సీబీఐ విచారణ ముగిసిన వెంటనే ప్రగతి భవన్‌కు కవిత !

ఢిల్లీ లిక్కర్ స్కాంలో సాక్షిగా తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె కవితను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. ఐదుగురు సభ్యుల బృందం ఉదయం పదకొండు గంటలకు బంజారాహిల్స్‌లోని కవిత నివాసానికి వచ్చింది. ఏడున్నర గంటల పాటు ఏకధాటిగా ప్రశ్నించారు. వారు వెళ్లిపోయిన తర్వాత కవిత నేరుగా ప్రగతి భవన్‌కు వెళ్లారు . బహుశా వారు అడిగిన అంశాలు… తాను ఇచ్చిన సమాధానాలు.. వాటిపై సీబీఐ ఎలాంటి అడుగులు వేసే అవకాశం ఉందో.. న్యాయనిపుణులతో కేసీఆర్ తో కలిసి కవిత చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.

విచారణలో ఏమి అడిగారన్నదానిపై క్లారిటీ లేదు. సీబీఐ సమాచారం బయటకు రానివ్వలేదు. కానీ ఈడీ దాఖలు చేసిన ఎమ్మెల్సీ కవిత 10 ఫోన్లు ధ్వంసం చేశారన్న రిమాండ్ రిపోర్టుపైనే ఎక్కువగా ప్రశ్నించారని చెబుతున్నారు. ఇంతటితో విచారణ పూర్తయిందా? లేక మరోసారి కవితను విచారాస్తారా? అనే దానిపై సీబీఐ అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో బీజేపీ ప్రధానంగా కవితనే టార్గెట్ చేస్తోంది. అంటే ఇప్పుడు సాక్షి మాత్రమేనని.. తర్వాత నిందితురాలిగా మారుస్తారన్న అనుమానాలూ కొంత మందిలో ఉన్నాయి.

కవితను బీజేపీ టార్గెట్ చేసినట్లుగా కేసీఆర్‌ స్పష్టమైన అంచనాకు రావడంతో బీజేపీపై ఇప్పటికే సిట్ ద్వారా ఎదురుదాడి చేస్తున్నారు. అయితే సిట్ అనుకున్నంతగా ముందడుగు వేయలేకపోతోంది. ముగ్గురు నిందితులు కూడా బెయిల్ పై విడుదలయ్యారు. ఇతర నిందితుల్ని కనీసం విచారణకు కూడా పిలువలేకపోయారు. దీంతో ఈ కేసుల్లో తదుపరి ఏం జరుగుతుదంన్న దానిపై ఆసక్తి ఏర్పడింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వావ్… బీసీసీఐ తీసుకున్న నిర్ణయం మాములుగా లేదుగా!

తాజ్ మ‌హాల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలిలెవ‌రోయ్... అన్న మాట చాలా సంద‌ర్బాల్లో గుర్తుకొస్తుంది. కిందిస్థాయిలో క‌ష్ట‌ప‌డి ప‌నిచేసే వారిని గుర్తించ‌టం, గౌర‌వించ‌టం కార్పోరేట్ వ్య‌వ‌స్థ‌లో మూల‌న ప‌డిపోయింది. కానీ, ఈసారి ఐపీఎల్ లో...

మెగా మ‌న‌సు చాటుకొన్న చిరు!

చిరంజీవి మ‌రోసారి త‌న ఉదార‌త చాటుకొన్నారు. అనారోగ్యంతో బాధ ప‌డుతున్న సినీ పాత్రికేయుడికి త‌న అభ‌యహ‌స్తం అందించారు. మీడియా స‌ర్కిల్‌లో ఉండేవాళ్ల‌కు జ‌ర్న‌లిస్టు ప్ర‌భు ప‌రిచ‌యం ఉన్న వ్య‌క్తే. చిరంజీవితో కూడా ఆయ‌న‌కు...

వైన్స్ ఓన‌ర్స్ Vs బార్ ఓన‌ర్స్… తెలంగాణ‌లో కొత్త పంచాయితీ

మూడు పువ్వులు... ఆరు కాయ‌లుగా సాగే వ్యాపారాల్లో మ‌ద్యం బిజినెస్ కూడా ఒక‌టి. తెల్లారి లేస్తే లెక్చ‌ర్లు ఇచ్చే పొలిటిక‌ల్ లీడ‌ర్స్ నుండి గ‌ల్లీ లీడ‌ర్ల వ‌ర‌కు, కార్పోరేట్ సంస్థ‌లు ఇలా...

మరోసారి రియల్ హీరో అనిపించుకున్న మెగాస్టార్

రీల్ లైఫ్ లోనే కాదు.. రియల్ లైఫ్ లోనూ హీరో అనిపించుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. తన సేవా కార్యక్రమాలతో ఎంతోమందికి కొత్త జీవితాన్ని ప్రసాదించిన ఆయన తాజాగా ఓ జర్నలిస్టుకు తన వంతు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close