హైదరాబాద్ వచ్చేసిన కేసీఆర్ !

తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ ఆఫీసు ప్రారంభించి వారం రోజులు అక్కడే ఉంటారని.. రిటైర్డ్ అధికారులు, మేధావులు, రైతు సంఘం నేతలతో చర్చలు జరుపుతారని.. బీఆర్ఎస్ విస్తరణకు పునాదులు వేసి వస్తారని టీఆర్ఎస్ వర్గాలు ప్రచారం చేశాయి. అయితే కేసీఆర్ మూడు రోజుల్లోనే తిరిగి హైదరాబాద్ పయనం అయ్యారు. ఢిల్లీలో ఉన్న రోజుల్లో కేసీఆర్ ప్రత్యేక సమావేశాలు నిర్వహంచలేదు. రెండు రోజులు యాగాలు.. ఓ రోజు ప్రారంభోత్సవం.. మరో రోజు.. తెలంగాణ నుంచి వచ్చిన పార్టీ నేతల్ని కలవడంతోనే సరిపోయింది. ఇతర రాష్ట్రాల వారు ఎవరూ కేసీఆర్ ను కలిసేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు.

బీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత తర్వాత.. అధికారికంగా ఆఫీసు ప్రారంభించిన తర్వాత జాతీయ మీడియాకు పెద్ద ఎత్తున ఇంటర్యూలు ఇవ్వాలని అనుకున్నారు. అయితే ఈ విషయంలోనూ చివరికి వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది. కొన్ని ఉత్తరాది రాష్ట్రాల కన్వీనర్లను ప్రకటించాలని అనుకున్నా.. సమర్థులైన నేతలు దొరకకపోవడం.. అనుకున్న వారు ముందుకు రాకపోవడంతో.. ప్రకటన చేయలేదని తెలుస్తోంది. రైతు విభాగానికి మాత్రం అధ్యక్షుడ్ని ప్రకటించారు. జాతీయ పార్టీ పెట్టిన తర్వాత కేసీఆర్ ను కలిసేందుకు ఇతర రాష్ట్రాల వారీని భారీగా తరలించి ఉన్నట్లయితే ప్రయోజనం ఉండేది.

కానీ.. ఎక్కువగా తెలంగాణ నుంచి వెళ్లిన నేతలే శుభాకాంక్షలు చెప్పారు. వీరంతా పోలోమని ఢిల్లీకి పయనం కావడంతో.. విమానం టిక్కెట్ల రేట్లు ఒక్క సారిగా పెరిగిపోయాయి. అయితే కేసీఆర్ కు శుభాకాంక్షలు చెప్పాలంటే.. ఇక్కడే చెప్పొచ్చుగా అన్న వాదన సహజంగానే వినిపిస్తోంది. మరోసారి కేసీఆర్ ఢిల్లీ పర్యటన ఎప్పుడు ఉంటుందో స్పష్టత లేదు. ఓ బహిరంగసభ పెడితే కానీ బీఆర్ఎస్ ప్రజల్లోకి వెళ్లదన్న వాదన వినిపిస్తోంది.ఆ అంశంపై కేసీఆర్ దృష్టి పెట్టే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సీఐ అంజూ యాదవ్‌నూ సాగనంపారు !

తిరుపతిలో అత్యంత వివాదాస్పదమైన మహిళా సీఐ అంజూ యాదవ్ ను కూడా ఈసీ సాగనంపింది. పోలింగ్ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ విధుల్లో ఉండకూదని ఆర్థరాత్రే బదిలీ చేస్తూ ఈసీ ఉత్తర్వులు...

అల్లు అర్జున్ టూర్ : నంద్యాల ఎస్పీ, డీఎస్పీ, సీఐలపై ఈసీ చార్జ్‌షీట్

అల్లు అర్జున్ నంద్యాల పర్యటన పోలీసులపై కూడా కేసులు నమోదయ్యేలా చేసింది. అల్లు అర్జున్ నంద్యాల పర్యటనకు పోలీసులు అనుమతి తీసుకోలేదు. మామూలుగా అయితే పెద్దగా మ్యాటర్ కాదు....

వారణాశిలో మోడీ నామినేషన్‌కు చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడును వారణాశిలో తన నామినేషన్ కు రావాల్సిందిగా ప్రధాని మోడీ ఆహ్వానించారు. మంగళవారం ప్రధాని మోద ీనామినేషన్ వేయనున్నారు. వారణాశిలో ఎన్నికలు చివరి విడతలో జరగున్నాయి. పదమూడో తేదీన...

మిత్రుడు దంతులూరి కృష్ణ కూడా జగన్‌కు వ్యతిరేకమే !

జగన్మోహన్ రెడ్డికి అధికారం అందిన తర్వాత ఆ అధికారం నెత్తికెక్కడంతో దూరం చేసుకున్న వారిలో తల్లి, చెల్లి మాత్రమే కాదు స్నేహితులు కూడా ఉన్నారు. చిన్న తనం నుంచి అంటే 35...

HOT NEWS

css.php
[X] Close
[X] Close