సినిమా వాళ్లతో గేమ్స్ – “పవర్” ప్రదర్శనతో ఇగో శాటిస్‌ఫై చేసుకుంటున్నారా ?

సంక్రాంతికి ఇద్దరు స్టార్ హీరోల సినిమాల రిలీజవుతున్నాయి. అగ్రహీరోలయిన చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు వస్తున్నాయి. వీటి ప్రి రిలీజ్ ఫంక్షన్ ఏపీలోనే నిర్వహించాలనుకున్నారు. బాలకృష్ణ సినిమా ఒంగోలులో.. చిరంజీవి సినిమాకు విశాఖలో నిర్వహించాలనుకున్నారు. మామూలుగా ఇలాంటి వేడుకలు ఎక్కడ జరిగినా అధికారులు ఎవర్నీ ఇబ్బంది పెట్టరు. ఎక్కడ నిర్వహించాలనుకుంటే అక్కడ పర్మిషన్ ఇస్తారు. భద్రత పరంగా సహకరిస్తారు. ఇంత కాలం జరిగింది ఇదే. కానీ విచిత్రంగా ఇప్పుడు.. రెండు సినిమాలకూ అధికారులు చుక్కలు చూపించారు. వేదికల్ని మార్చి మార్చి… అదనపు ఖర్చుకు కారణం అయ్యారు. అనుమతుల్లో గందరోళం సృష్టించారు. లేనిపోని ఆంక్షలు పెట్టారు. ఇందు కోసం ఆయా సినిమా బృందాల్ని తమ వెంట అదే పనిగా తిప్పుకున్నారు.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత జగన్ వద్ద నిలబడిన ఓ ఫోటోను వైసీపీ సోషల్ మీడియా విస్తృతంగా ప్రచారం చేసుకుంది. అన్న సంతకం కోసం నెల రోజుల పాటు తిరిగితే కానీ.. సినిమా రిలీజ్ చేసుకోలేరని.. అదీ అసలు హీరోయిజం అని ఎలివేట్ చేసుకోవడం ప్రారంభించారు. దీన్ని బట్టి చూస్తే.. కేవలం సినిమాలు తమ కంటే తక్కువ .. తమ అధికారం కంటే వారి ప్రజాదరణ తక్కువ అని నిరూపించడానికి.. ఆ హీరోల్ని కించపర్చడానికి ఈ ఎపిసోడ్ ను నడిపించినట్లుగా ఎక్కువ మంది అనుమానిస్తున్నారు. జగన్ తో పాటు వైసీపీ నేతలు తమ ఇగోను శాటిస్ ఫై చేసుకోవడానికి వీరయ్య, వీరసింహారెడ్డిలను ఇబ్బంది పెట్టారని క్లారిటీ వస్తోంది.

అయితే హీరోలను తన తగ్గరకు రప్పించుకునేంత అధికారం.. సంతకాల కోసం తమ చుట్టూ తిప్పుకునేంత అధికారం ఇచ్చింది ప్రజలు. అయితే వారు ఇచ్చిన అధికారం ఈగో శాటిస్ ఫై చేసుకోవడానికి కాదు. ప్రజలకు మేలు చేయడానికి . అధికార దర్పం చూపించుకోవడానికి కాదు. అధికారం పోతే.. జగన్ ను అయినా..మరొకర్ని అయినా దేకడు. వ్యక్తిగతంగా జగన్ అనుమతి కోసం ఎవరూ రారు. ప్రభుత్వం దగ్గరకే వస్తారు. ఈ ప్రభుత్వానికి అధిపతిగా ఇవాళ జగన్ ఉంటారు.. రేపు ఉండరు. అదీ తేడా. గుర్తిస్తే సరే లేదంటే.. తర్వాత ప్రదర్శించుకోవడానికి అధికారం ఉండదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close