కొత్త కాన్సెప్ట్ : పేరు పెట్టకపోయినా రాజధానులే !

ప్రత్యేకహోదా పేరు మాత్రమే లేదు.. ఆ ప్రయోజనాలన్నీ ఇచ్చాం అని కేంద్రం గతంలో ప్రకటించింది. ఇప్పుడు అదే కాన్సెప్ట్ ను వైసీపీ అమలు చేస్తోంది. అయితే అది హోదా విషయంలో కాదు.. రాజధానుల విషయంలో. అమరావతి, కర్నూలుల్ని రాజధానులు అని పిలవకపోయినా రాజధానులుగా అభివృద్ది చేస్తామనే కొత్త వాదనను సజ్జల తెర ముందుకు తీసుకు వస్తున్నారు.

ఇతర రాష్ట్రాలు, న్యాయస్థానాల్లో ఇంగ్లిష్‌లో ఏపీకి మూడు రాజధానులనేది పూర్దిగా తప్పుడు ప్రచారమని.. మిస్ కమ్యూనికేషన్ అని ఘంఠాపథంగా చెబుతున్న వైసీపీ సీఎం, మంత్రులు..ఏపీకి వచ్చే సరికి తెలుగులో మాత్రం.. అదేమీ తెలియదన్నట్లుగా ప్రజల వద్ద తమ విధానం మూడు రాజధానులే అని బొంకుతున్నారు. సుప్రీంకోర్టులో న్యాయరాజధాని అనేదే లేదని ప్రభుత్వం వాదించింది. ఢిల్లీలో సీఎం జగన్ విశాఖే రాజధాని అన్నారు. బెంగళూరులో బుగ్గన అసలు మూడు రాజధానులు అనేది తప్పుడు ప్రచారం అన్నారు. ఇదంతా కళ్ల ముందు కనిపిస్తూ.. వినిపిస్తూ ఉండగా.. తెలుగులో వైసీపీ నేతలు మాత్రం.. మూడు రాజధానులే తమ విధానమని అందులో మార్పు లేదని చెప్పుకొచ్చారు.

మూడు రాజధానులపై ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని… వైసీపీ విధానం మూడు రాజధానులేనని అంబటి రాంబాబు ప్రకటించారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా అనే స్ధానిక భావాలున్నాయి.. వాటిని వదులుకోకూడదనే మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నామని కొత్త భాష్యం చెప్పారు. సజ్జల రామకృష్ణారెడ్డి కూడా అదే విధంగా మాట్లాడారు.. బుగ్గన ఏ సందర్భంలో చెప్పాలో తెలియదని.. వైజాగ్ లో సచివాలయం ఉండాలి…అసెంబ్లీ అమరావతి లో ఉంటుంది హై కోర్ట్ కర్నూలు లో ఉంటుంది ..ఇదే మా విధానం అని ప్రకటించారు.
మూడు ప్రాంతాల అభివృద్ధి కి కట్టుబడి ఉన్నామమన్నారు. రాజధాని అనే పేరు పెట్టుకున్న లేకున్నా మూడు ప్రాంతాల అభివృద్ధి ఎజెండా అని సజ్జల చెప్పుకొస్తున్నారు.

అంటే రాజధాని అనే పేరు లేకపోయినా అభివృద్ది చేస్తామని అక్కడ హైకోర్టు పెడతామని.. ఇక్కడ అసెంబ్లీ ఉంటుందని సజ్జల చెప్పాలనుకుంటున్నారు. మొత్తంగా వైసీపీ నేతల వ్యవహారశైలి.. ప్రకటనలు పూర్తి స్థాయిలో ప్రజల్ని పిచ్చి వాళ్లుగా పరిగణిస్తున్నట్లుగా ఉంది. తాము ఏం చేసినా.. చెప్పినా నమ్మే జనం ఉన్నారన్నట్లుగా వారి ధీమా ఉంది. ఈ వ్యవహారం ఇప్పుడు ప్రజల్లోనూ చర్చనీయాంశం అవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

43వేల కోట్లతో రోడ్లేశాం కానీ వర్షాలకు కొట్టుకుపోయాయి : జగన్

జగన్మోహన్ రెడ్డి నోటికొచ్చింది చెప్పరు.. రాసుకొచ్చిందే చెబుతారు. రాసిచ్చే వారు ఏమి రాసిచ్చారో.. ఆయన ఏమి చదివారో కానీ.. మేనిఫెస్టోను రిలీజ్ చేసేటప్పుడు రోడ్ల ప్రస్తావన తెచ్చారు. టీడీపీ హయాం కన్నా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close