సీబీఐతో గేమ్స్ ఆడుతున్న అవినాష్ రెడ్డి !

వైఎస్ వివేకా హత్య కేసులో కీలక నిందితుడు అవినాష్ రెడ్డి సీబీఐకి గేమ్స్ ఆడుతున్నారు. తాను వెళ్లి వారి చేతిలో అరెస్ట్ అవడం ఎందుకు వాళ్లే వచ్చి అరెస్ట్ చేయాలన్నట్లుగా కొత్త వ్యూహం పన్నుతున్నారు. సీబీఐ మూడు రోజులు ముందుగా జారీ చేసిన నోటీసులకు.. హాజరవ్వాల్సిన రోజున….ఇదిగో వస్తున్నా.. అదిగో వస్తున్నా అన్నట్లుగా హడావుడి చేసి చివరికి ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాల వల్ల రావట్లేదని లేఖ రాశారు. షార్ట్ నోటీస్ ఇచ్చారని కారణం చూపించారు.

వైఎస్ అవినాష్ రెడ్డి హాజరువుతారని సాక్షి మీడియా ప్రచారం చేసింది. ఆయన నిన్ననే పులివెందుల నుంచి హైదరాబాద్ వచ్చారని కూడా చెప్పుకున్నారు. ఉదయం నుంచి సీబీఐ కార్యాలయం వద్ద పులివెందల నుంచి వచ్చిన అవినాష్ రెడ్డి అనుచరులు గుమికూడారు. అయితే అరెస్ట్ చేస్తారని క్లారిటీ వచ్చిందేమో కానీ చివరి క్షణంలో అవినాష్ రెడ్డి ఆగిపోయారు. తాను విచారణకు రాలేనని మరోనాలుగు రోజుల తర్వాత పిలిస్తే ఆలోచిస్తానని చెప్పారు.

అవినాష్ రెడ్డి అంత బిజీగా ఉన్న కార్యక్రమాలేమిటంటే .. పార్టీ కార్యక్రమాలట. ముందుగా నిర్ణయించిన పార్టీ కార్యక్రమాలు ఉన్నందున రాలేనంటున్నారు. ఆయన లేఖ ఖచ్చితంగా సీబీఐతో గేమ్స్ ఆడటమేనని.. సీబీఐ ఏమీ చేయలేకపోతున్న నిస్సహాయతను ఆయన బయటపెడుతున్నారన్న వాదన వినిపిస్తోంది. ఇలా సీబీఐ నోటీసులు ఇచ్చిన తర్వాత విచారణ కు హాజరు కాకపోవడం ఇదే మొదటి సారి కాదు. దాదాపుగా ప్రతీ సారి ఇదే సమాధానం ఇచ్చారు. కొన్ని సార్లు కోర్టులకు వెళ్లారు. ఈ కారణంగానే అవినాష్ రెడ్డి విచారణకు సహకరించడం లేదని సీబీఐ కోర్టుకు చెబుతోంది. ఇప్పుడు అదే మళ్లీ చెబుతున్నారు.

అరెస్ట్ చేయడం ఖాయమని.. ఆ అరెస్ట్ ఏదో సీబీఐ వచ్చి చేసుకుంటే బెటర్ అని.. మనమే వెళ్లి సీబీఐ ముందు అరెస్ట్ కావడం ఎందుకని వచ్చిన రాజకీయ సలాహాలతోనే సీబీఐని అవినాష్ రెడ్డి ధిక్కరిస్తున్నట్లుగా భావిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేసీఆర్, కేటీఆర్ లేకపోతే తెలంగాణ ఏమైపోతుందో !?

బీఆర్ఎస్ లేకపోతే తెలంగాణను ఎవరో ఎత్తుకుపోతారన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. తాము ఉన్నప్పుడంతా స్వర్గం.. ఇప్పుడు నరకం అని ప్రజలకు చెబుతున్నారు. విచిత్రం ఏమిటంటే.. కొత్తగా తాము లేకపోతే...

వాలంటీర్ల లేకపోతే ఇంటింటికి పెన్షన్లు ఇవ్వలేరా ?

ఒకటో తేదీన పించను ఇంటి వద్ద ఇవ్వడానికి ఉద్యోగులు సరిపోరని నమ్మించడానికి ఏపీ ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న వారు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. పించన్లను బ్యాంక్ అకౌంట్లలో...

కండోమ్స్ ఎక్కువగా వాడేది వారేనా..మోడీకి కౌంటర్

లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని మోడీ ప్రసంగం ఆశ్చర్యపరుస్తోంది. గతానికి భిన్నంగా మాట్లాడుతుండటమే ఇందుకు కారణం.గాంధీ కుటుంబంపై మాత్రమే విమర్శలు చేసే మోడీ గత కొద్ది రోజులుగా రూట్ మార్చారు. కాంగ్రెస్ అకారంలోకి...

ఔను..బీజేపీతో ఒప్పందం ఉందంటోన్న కేటీఆర్..!?

బీజేపీ - బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తోన్న వేళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాము బీజేపీతో కలిసే ఉన్నామనే పరోక్షంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close