తెలంగాణకు భారీ టెక్స్ టైల్ పార్క్ ప్రకటించిన ప్రధాని !

తెలంగాణకు కేంద్రం ఏమీ చేయడం లేదని.. బీఆర్ఎస్ వర్గాలు విమర్శలు చేస్తూ ఉంటాయి. అయితే తాము చాలా చేస్తున్నామని బీజేపీ ఎదురుదాడి చేస్తూ ఉంటుంది. ఈసారి అలా ఎదురుదాడి చేయడానికి ఓ బలమైన అంశాన్ని సృష్టించుకుంది. అదే టెక్స్ టైల్ పార్క్. తెలంగాణ‌లో కేంద్రం టెక్స్ టైల్ పార్క్ ను ఏర్పాటు చేయ‌నుంది.. ఈ మేర‌కు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ స్వ‌యంగా త‌న ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించారు.

తెలంగాణకు అత్యాధునిక మౌలిక సదుపాయాలతో పాటు, లక్షలాది ఉద్యోగావకాశాలు కల్పించే దిశగా కేంద్రం ప్రభుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేరకు తెలంగాణతో సహా పలు రాష్ట్రాలలో టెక్స్‌టైల్ రంగాన్ని పెంచేందుకు పీఎం మిత్ర మెగా టెక్స్‌టైల్ పార్కులను ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలియజేశారు. తెలంగాణ‌, త‌మిళ‌నాడు, ఉత్త‌ర ప్ర‌దేశ్ , క‌ర్నాట‌క , మ‌ధ్య‌ప్ర‌దేశ్ , గుజ‌రాత్ ల‌లో మిత్ర మెగా టెక్స్‌టైల్ పార్కులు రానున్నాయి. ఈ పార్కుల ద్వారా టెక్స్‌టైల్స్ రంగానికి అత్యాధునిక మౌలిక సదుపాయాలను కల్పిస్తాయని, కోట్లాది పెట్టుబడులను ఆకర్షిస్తుందని, లక్షలాది మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తాయని ఆయన ట్విట్ట‌ర్ లో పేర్కొన్నారు.

నిజానికి తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడో వరంగల్లో కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు చేసింది.ఈ మెగా టెక్స్‌టైల్ పార్క్‌లో మౌలిక సదుపాయాలు కల్పించడానికి నిధులు కేటాయించాలని చాలా సార్లు మంత్రి కేటీఆర్ కేంద్రాన్ని కోరారు. కానీ ఇప్పటి వరకూ నిధులు ఇవ్వలేదు. ఇప్పుడు ఏకంగా మెగా టెక్స్ టైల్ పార్క్ ను మంజూరు చేశారు. ఈ మెగా టెక్సైటైల్ పార్క్ నే మోదీ ప్రకటించిన పార్క్ గా మార్చేసి.. నిధులు తీసుకునే అవకాశం తెలంగాణ సర్కార్‌కు లభించింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రతి ఇంట్లో ఫోటో ఉండేలా పాలన చేస్తానంటే ఇలానా !?

మా పాస్ పుస్తకాలపై జగన్ ఫోటో ఏంటి అని ఓ పులివెందుల రెడ్డిరైతు భారతిరెడ్డిని ప్రశ్నించారు. ఆమె సమాధానం ఇవ్వలేకపోయింది. కానీ మనసులో అనుకునే ఉంటారు. ఎన్నికల్లో హామీ ఇచ్చారు అందుకే...

సీరం ఇన్‌స్టిట్యూట్ బీజేపీకి 50 కోట్ల విరాళం ఇచ్చిందా…కారణం ఇదేనా..?

కోవిషీల్ద్ వ్యాక్సిన్ దుష్ప్రభావాలకు కారణం అవుతుందని వ్యాక్సిన్ తయారీదారు అంగీకరించిన నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ పై కాంగ్రెస్ ఎదురుదాడి ప్రారంభించింది. జర్మనీ, డెన్మార్క్, నెథర్లాండ్స్, థాయ్‌ల్యాండ్ వంటి దేశాలు ఆస్ట్రాజెనికా...

బేలగా మోదీ ప్రచారం – ఏం జరుగుతోంది ?

నరేంద్రమోడీ ఎప్పుడైనా దూకుడుగా ప్రచారం చేస్తారు. ప్రత్యర్థుల్ని ఇరుకున పెడతారు. తనను చాయ్ వాలా అంటే చాయ్ పే చర్చ అని కార్యక్రమం పెట్టి అందర్నీ ఆకట్టుకుంటారు. ఇటీవల తనను...

అబద్దాల ప్రభుత్వం – అమల్లోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్

ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇంకా అమల్లోకి రాలేదని వైసీపీ నేతలు చెబుతున్నారు. మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రెస్ మీట్ పెట్టి అదే చెబుతున్నారు. కోర్టుల్లో తీర్పులు వచ్చిన తర్వాతనే అమలు చేస్తామని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close