పర్యవేక్షకుల పేరుతో ఎమ్మెల్యేలను బ్లాక్ మెయిల్ చేస్తున్న వైసీపీ పెద్దలు !

వైసీపీ ఎమ్మెల్యేలకు ఎక్కడా లేనంత చిక్కొచ్చి పడింది. నియోజకవర్గంలో సంపాదించుకోవడానికి ఇసుక లాంటి వనరులు కూడా లేకుండా అంతా పై స్థాయిలోనే పని కానిచ్చేస్తున్నారు. పోనీ ఏదైనా పనులు చేద్దామంటే…పెట్టుబడి పెడితే గోడకు కొట్టిన సున్నమే అవుతుందని భయపడుతున్నారు. పోనీ ప్రజల్లో ఏమైనా పలుకుబడి ఉందా ఉంటే.. వాలంటీర్ దగ్గరకు వెళ్తున్న జనం ఎమ్మెల్యే వద్దకు రావడం లేదు. పరిస్థితి ఇలా ఉంటే.. బాగా పని చేయకపోతే మిమ్మల్ని తీసేస్తానంటూ… పార్టీ వైపు నుంచి బెదిరింపులు మాత్రం ఆగడం లేదు. బాగా పని చేయడం ఏమిటో ఎమ్మెల్యేలకు అంతు చిక్కడం లేదు.

అయినా సరే సీఎం జగన్ చెప్పాలని ఇంటింటికి వెళ్తున్నారు. ప్రజలు నోరు తెరవకుండా పెద్ద ఎత్తున జనం.. పక్కన పోలీసుల్ని కూడా పెట్టుకుంటున్నారు. అయినా నిరసనలు తప్పడంలేదు. ఇప్పుడు కొత్తగా ఎమ్మెల్యేలకు పర్యవేక్షకుల్ని పెడతానని జగన్ హెచ్చరిస్తున్నారు. లిస్ట్ ఖరారయిందని పదే పదే బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లుగా లీకులు ఇస్తున్నారు. ఎమ్మెల్యేల పట్ల, ప్రజల్లో వ్యతిరేకత ఉన్నవారిని, సర్వేల్లో ఆశించిన ఫలితాలు రాని వారిని గుర్తించి, ఆయా స్థానాల్లో కొత్తవారిని అభ్యర్థులుగా తీసుకొస్తామని కొన్నాళ్లుగా చెబుతున్నారు. అందులో భాగంగా టిక్కెట్లు నిరాకరించాలనుకున్న చోట్ల బలమైన పర్యవేక్షకుల్ని.. అవసరం లేని చోట.. ఆయా ఎమ్మెల్యేలు సూచించే వారినే పర్యవేక్షకులుగా పెట్టాలనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా ప్రజల్లో తమపై ఎంత అసంతృప్తి ఉందో ఎమ్మెల్యేలకు తెలిసొచ్ిచంది. ప్రజల సమస్యలు, పెండింగ్ పనులు, ఇచ్చిన హామీలు, అమలు ఇలా అన్ని విషయాలు ఎమ్మెల్యేలను చుట్టుముట్టాయి. వాటిని అదిగమించి, ఇప్పుడిప్పుడే ప్రజల్లో మార్కులు సాధించేందుకు ప్రయత్నిస్తుంటే, ఇదే సమయంలో నియోజకవర్గాలకు పర్యవేక్షకుల నియామకం అంటూ మరింత ఒత్తిడి పెంచుతున్నారు. దీంతో టిక్కెట్ ఇస్తే పోటీ చేస్తాం.. లేకపోతే లేదన్నట్లుగా ఎమ్మెల్యేలు కాడి దించేసే పరిస్థితికి వస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close