వాలంటీర్లే దిక్కన్నట్లుగా జగన్ మాటలు !

తన ప్రభుత్వం గురించి ఇంటింటికి వెళ్లి చెప్పాలని వాలంటీర్లను కూడా జగన్ బతిమాలుకుంటున్నారు. పార్టీ నేతలు..క్యాడర్ మొత్తం ఉన్నా.. వాలంటీర్లే తనకు దిక్కన్నట్లుగా మాట్లాడటం చర్చనీయాంశమవుతోంది. వాలంటీర్లకు వందనం అంటూ. ఓ కార్యక్రమం పెట్టిన ఆయన .. చివరికి వారికి లీడర్లను చేస్తానని కూడా హామీ ఇచ్చారు. ఎలాంటి లీడర్లను చేస్తారో తెలియదు కానీ.. వాలంటీర్లు వైసీపీ కోసం పని చేయాలని..అలా చేస్తే చాలా పనులవుతాయని ఆశ పెట్టడానికి వెనుకాడలేదు.

అదే పనిగా వాలంటీర్లను పొగిడేసిన ఆయన మీ రాజకీయ హక్కులకు, అభ్యుదయ ఆదర్శ భావాలకు ఎలాంటి ఆటంకాలు, అవరోధాలు ఉండవని హామీ ఇచ్చారు. వాలంటీర్లను ఉద్దేశించి నేను చేసిన మొదటి ప్రసంగాన్ని మీరు గుర్తుకు తెచ్చుకోవాలని.. అప్పట్లోనే తాను లీడర్లుగా చేస్తానని చెప్పానని గుర్తు చేశారు. ఆ మాటను గుర్తు పెట్టుకోవాలని సూచించారు. ప్రతి ఇంటికీ ఎక్కువసార్లు వెళ్లాలని జగన్ కోరారు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడాను వారికి చూపించాలన్నారు. చేసిన మంచిపై ప్రజలు ఆలోచించేలా చేయాల్సిన బాధ్యత మీదేనని చెప్పుకొచ్చారు.

సీఎం జగన్ వాలంటీర్లే తమ ప్రభుత్వం గురించి ప్రజలకు చెబుతారని గట్టి నమ్మకం పెట్టుకున్నారు . పార్టీ నేతల్లో ఉన్న అసంతృప్తిని కూడా పెద్దగా పట్టించుకోకుండా వాలంటీర్లకు ప్రాధాన్యం ఇస్తున్నారన్న విమర్శలు సీఎం జగన్ పై ఉన్నాయి. ఇప్పుడు అదే పద్దతిలో ఆయన వాలంటీర్లే తనకు దిక్కన్నట్లుగా ప్రసంగించడం పార్టీ నేతలను ఆశ్చర్య పరుస్తోంది. ప్రతి ఇంటికి మంచి చేస్తే.. మంచి జరిగిన వాళ్లు ఓట్లు వేస్తారు కదా.. వాళ్ల కి మంచి జరిగిందని వాలంటీర్లు చెప్పాలా అనే ప్రశ్నలు సహజంగానే వస్తున్నాయి.

వాలంటీర్ల నిర్వాకాల వల్లనే ఎక్కవ మంది ఓటర్లు వైసీపీకి దూరం అవుతున్నారన్న ప్రచారం ఉంది. అయినప్పటికీ వాలంటీర్లనే నమ్ముకోవడం .. పార్టీ క్యాడర్ ను విస్మరించడం తన నెత్తి మీద తాను చేయి పెట్టుకున్నట్లేనన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

పదేళ్ల తర్వాత ఓయూపై స్పందించిన కేసీఆర్

తెలంగాణ ఉద్యమ సమయంలో నిత్యం ఓయూను పలవరించిన కేసీఆర్.. గద్దెనెక్కాక ఒక్కసారి కూడా ఓయూను సందర్శించలేదు. విద్యార్థులు రోడ్డెక్కి ప్రొఫెసర్లను నియమించాలని,స్కాలర్ షిప్స్ పెంచాలని, వసతి గృహాల్లో నాణ్యమైన ఆహారం అందించాలని డిమాండ్...

నోరు జారిన ర‌చ‌యిత‌.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్

తోట‌ప‌ల్లి మ‌ధు... ఈ త‌రానికి పెద్ద‌గా ఈ ర‌చ‌యిత పేరు తెలియ‌క‌పోవొచ్చు కానీ, 90ల్లో వ‌చ్చిన కొన్ని సినిమాల‌కు ఆయ‌న మాట‌లు అందించారు. కొన్ని పెద్ద హిట్లు కొట్టారు. న‌టుడిగానూ త‌న‌దైన ముద్ర...

బడా భాయ్ కి కోపమొచ్చింది… ఛోటా భాయ్ కి సమన్లు వచ్చాయి..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మోడీని బడా భాయి అని పిలిచినా,సరదాగా ఆహ్వానించినా రాజకీయాల్లో తమ్ముడు.. తమ్ముడే.. పేకాట.. పేకాటే అని నిరూపిస్తున్నారు బీజేపీ నేతలు. బడా భాయి అని మోడీని ఉద్దేశించి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close