నాన్ వెజ్ వంటల శిక్షణ, రుణాలు – ఏపీలో కొత్త స్కీమ్

ఆంధ్రప్రదేశ్ యువతకు బంపర్ ఆఫర్ వచ్చేసింది. ఇక ఆలస్యం చేయకుండా వెంటనే ప్రయత్నించడం బెటర్. ఎందుకంటే ప్రతీ జనవరిలో ఇస్తామన్న ఉద్యోగ క్యాలెండర్ ఇక రాదు. ఇచ్చినా.. నాలుగైదు పోస్టులే ఉంటాయి. యాభై వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నా… ఒక్కటీ భర్తీ చేయరు. కానీ.. వీరికి ఉపాధి చూపించడానికి మాత్రం సీఎం జగనన్న ఏ మాత్రం అశ్రద్ధ చేయడం లేదు. వాలంటీర్ పోస్టులు.. మటన్ మార్టులు తర్వాత.. ఇప్పుడు మరింత విస్తృత స్థాయిలో కర్రీ పాయింట్ల ప్లాన్ అమలు చేస్తున్నారు. ఇది కూడా నాన్ వెజ్ కర్రీ పాయింట్లు.

ఫిష్ ఆంధ్రా పేరుతో ఇటీవల సీఎం జగన్ రెడ్డి ఓ స్కీమ్ లాంఛ్ చేశారు. ఎక్కడ పడితే అక్కడ దుకాణాలు పెట్టుకోవచ్చన్నారు. పులివెందులలో ఓ దుకాణాన్ని తానే ఓపెన్ చేసి.. పులివెందు ప్రజలు ఫ్రెష్షు రొయ్యలు, చేపలు తింటారని కలలో కూడా ఊహించి ఉండరని.. తన భుజాన్ని తాను చరుచుకున్నారు. తరవాత రెండు నెలలకే అది మూతపడిందనుకోండి..అది వేరే విషయం. ఇప్పుడు అలా ఫ్రెష్ఫ్ చేపలు, రొయ్యలు మాత్రమే కాకుండా.. వాటిని కోసి కూర వండి అమ్మే కర్రీ పాయింట్లను పెట్టుకోవాలని పిలుపునిస్తున్నారు. ఇందు కోసం… రుణాలు కూడా ఇప్పిస్తామంటున్నారు.

ఫిష్ ఆంధ్రా స్టాల్స్.. మిగతా అన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లాగే అట్టర్ ఫ్లాప్ అయింది . ఎక్కడా సక్సెస్ కాలేదు. వాహనాలు లాస్ అయ్యాయి. అయినా సరే సీఎం జగన్ ఇప్పుడు కొత్తగా కోసి కూర వండేందుకు స్టాల్స్ ఏర్పాటు చేయించాలనుకుంటున్నారు. రెనోవేషన్ చేసిన ఈ స్కీమ్‌లో కొత్త పాయింటేమిటంటే… వంట వండటం కూడా నేర్పిస్తారట. ఏపీ యువతకు ఇంత కంటే గొప్ప ఆఫర్ ఇక లభించకపోవచ్చు. ప్రయత్నించండి మరి !

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అదే జరిగితే సజ్జల పరిస్థితి ఏంటి..?

వైసీపీలో ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తుండటంతో జగన్ రెడ్డి ఆత్మగా చెప్పుకునే సజ్జల రామకృష్ణ పరిస్థితి ఏంటనేది బిగ్ డిబేట్ గా మారింది. వైసీపీ అధికారంలో ఉన్నాన్నాళ్ళు తనే సీఎం అనే తరహాలో...

థియేట‌ర్లు క్లోజ్.. హీరోల షేర్ ఎంత‌?

తెలంగాణలో సింగిల్ స్క్రీన్స్ మూత‌ప‌డ‌డంతో టాలీవుడ్ ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డింది. నిజానికి ఇలాంటి ప‌రిస్థితి ఎప్పుడో ఒక‌ప్పుడు వ‌స్తుంద‌న్న భ‌యం, ఆందోళ‌న అంద‌రిలోనూ ఉంది. అది ఒక్క‌సారిగా నిజ‌మ‌య్యేస‌రికి అవాక్క‌య్యారు. నిజానికి నెల రోజుల...

ఐ ప్యాక్ బృందానికి జగన్ రెడ్డి వీడ్కోలు..?

ఏపీ ఎన్నికల్లో అధికార వైసీపీకి సేవలందించిన ఐ ప్యాక్ కార్యాలయానికి జగన్ రెడ్డి ఎన్నికలు ముగిసిన రెండు రోజుల తర్వాత వెళ్తుండటం చర్చనీయాంశం అవుతోంది. వాస్తవానికి పోలింగ్ ముగిసిన తర్వాత ఐ ప్యాక్...

దిల్ రాజు సినిమా మ‌ళ్లీ వాయిదా?

దిల్ రాజు బ్యాన‌ర్‌లో ర‌కూపొందించిన‌ 'ల‌వ్ మీ' మ‌ళ్లీ వాయిదా ప‌డే అవ‌కాశాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. ఏప్రిల్ లో విడుద‌ల కావాల్సిన సినిమా ఇది. ఎన్నిక‌ల హ‌డావుడి వ‌ల్ల ఈనెల 25కు వాయిదా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close