ఎన్నికల భయం – ఆ మున్సిపాల్టీల్లో స్సెషలాఫీసర్ల పాలన !

ఏపీ ప్రభుత్వానికి ఎన్నికల భయం ఎక్కువగానే పట్టుకున్నట్లుగా కనిపిస్తోంది. అధికారం చేతిలో ఉండి ఎన్నికలు ఎలా నిర్వహించాలో కూడా స్పష్టత ఉన్న ప్రభత్వానికి.. మిగిలిన మున్సిపాలిటీలు.. రాజమండ్రి కార్పొరేషన్ కు ఎన్నికలు జరిపించేందుకు వెనుకడుగు వేస్తోంది. మొత్తంగా అన్ని ప్రాంతాల్లో కలిపి దాదాపుగా ఎనిమిది మున్సిపాలిటీలతో పాటు అనేక చోట్ల ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంది. కానీ రాష్ట్ర ఎన్నికల సంఘం వాటిపై దృష్టి పెట్టలేదు. ఎన్నికలపై ప్రభుత్వం ఆసక్తిగా లేకపోవడమే దీనికి కారణం.

ప్రస్తుతం ఆయా మున్సిపాలిటీల్లో ప్రత్యేకాధికారుల పాలనను మరో ఆరు నెలలు పొగిడిస్తూ నిర్ణయం తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేశారు. అంటే. ఆ తర్వాత ఎన్నికల సమయం వస్తుంది కాబట్టి అసలు ఎన్నికలు పెట్టరు. ఇప్పటికిప్పుడు ఎక్కడైనా ఎన్నికలు జరిగితే అదే ప్రజాభిప్రాయం అన్న చర్చ జరుగుతుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యూయేట్ ఓటర్లు కొట్టిన దెబ్బతో జగన్ సర్కార్ కు మైండ్ బ్లాంక్ అయింది.ఇప్పటికిప్పుడు అలాంటి ఓటింగ్ జరగాలని కోరుకోవడం లేదు.

అయితే మిగిలిన వాటికి ఎన్నికలు పెట్టకపోవడాన్ని విపక్షాలు అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నాయి. ప్రభుత్వంపై వ్యతిరేకత బయటపడుతుందన్న కారణంగానే వెనుకడుగు వేస్తున్నారని విమర్శిస్తున్నారు. అయినా ప్రభుత్వం మాత్రం అనుకుంటే అనుకున్నారు.. ఓటింగ్ కు మాత్రం వెళ్లకూడదని డిసైయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఉత్తరాంధ్ర… ‘అధికార’ నిర్ణయాంధ్ర !

రాజకీయంగా ఎంతో చైతన్యంగా ఉండే ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర జిల్లాలు ముందు వరుసలో ఉంటాయి... ఏదో ఒక మూలకు విసిరేసినట్లు ఉన్నప్పటికీ... ఈ మూడుజిల్లాలు... నేడే కాదు, నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా......

భీమిలి… ‘గంటా’ మజిలీ!

మాజీ మంత్రి, TDP నాయకుడు గంటా శ్రీనివాసరావు... వాస్తవానికి విశాఖ జిల్లాకు వలస వచ్చిన నాయకుడే అయినా... దాదాపు పాతికేళ్ళుగా ఓటమి ఎరుగని నాయకుడుగా ఉండటంతో స్థానికుడు అయిపోయాడు. ఎన్నికలు వస్తున్నాయి అంటే......

గుండు సున్నా కావాలా.. గుండె ధైర్యం కావాలా… ఇందూరు గడ్డపై కేసీఆర్ గర్జన

ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నిజామాబాద్ రోడ్ షోలో పాల్గొన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీజేపీపై నిప్పులు చెరిగారు. నరేంద్ర మోడీ పాలనలో అచ్చేదిన్ కాదు... సచ్చేదిన్ వచ్చిందని మండిపడ్డారు. ప్రధాని మోడీ...

బటన్ల నొక్కిన డబ్బులపై వైసీపీ డ్రామా ఫెయిల్

ఏపీ లో అధికార పార్టీకి పుట్టెడు తెలివితేటలు. ఓటర్లకు తాము పంచే డబ్బులు కాకుండా పెండింగ్ పెట్టిన డబ్బులు వేయాలని అనుకున్నారు. చివరికి ఎటూ కాకుండా పోయింది. చేయూత సహా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close