ఎగ్జిట్ పోల్స్ : గుజరాత్‌లో మళ్లీ బీజేపీ – హిమాచల్‌లో టఫ్ ఫైట్ !

రెండు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకే మొగ్గు కనిపిస్తోందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. హిమాచల్ ప్రదేశ్‌లో పోలింగ్ నెలకిందటే ముగిసింది. అయితే ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం ఉంది. గుజరాత్ పోలింగ్ ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్స్‌ను ప్రకటించారు. దాదాపుగా అన్ని సర్వే సంస్థలు గుజరాత్‌లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని అంచనా వేశాయి. 182 సీట్లు ఉన్న అసెంబ్లీలో బీజేపీకి 130 సీట్ల వరకూ వస్తాయని అంచనా వేశాయి. ఇక హిమాచల్ ప్రదేశ్‌లోనూ బీజేపీ గెలుస్తుందని అంచనా వేశాయి కానీ.. టఫ్ ఫైట్ ఉంటుందని.. చెబుతున్నారు. హిమాచల్‌లో మొత్తం 68 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. 35 సీట్లు వచ్చిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది.

గుజరాత్‌లో ఈ సారి కూడా గెలిస్తే వరుసగా బీజేపీ ఏడో సారి గెల్చినట్లవుతుంది. గుజరాత్ ముఖ్యమంత్రి దగ్గర నుంచి ప్రధాని అయిన మోదీ.. స్వయంగా ఎన్నికల బాధ్యతలు తీసుకున్నారు. పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఏ ప్రధాని చేయని విధంగా రోడ్ షోలు చేశారు. చివరికి ఓటు వేసేందుకు వెళ్లేటప్పుడు కూడా ఆయన అదే పని చేశారు. ఇలాంటి వాటిపై విమర్శలు వచ్చినా ఆయన పట్టించుకోలేదు. ఇక హిమాచల్ ప్రదేశ్‌లో ప్రభుత్వంపై చాలా వ్యతిరేకత ఉందని అనేక సర్వేలు వెల్లడించాయి. అయినప్పటికీ బీజేపీకే ఎడ్జ్ ఉందని ఎగ్జిట్ పోల్స్ రావడం ఆసక్తి రేపుతోంది. ఇండియాటుడే – యాక్సిస్ సంస్థ మాత్రం .. హిమాచల్‌లో కాంగ్రెస్ గెలుస్తుందని అంచనా వేసింది.

ఇక ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌కు కూడా ఎన్నికలు జరిగాయి. అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీనే విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. గతంలో మూడు మున్సిపల్ కార్పొరేషన్లు ఉండేవి. కానీ ఈ సారి ఒక్క దానిగా మార్చేసి ఎన్నికలు నిర్వహించారు. మొత్తం 250 వార్డుల్లో ఆమ్ ఆద్మీకి 170 పైనే రావొచ్చని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆర్జీవీకి కూడా ప్రజాధనంతో బిల్లు సెటిల్ చేసిన జగన్ !

రామ్ గోపాల్ వర్మ ఏపీ ప్రజాధనాన్ని దండుకున్నారు. బయటకు తెలిసిన వివరాల ప్రకారం రెండు చెక్కుల ద్వారా రూ. కోటి 14 లక్షలు ఆయన ఖాతాలో చేరాయి. ఆయనకు చెందిన ఆర్జీవీ...

కూతుర్ని ప్రాపర్టీతో పోల్చిన ముద్రగడ !

ముద్రగడ పద్మనాభం అంటే మంచీ చెడూ రాజకీయ నేత అనుకుంటారు. కానీ ఆయన కుమార్తెను ప్రాపర్టీగా చూస్తారు. అలా అని ఎవరో చెప్పడం కాదు. ఆయనే చెప్పుకున్నారు. ఉదయం తన తండ్రి రాజకీయ...

వైసీపీ మేనిఫెస్టోలో ట్విస్ట్ – ఈ మోసాన్ని ఎవరూ ఊహించలేరు !

వైసీపీ మేనిఫెస్టోలో అతిపెద్ద మోసం .. రాజకీయవర్గాల్లో సంచలనం రేపుతోంది. చాలా పథకాలకు రెట్టింపు ఇస్తామని ప్రచారం చేస్తున్నారు. కానీ ఒక్క రూపాయి కూడా పెంచలేదు. అసలు ట్విస్ట్ ఇప్పుడు లబ్దిదారుల్లోనూ సంచలనంగా...

కేసీఆర్ రూ. కోటి ఇచ్చినా … మొగులయ్య కూలీగా ఎందుకు మారారు?

కిన్నెర కళాకారులు, పద్మశ్రీ దర్శనం మొగులయ్య రోజు కూలీగా మారారంటూ ఓ చిన్న వీడియో, ఫోటోలతో కొంత మంది చేసిన పోస్టులతో రాజకీయం రాజుకుంది. తనకు రావాల్సిన పెన్షన్ రావడం లేదని.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close