పవన్ – చంద్రబాబు భేటీపై బీజేపీ స్పందన ఇదే !

పవన్ కల్యాణ్, చంద్రబాబు మూడో సారి సమావేశం కావడం… వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేసే అంశంపైనే తాము చర్చించుకుంటున్నామని నాదెండ్ల మనోహర్ ప్రకటించడంతో ఇప్పుడు అందరి దృష్టి బీజేపీపై పడింది. బీజేపీ నేతల స్పందన ఏమిటా అని ఆసక్తిగా చూశారు. ప్రో వైసీపీ నేతగా ముద్రపడిన సోము వీర్రాజు .. అవునా.. వాళ్లు భేటీ అయ్యారా .. నాకు తెలియదే అన్నట్లుగా స్పందించారు. ఈ అంశంపై ఆయన నిరాశకు గురయ్యారని.. స్పందించడానికి వ్యతిరేకంగా ఉన్నారని స్పష్టమయింది. అయితే జనసేన తమతోనే ఉందని గతంలోలా కాన్ఫిడెంట్‌గా చెప్పలేకపోయారు.

మరో బీజేపీ నేత , జాతీయ కార్యదర్శి సత్యకుమార్ కూడా స్పందించారు. ఆయన మరింత భిన్నంగా స్పందించారు. వైసీపీ విముక్త ఏపీ అన్నదే బీజేపీ లక్ష్యం కూడా అని స్పష్టం చేశారు. జనసేన స్వతంత్ర పార్టీ అని.. ఆ పార్టీ అధినేత ఎవరితోనైనా చర్చించవచ్చని స్పష్టం చేశారు. ఢిల్లీకి వచ్చి బీజేపీ అగ్రనేతలతో పవన్ కల్యాణ్ సమావేశమయ్యారని గుర్తు చే్శారు. వైసీపీని ఓడించడానికి ఓట్లు చీలికపోకూడదనేది పవన్ లక్ష్యమని ఆ దిశగా ప్రయత్నిస్తున్నారని చెప్పుకొచ్చారు. సత్యకుమార్ మాటల్లో.. పవన్ ప్రయత్నాలపై బీజేపీ సానుకూలంగా ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది.

కారణం ఏదైనా ఏపీ బీజేపీలో వైసీపీకి దగ్గర అనుకున్న నేతలు మాత్రం పొత్తులు వద్దని .. జనసేనతో మాత్రమే కలిసి పోటీ చేద్దామని అంటున్నారు. కానీ ఇతర నేతలు మాత్రం.. వైసీపీని ఓడించడానికి . .. కనీసం అసెంబ్లీలో ప్రాతినిధ్యం దక్కడానికి టీడీపీతో పొత్తు ఉండాలని కోరుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఢిల్లీ నుంచి వస్తున్న సంకేతాలతో ప్రో వైసీప నేతలు సైలెంట్‌గా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలాంటి పెళ్లి చేసుకోను: ఫరియా అబ్దుల్లాతో చిట్ చాట్

‘జాతిరత్నాలు’ సినిమాతో మెరిసింది ఫరియా అబ్దుల్లా. ‘చిట్టి నీ నవ్వంటే లక్ష్మీ పటాసే.. ఫట్టుమని పేలిందా నా గుండె ఖలాసే’ అంటూ యూత్ హృదయాల్ని కొల్లగొట్టింది. ఇప్పుడు అల్లరి నరేష్ కి జోడిగా...

వేలంపాట మాదిరి వైసీపీ మేనిఫెస్టో..!?

వైసీపీ మేనిఫెస్టో చూసిన వారందరికీ వేలంపాట గుర్తుకు రాక మానదు. టీడీపీ ఒకటి అంటే...మేము రెండు అంటాం అనే తరహలో వైసీపీ మేనిఫెస్టోను రూపొందించినట్లుగా కనిపిస్తోంది. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను ఏమాత్రం అంచనా...

వైజాగ్ నుంచి పాలన… జగన్ ను జనం విశ్వసించేనా..?

మూడు రాజధానుల పేరుతో ఏపీకి రాజధాని లేకుండా చేసిన జగన్ రెడ్దికి ఎన్నికల్లో క్యాపిటల్ ఫియర్ పట్టుకున్నట్లు కనిపిస్తోంది. రెండో దఫా అధికారంలోకి వస్తే విశాఖ కేంద్రంగా పాలన కొనసాగుతోందని మేనిఫెస్టో విడుదల...

సేమ్ మేనిఫెస్టో : ఆశలు వదిలేసుకున్న జగన్ !

వైసీపీ అధినేత జగన్ ఈ ఎన్నికలపై ఆశలు వదిలేసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఏ మాత్రం అమలు చేయలేపోయిన గత ఎన్నికల మేనిపెస్టోను మళ్లీ ప్రకటించారు. కాకపోతే గతం కన్నా కాస్తంత ఎక్కువ డబ్బులు ఇస్తానని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close