రేవంత్, మాణిక్యాన్ని కదిలించరు – సీనియర్లు వాట్ నెక్ట్స్ ?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలు పీసీసీ చీఫ్ రేవంత్ ను తొలగించాలని లేకపోతే కనీసం ఇంచార్జ్ మాణిగం ఠాగూర్ నైనా తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. సమస్యను సర్దుబాటు చేసేందుకు వచ్చిన దిగ్విజయ్ సింగ్ తో భేటీ సమయంలో ఇంచార్జ్ ఠాగూర్ ను తొలగిస్తారని సీనియర్ల క్యాంప్ ప్రచారం చేసింది. కానీ దిగ్విజయ్ హైదరాబాద్ నుంచి వెళ్లేటప్పుడు అంతా సాల్వ్ అయిందని… ఎవరైనా బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేస్తే చర్యలు ఉంటాయని చెప్పి వెళ్లారు.అంటే.. రేవంత్ ను కానీ.. ఠాగూర్ ను కానీ మార్చే ఆలోచనే లేదని స్పష్టమవుతోంది.

హైకమాండ్ తమను ఏదో విధంగా సంతృప్తి పరుస్తుందని.. తమకు కొంత బలం చేకూరురుస్తుందని సీనియర్లు ఆశలు పెట్టుకున్నారు. కానీ అసలు పట్టించుకోలేదని అనుకుంటారేమోనని హైకమాండ్ దిగ్విజయ్ ను పంపింది. ఆయన మాట్లాడారు. పరిష్కారానికి ఎలాంటి సూచనలు చేయలేదు. అంటే సీనియర్లు ఇక ఓవరాక్షన్ చేయవద్దని నేరుగా చెప్పినట్లయింది. ఇప్పుడు సీనియర్ నేతలకూ క్లారిటీ వచ్చింది. అందుకే జగ్గారెడ్డి వంటి నేతలు.. మళ్లీ గాంధీభవన్ లో ఏఐసీసీ పెద్దలను కలవనని చెబుతున్నారు.

ఇప్పుడు సీనియర్లు అని వేరు కుంపటి పెట్టుకున్న నేతలు ఏం చేస్తారనేది హాట్ టాపిక్ గా మారింది. పీసీసీ పిలుపునిచ్చే కార్యక్రమాల్లో వారు పాల్గొనరు. రేవంత్ నేతృత్వంలో పీసీసీ..త తన పని తాను చేసుకుపోతోంది. పాదయాత్ర కూడా ప్రకటించింది. ఆవేశపడి.. సీనియర్ నేతలు పార్టీకి దూరం అయ్యారు. ఇప్పుడు పార్టీలోనే ఉన్నా.. వారికి ఆదరణ ఉండదు. బయటకు వెళ్తే ఎలా ఉంటుందో తెలియదు. అందుకే ఇప్పుడు సీనియర్లు .. అటూ ఇటూ కాకుండా అయిపోయారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇప్పుడు ఏపీ మద్యం దుకాణాల్లో నో క్యాష్ పాలసీ !

నిన్నామొన్నటిదాకా క్యాష్ తప్ప మరో డిజటల్ పేమెంట్ తీసుకోలేదు ఏపీ మద్యం దుకాణాల్లో. ఇప్పుడు పాలసీ ఒక్క సారిగా మారిపోయింది. శుక్రవారం నుంచి ప్రభుత్వం పాలసీ మార్చేసింది. డిజిటల్ పేమెంట్...

ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంటే ఏపీకి ఏం ఉపయోగం !?

విభజన చట్టంలో ఉన్న ఉమ్మడి రాజధాని అంశానికి జూన్ రెండో తేదీన ముగింపు రాబోతోంది. మరోసారి పొడిగింపు అసాధ్యం అని తెలిసినా సరే కొంత మంది ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను కొనసాగించాలనే...

డ్రగ్స్ పార్టీ కేసు వైసీపీ చుట్టే తిరుగుతోంది !

డ్రగ్స్ అంటే వైసీపీ పేరు ఖచ్చితంగా వస్తోంది. ఏదో ఆషామాషీగా మీడియాలో వచ్చే కథనాలు కాదు. నేరుగా పోలీసు కేసుల్లో ఇరుక్కుంటున్నవారు. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ఏ 2గా నిలిచిన...

పల్లీబఠాణి కామెంట్స్‌తో రాకేష్ రెడ్డిని ముంచిన కేటీఆర్

బిట్స్ పిలానీ గొప్ప కావొచ్చు కానీ మిగతా గ్రాడ్యూయేట్స్ అంతా పల్లీ బఠాణీలు అంటే ఎలా ?. కేటీఆర్ ఇది ఆలోచించలేదు. ప్రాస బాగుంది కదా అని అనేశారు. ఇప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close