్త డేట్‌!

మే 4.. దాస‌రి నారాయ‌ణ‌రావు జ‌న్మ‌దినం. దాస‌రిపై గౌర‌వంతో ఆయ‌న పుట్టిన రోజుని డైరెక్ట‌ర్స్ డేగా జ‌రుపుకొంటోంది చిత్ర‌సీమ‌. నిజానికి ఈ రోజు ఎల్ బీ స్టేడియంలో భారీ ఈవెంట్ జ‌ర‌గాల్సింది. ఎన్నిక‌ల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close