మీడియా వాచ్ : రోడ్డున పడ్డ టీవీ చానళ్ల నెంబర్ వార్ !

చాలా వారాల కిందటే ఏపీలో టీవీ9 రెండో స్థానంలోకి వెళ్లిపోయింది. ఎన్టీవీ నెంబర్ వన్ ప్లేస్ లో ఉంది. మళ్లీ చాలా వారాల తర్వాత టీవీ9 ఒక్క పాయింట్ తేడాతో నెంబర్ వన్ ప్లేస్ లోకి వచ్చింది. అంతే టీవీ9 సంబరాలు హద్దులు దాటిపోయాయి. వాళ్ల స్టూడియోలో సంబరాలు.. ఆ ఫీట్ సాధించడానికి తాము ఎంత ప్రతిభా ప్రదర్శన చేయాల్సి వచ్చిందో కథలు కథలుగా ప్రజలకు వివరించారు. అంత వరకూ బాగానే ఉంది..కానీ కొత్తగా రోడ్లపై ప్రచార కార్యక్రమాలు ప్రారంభించింది టీవీ నైన్. డివైడర్ల మధ్య ఉండే హోర్డింగ్స్‌ పెట్టింది.

తాము నెంబర్ వన్ వచ్చామని చెప్పుకోవడం కాకుండా.. కుట్ర ద్వారా నెంబర్ వన్ వచ్చిందన్న అర్థంలో పెట్టుకుని అది ఎక్కువ కాలం ఉండదని చెప్పుకొచ్చారు.. పోటీ చానల్ పేరు ఎక్కడా ప్రస్తావించకపోవడంతో టీవీ9కే ఆ పొజిషన్ కుట్ర ద్వారా వచ్చిందని చెబుతున్నారేమో.. అది ఎక్కువ కాలం నిలబడదని చెబుతున్నట్లుగా ఉందన్న అభిప్రాయం వినిపించడం ప్రారంభమయింది. అయితే అది కాదని.. టీవీ9నే.. ఎన్టీవీని మాక్ చేస్తోందని కొంత మంది చెబుతున్నారు. కారణం ఏదైనా ఆ రెండు మీడియా చానల్ల మధ్య వార్ రోడ్డున పడినట్లయింది.

కొసమెరుపేమిటంటే.. ఈ పోస్టర్లపై ప్రజాప్రయోజనార్థం పెట్టినట్లుగా చెప్పుకున్నారు. ఈ రెండు టీవీ చానళ్లు.. ప్రజాప్రయోజనాలను ఎప్పుడో గాలికి వదిలేసి.. తమ యజమానులు.. వారికి మేళ్లు చేసే అధికార పార్టీలకు బాకా ఊదుతూ.. ప్రజల కోసం పోరాటాలు చేసే విపక్ష నేతలపై బురద చల్లడం ప్రారంభించి చాలా కాలం అయింది. అందుకే ఈ రెండు చానల్స్ ను చాలా పార్టీలు బ్యాన్ చేశాయి. విచిత్రంగా వార్తల విషయంలో ఇద్దరూ ఒకటే.. కానీ.. పోటీ మాత్రం.. రోడ్డున పడుతోంది. ఇది ఇంతటితో ఆగేలా లేదని.. ముందు ముందు ఈ కోల్డ్ వార్ మరింత ముదురుతుందని .. మీడియా వర్గాలు చెబుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తండేల్ @ రూ.40 కోట్లు

నాగచైతన్య 'తండేల్' సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. కార్తికేయ2 తర్వాత చందూ మొండేటి నుంచి వస్తున్న సినిమా ఇది. బన్నీ వాస్‌ నిర్మాత. సాయిపల్లవి కథానాయిక. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ...

బిగ్ న్యూస్ – సీఎస్ పేరుతో సైబర్ మోసాలు

తెలంగాణలో పోన్ ట్యాపింగ్ ప్రకంపనలు రేగుతోన్న వేళ సంచలన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. శాంతి కుమారి ఫోటోను డీపీగా...

వైసీపీకి ‘చిరు’ బెంగ

ఏపీ ఎన్నికల్లో ఉత్కంఠను రేకెత్తిస్తున్న నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటి. ఇక్కడి నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ప్రచారం ఉదృతంగా సాగుతోంది. ఇప్పటికే...

ఈవారం బాక్సాఫీస్‌: రాంగ్‌ ‘టైమింగ్‌’ కాదుగా!?

ఏపీలో ఎన్నిక‌ల వేడి రోజు రోజుకీ పెరుగుతోంది. ఎక్క‌డ విన్నా, రాజ‌కీయాల‌కు సంబంధించిన అంశాలే. ఎవ‌రు గెలుస్తారు, ఎవ‌రు ఓడిపోతారు? అనే చ‌ర్చ తీవ్రంగా సాగుతోంది. సినిమా ముచ్చట్ల‌కు కొంత‌కాలం పుల్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close