ఏదో ఓ పార్టీ మాజీ జేడీని పిలవొచ్చుగా !

సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మినారాయణ వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఎన్నికల్లో పోటీ చేస్తానని చెబుతున్నారు. కానీ ఏ పార్టీ నుంచి అన్న దానిపై ఆయనకే స్పష్టత లేదు. తరచూ అదే చెబుతున్నారు. జనసేనకు రాజీనామా చేశారు. మళ్లీ వచ్చి చేరుతానంటే.. ఏమంమటారోనని ఆయన మొహమాటపడుతున్నారు. ఎవరినైనా నేతల్ని తమ పార్టీలోకి ఆహ్వానించే అలవాటు జనసేనకు లేదు. వారు వస్తే సరి. వీవీ లక్ష్మినారాయణ వస్తే జనసేన ఆహ్వానిస్తుంది. కానీ ఇక్కడ పిలుపు – స్వయంగా రావడం అనే అంశాల మధ్య ఊగిసలాట ఉంది. ఆయనే రాజీనామా చేసి వెళ్లిపోయారు కాబట్టి ఆయనే రావాలని జనసేన అనుకుంటోంది.

రాజకీయాల్లోకి వచ్చేందుకే.. ఐపీఎస్ సర్వీస్‌కు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న వీవీ లక్ష్మినారాయణ మొదట సొంత పార్టీ పెట్టే దిశగా ప్రయత్నాలు చేశారు. చివరికి ఏదీ సాధ్యం కాకపోవడంతో.. చివరి క్షణాల్లో జనసేన పార్టీలో చేరారు. ఈ సారి ఏ పార్టీలో చేరుతారన్నదానిపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. జగన్ అవినీతి కేసుల్ని పూర్తిగా దర్యాప్తు చేసిన అధికారిగా ఆయన ఆ పార్టీలో చేరలేరు. ఇక టీడీపీలో చేరితే.. రాజకీయంగా విమర్శలతో ఎటాక్ చేయడానికి వైఎస్ఆర్‌సీపీ ఎప్పుడూ రెడీ ఉంటుంది. బీజేపీలో చేరలేరు చేరినా ప్రయోజనం ఉండదు.

అందుకే వీవీ లక్ష్మినారాయణ… కుదిరితే పార్టీ లేకపోతే.. స్వతంత్రం అనే ఆప్షన్ పెట్టుకున్నారు. బలమైన పార్టీలు ఆయనను పిలిస్తే పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన మాటలను బట్టి అర్థం చేసుకోవచ్చు. అయినా ఎందుకో రాజకీయ పార్టీలు ఆయనను ఆహ్వానించడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

2గంటల్లో భారీ వర్షం.. హైదరాబాద్ బీ అలర్ట్..!!

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. సిద్ధిపేట, సంగారెడ్డి, మెదక్ , సిద్దిపేట, వికారాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల,రంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. గురువారం ఉదయం ఎండలు భగ్గుమనగా మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా...

ట్యాక్సుల‌పై నిర్మ‌ల‌మ్మ‌కు డైరెక్ట్ పంచ్… వీడియో వైర‌ల్

ఒకే దేశం- ఒకే పన్ను అని కేంద్రంలోని బీజేపీ సర్కార్ తీసుకొచ్చిన జీఎస్టీ సామాన్యుల పాలిట గుదిబండగా మారిందన్న విమర్శలు వస్తుండగా.. తాజాగా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ వ్యక్తి...

ఐప్యాక్ ఆఫీస్‌కు వెళ్లింది ప్రశాంత్ కిషోర్‌కు కౌంటర్ ఇవ్వడానికా ?

ఐప్యాక్ తో కాంట్రాక్ట్ రద్దు చేసుకున్న వైసీపీ అధినేత జగన్ చివరి సందేశం ఇవ్వడానికి వారి ఆఫీసుకు వెళ్లారు. గతం కన్నా ఎక్కువ సీట్లు గెలుస్తామని చెప్పుకొచ్చారు. అంత వరకూ బాగానే ఉంది...

చిరు, ప్ర‌భాస్‌, బ‌న్నీ.. ఒకే వేదిక‌పై!

మే 4... దాస‌రి జ‌న్మ‌దినం. ఈ సందర్భంగా ఓ భారీ ఈవెంట్ నిర్వ‌హించాల‌ని అనుకొంది ద‌ర్శ‌కుల సంఘం. అందుకోసం ఏర్పాట్లూ జ‌రిగాయి. అయితే ఎల‌క్ష‌న్ కోడ్ అడ్డురావ‌డంతో ఈ ఈవెంట్ వాయిదా ప‌డింది....

HOT NEWS

css.php
[X] Close
[X] Close