14వ తేదీ నుంచి రోడ్డెక్కనున్న జనసేనాని వారాహి !

జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్రకు ముహుర్తం ఖరారయింది. ఈ నెల 14వ తేదీన అన్నవరంలో పూజలు చేసి వైఎస్ఆర్‌సీపీపై దండయాత్ర ప్రారంభించబోతున్నారు. ఈ సందర్భంగా తొలి విడత రూట్ మ్యాప్ ను జనసేన పార్టీ కీలక నేత నాదెండ్ మనోహర్ ప్రకటించారు. తొలి విడత యాత్ర తూర్పుగోదావరి జిల్లాలో జరగనుంది. ప్రత్తిపాడు. పిఠాపురం కాకినాడ రూరల్, రాజోలు , నర్సాపురం ఇలా అన్న వరం నుంచి భీమవరం వరకూ యాత్ర సాగుతుందని నాదెండ్ల తెలిపారు. యాత్రలో భాగంగా ప్రతీ రోజూ..ఓ చోట్ల ఫీల్డ్ విజిట్ ఉంటుందని నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.

రాష్ట్రవ్యాప్తంగా వారాహి యాత్ర చేపట్టాలని పవన్ కల్యాణ్ ఎప్పుడో నిర్ణయించుకున్నారు. వాహనం రెడీ అయి ఆరు నెలలు అవుతుంది. అయితే గతంలో ముందస్తు ఎన్నికలు ఉంటాయన్న కారణంగా వాహనాన్ని రెడీ చేయించుకున్నరు. కానీ ముందస్తుకు వెళ్లేందుకు ప్రభుత్వం సిద్ధపడకపోవడంతో పవన్ యాత్రను వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు ఎన్నికుల దగ్గర పడటం.. తెలంగాణతో పాటు ఏపీకి కూడా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయన్న ప్రచారం ప్రారంభం కావడంతో.. సినిమాలకు టైట్ షెడ్యూల్ ఉన్నప్పటికీ.., రాజకీయ యాత్రల కోసం సమయం కేటాయించాలని నిర్ణయించుకున్నారు.

గోదావరి జిల్లాల నుంచి యాత్ర ప్రారంభించడానికి ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయని జనసేన వర్గాలు చెబుతున్నాయి. ఇటీవలి కాలంలో పవన్ తమకు బలం ఉన్న స్థానాల గురించే ఎక్కువ మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో ఆయన జనసేన పార్టీకి బలం ఉన్న జిల్లాల్లోనే ఎక్కువగా పర్యటించాలని అనుకుంటున్నట్లుగా భావిస్తున్నారు. అయితే వారాహి రాష్ట్రమంతటా తిరుగుతుందని.. జనసేన వర్గాలు చెబుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈ ప్ర‌శ్న‌కు బ‌దులేది జ‌క్క‌న్నా..?!

RRR.... ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోనే ఓ చ‌రిత్ర‌. వ‌సూళ్ల ప‌రంగా, రికార్డుల ప‌రంగా, అవార్డుల ప‌రంగానూ... ఈ సినిమాకు తిరుగులేదు. మ‌ల్టీస్టార‌ర్ స్టామినా పూర్తి స్థాయిలో చాటి చెప్పిన సినిమా ఇది. తెలుగు...

నో హోప్స్ : డబ్బుల పంపకంపై జగన్ సిగ్నల్ ఇచ్చారా ?

చంద్రబాబులా నా దగ్గర డబ్బల్లేవు.. చంద్రబాబు డబ్బులిస్తే తీసుకుని నాకే ఓటేయండి అని జగన్ రెడ్డి ఎన్నికల ప్రచారసభల్లో తన ప్రచార స్పీచ్‌లలో కొత్తగా చెబుతున్నారు. జగన్ దగ్గర డబ్బుల్లేవా అని వైసీపీ...

కాంగ్రెస్‌లో మల్లారెడ్డి కోవర్టులా .. అసలు కాంగ్రెస్ కోవర్టే మల్లారెడ్డినా ?

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన కోవర్టులున్నారని ప్రకటించుకున్నారు. ఎవరయ్యా వాళ్లు అంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ లోకి జంప్ అయిన వాళ్లు. వాళ్లందర్నీ తానే కాంగ్రెస్ లోకి పంపానని...

ఈసీ ఆదేశించకుండానే షర్మిలపై కేసులు కూడా !

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు.. వ్యవహారాలు అన్నీ ఈసీ పరిధిలోకి వస్తాయి. కోడ్ ఉల్లంఘిస్తే.. చర్యలు ఈసీ తీసుకోవాలి. కానీ ఏపీలో రాజ్యాంగం వేరుగా ఉంటుంది. ఎన్నికల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close