దేశంలోనే నెంబర్ 2 బసవతారకం ఆస్పత్రి – బాలకృష్ణకు చంద్రబాబు ప్రశంసలు !

తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలిసిన ఆస్పత్రి బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి. అత్యంత ఖరీదైన క్యాన్సర్ వైద్యాన్ని పేదలకు అతి తక్కువ ధరకు ఇస్తూ.. ఎంతో మందికి ప్రాణదానం చేస్తున్న ఆస్పత్రి అది. అందుకే తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా పేదలకు క్యాన్సర్ అంటే ముందుగా హైదరాబాద్‌లోని బసవతారకం ఆస్పత్రి వద్దకే వస్తారు. ఎంత మినిమం చార్జీలు తీసుకున్నా సర్వీసులో మాత్రం అద్భుతమైన పనితీరు చూపిస్తుంది ఆస్పత్రి. ఇప్పుడు క్యాన్సర్ చికిత్సలో దేశంలోనే రెండో స్థానంలో ఈ ఆస్పత్రి నిలిచింది.

ప్రముఖ మ్యాగజైన్ ఔట్ లుక్ నిర్వహించిన సర్వేలో దేశంలో అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం అందించే ఆస్పత్రులలో ముంబైలోని రిలయన్స్ ఫౌండేషన్ ఆస్పత్రి మొదటి స్థానంలో నిలవగా రెండో స్థానంలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి నిలిచింది. ఈ ఆస్పత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ. ఈ ఆస్పత్రి లో మెరుగైన వైద్య సౌకర్యల కోసం బాలకృష్ణ నిరంతరం తపన పడుతూంటారు. పెద్ద ఎత్తున విరాళాల సేకరణకు సమయం కేటాయిస్తూ ఉంటారు. ఎక్కడా చిన్న సమస్య రాకుండా చూసుకుంటూ ఉంటారు. క్యాన్సర్ ఆస్పత్రి నిర్వహణలో ఆయన తీరు ఔట్ లుక్ పత్రిక ప్రశంసించింది. నిరుపేదలకు అతి తక్కువ ధరకే అద్భుతమైన క్యాన్సర్ చికిత్స అందిస్తున్నారని కొనియాడింది.

బసవతారకం ఆస్పత్రి సాధించిన ఘనతపై.. చంద్రబాబునాయుడు సంతృప్తి వ్యక్తం చేశారు. నందమూరి బాలకృష్ణకు శుభాకాంక్షలు చెప్పారు. క్యాన్సర్ చికిత్సలో అందుబాటులోకి వస్తున్న అత్యాధునిక చికిత్స పద్దతుల్ని ఎప్పటికప్పుడు సమకూర్చుకుంటూ మంచి వైద్య సేవలు అందిస్తున్నారని ప్రశంసించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close