అవినాష్ రెడ్డికి పదో తేదీ గడువిచ్చిన సీబీఐ !

విచారణకు పెద్దగా సహకరించకపోయినా ఎంపీ అవినాష్ రెడ్డి విషయంలో సీబీఐ చాలా వరకూ స్మూత్ గా విచారణ కొనసాగించాలనుకుంటోంది. నోటీసులు ఇచ్చిన మూడు సార్లు రెండు సార్ల తనకు వేరే పనులు ఉన్నాయని చెప్పి డుమ్మ కొట్టినా మ రో తేదీ ఇస్తున్నారు. తాజాగా సోమవారం సీబీఐ ఎదుట హాజరు కావాలని ఇచ్చిన నోటీసులకు.. తాను రాలేనని సమాచారం ఇచ్చారు. దాంతో సీబీఐ అధికారులు పదో తేదీ గడువిచ్చారు పదో తేదీ రావాలని ఆదేశించారు. ఇదే విషయాన్ని అవినాష్ రెడ్డి ప్రకటించారు.

ఈ నెల 10న సీబీఐ ఎదుట విచారణకు హాజరవుతానని వేంపల్లిలో జరిగిన వైసీపీ మండల నాయకులు, కార్యకర్తలు, గృహ సారథులు, కన్వీనర్లు, వాలంటీర్లు సమావేశంలో అవినాష్ రెడ్డి ప్రకటించారు. పన్నెండో తేదీ తన తండ్రి భాస్కర్ రెడ్డి కడపలో విచారణకు హాజరవుతారని తెలిపారు. మామూలుగా అయితే అవినాష్ రెడ్డి విషయంలో సీబీఐ దాఖలు చేసిన అఫిడవిట్లకు… విచారణకు హాజరయ్యేందుకు ఆయన పెడుతున్న వంకల కారణంగా .. విచారణకు సహకరించని కారణంగా అరెస్ట్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కానీ సీబీఐ అధికారులు ముందుగా అరెస్టుల కన్నా అసలు దర్యాప్తు పూర్తి చేయాలనుకుంటున్నట్లుగా కనిపిస్తోంది.

వివేకా హత్య జరిగిపోయి నాలుగేళ్లు దాటిపోయిది. సీబీఐ చేతికి వెళ్లి రెండేళ్లు దాటిపోయింది. ఇప్పటికీ విచారణ కొనసాగుతూనే ఉంది. రాజకీయంగా సున్నితమైన కేసు కావడంతో సీబీఐపైనా ఒత్తిళ్లు తప్పడం లేదు. అయినా కేసును ముందుకు నడిపిస్తున్నారు. మూడో సారి అవినాష్ రెడ్డి విచారణ తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

భార్యా బాధితులను కామెడీగానే చూస్తున్న సమాజం !

తన భార్య నుండి తనకు , తన తల్లిదండ్రులకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలంటూ ఓ బాధిత భర్త పోలీసులను వేడుకుంటూ ప్రెస్ మీట్ పెట్టారు. హైదరాబాద్ లో ఘటన...

అప్పుడే ప్రతిపక్ష పాత్ర పోషిస్తోన్న వైసీపీ..!!

ఏపీలో వైసీపీ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. ఎన్నికల ఫలితాన్ని ముందుగానే పసిగట్టారో మరేమిటో, అప్పుడే ప్రతిపక్ష పాత్రకు అలవాటుపడుతున్నట్లు కనిపిస్తోంది. అతిశయోక్తి అనిపించినా ఆ పార్టీ నేతలు చేస్తోన్న వరుస వ్యాఖ్యలు...
video

‘గం గం గణేశా’ ట్రైలర్ : నవ్వించే దొంగ

https://www.youtube.com/watch?v=wBZ7EUIM7fY బేబీతో ఓ యూత్ ఫుల్ విజయాన్ని అందుకున్న ఆనంద్ దేవరకొండ ఇప్పుడు 'గం గం గణేశా' సినిమా తో ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు. ఇదొక క్రైమ్ కామెడీ. తాజాగా ట్రైలర్ ని వదిలారు....

జగన్ ప్రమాణస్వీకార ముహుర్తం పెట్టేసిన వైవీ సుబ్బారెడ్డి

వైవీ సుబ్బారెడ్డి జగన్ రెండో ప్రమాణస్వీకార ముహుర్తం పెట్టేశారు. విశాఖలో ప్రమాణం చేస్తానని జగనే ప్రకటించారు కాబట్టి ఎక్కడ అనే సందేహం లేదు. తొమ్మిదో తేదీన ప్రమాణం చేస్తారని బొత్స సత్యనారాయణ ఇంతకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close