టీవీ9 ఆఫీసులో అకౌంట్స్ చెక్ చేసిన రవి ప్రకాష్ !

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ అనూహ్యంగా టీవీ9 కొత్త ఆఫీసులో ప్రత్యక్షమయ్యారు. తన ఆడిటర్‌ను కొంత మంది పోలీసుల్ని భద్రతగా తీసుకుని టీవీ9 కొత్త కార్యాలయానికి వచ్చిన ఆయన నేరుగా లోపలికి వెళ్లిపోయారు. లోపల ఏం జరిగిందో తెలియదు కానీ..బయటకు వచ్చిన తర్వాత ఆయన తాను టీవీ9 అకౌంట్స్ చెక్ చేయడానికి వచ్చానని మీడియాకు చెప్పి వెళ్లారు.

టీవీ9లో రవిప్రకాష్ కు ఇప్పటికీ వాటా ఉంది. ఆయన మైనార్టీ షేర్ హోల్డర్. ఎడెనిమిదిశాతం వరకూ వాటా ఉన్నట్లుగా చెబుతున్నారు. ఈ భాగాన్ని ఆమ్మాలని ఆయనపై గతంలో చాలా ఒత్తిడి వచ్చినా.. అంగీకరించలేదు. టీవీ9 కొత్త యాజమాన్యం చేతుల్లోకి వెళ్లిన తర్వాత రవిప్రకాష్ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కేసుల పాలయ్యారు. జైలుకు కూడా వెళ్లారు. ఇప్పుడు మళ్లీ ఆయన హఠాత్తుగా టీవీ9 ఆఫీసులో ప్రత్యక్షం కావడం సంచలనంగానే మారింది.

ఇటీవలి కాలంలో టీవీ9 కొత్త యాజమాన్యానికి… తెలంగాణ ప్రభుత్వ పెద్దలకు మధ్య చెడిందన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ప్రభుత్వ మద్దతు కోల్పోవడంతో పాటు.. రవిప్రకాష్ తెలంగాణ ప్రభుత్వ పెద్దల సపోర్ట్ ను కూడా పొందారని చెబుతున్నారు. అందుకే ఆయన మైనర్ వాటాదారునిగా అకౌంట్స్ చెక్ చేసేందుకు తనకు అధికారం ఉందని.. ఆదేశాలు తెచ్చుకుని పోలీసు భద్రతతో టీవీ9 కార్యాలయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. క

కార్యాలయం లోపల ఆయనకు సిబ్బంది అకౌంట్స్ చూపించారా లేదా అన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటికీ ఆయన మాజీ సహచరులు ఎడిటోరియల్ స్టాఫ్ గా ఉన్నారు. వారెవరైనా మళ్లీ పాత అనుబంధంతో పలకరించారా లేకపోతే కొత్త యజమాన్యానికి కోపం వస్తుందని ముఖం చాటేశారా అన్నది కూడా స్పష్టత లేదు. రవిప్రకాష్ టీవీ9 ఆఫీసుకు వెళ్లడం మాత్రం సంచలనంగా మారింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘విశ్వంభ‌ర’ టార్గెట్ ఫిక్స్!

విజువ‌ల్ ఎఫెక్ట్స్‌కి ప్రాముఖ్యం ఉన్న క‌థ‌.. 'విశ్వంభ‌ర‌'. ఇలాంటి సినిమాల‌కు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ చాలా కీల‌కం. అందుకోసం వీలైనంత ఎక్కువ స‌మ‌యం తీసుకోవాలి. ఈ దిశ‌గానే 'విశ్వంభ‌ర‌' టీమ్ వేగంగా అడుగులేస్తోంది. అందుకోసం...

లండన్ కాదు అమ్‌స్టర్‌డామ్ !

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్లలేదు. విజయవాడ నుంచి బయలుదేరిన ఆయన ప్రత్యేక లగ్జరీ విమానం లండన్ వెళ్లింది కానీ.. అక్కడ ఎయిర్ పోర్టులో దిగడానికి అనుమతి లభించలేదు. మూడు సార్లు...

కేసీఆర్ తరహాలో జగన్ రెడ్డి – రిజల్ట్ మాత్రం సేమ్..!?

ఏడు నెలల కిందట తెలంగాణ ఎన్నికల ఫలితాలపై కేసీఆర్ ఎలాంటి ప్రకటనలు చేశారో, ఏపీ ఎన్నికల ఫలితాలపై జగన్ కూడా అదే తరహ ప్రకటనలు చేస్తుండటం ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్ హ్యాట్రిక్ సాధించబోతుందని...

మంత్రివర్గ సమావేశంపై సస్పెన్స్..!!

నేడు జరగాల్సిన తెలంగాణ మంత్రివర్గ సమావేశంపై సస్పెన్స్ నెలకొంది. ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో ఈ కేబినెట్ సమావేశానికి ఎన్నికల కమిషన్ నుంచి అనుమతి రావాల్సి ఉంది. ఇప్పటివరకు ఎలాంటి రిప్లై లేకపోవడంతో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close