మోదీ, షాలతో భేటీకి ఢిల్లీకి చంద్రబాబు !

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఢిల్లీ వెళ్తున్నారు. శనివారం ఉదయం వరకూ ఆయన ఢిల్లీ పర్యటన గురించి సీక్రెట్ గానే ఉంది. శనివారం సాయంత్రం అమిత్ షాతో… ఆదివారం ప్రధాని మోదీతో భేటీ అవుతారన్న ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు ఏమీ అధికారంలో లేరు కాబట్టి వారితో ఎలాంటి అధికారిక విషయాలు చర్చించే అవకాశం లేదు. కేవలం రాజకీయ అంశాలపై మాత్రమే చర్చించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

టీడీపీని ఎన్డీఏలో చేర్చుకోవద్దని తానే ఎన్డీఏలో చేరుతానని సీఎం జగన్ ఆఫర్ ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. అందుకే కొన్ని విషయాన్ని బీజేపీ నుంచి వైసీపీకి సహకారం అందుతోందని చెబుతున్నారు. అయితే అనూహ్యంగా చంద్రబాబును మోదీ, షా పిలవడంతో ఇప్పుడు ఏమైనా కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయా అన్న చర్చ జరుగుతోంది. ఇటీవల పలు సందర్భాల్ల మోదీ విధానాలను తాను సమర్థిస్తానని .. ఎన్డీఏలో చేరికపై కాలమే నిర్ణయిస్తుందని చెబుతున్నారు.

ఏపీలో ఉన్న అధికార పార్టీ బీజేపీకి అడ్డం తిరగడానికి ఏ మాత్రం సిద్ధంగా లేదు. వారు చెప్పినవన్నీ చేయాల్సి వస్తోంది. ఇలాంటి పార్టీని వదులుకుని టీడీపీతో బీజేపీ జట్టు కడుతుందా అన్నది కూడా సందేహమే. పొత్తులేమీ అక్కర్లేదని.. ఎన్నికల్లో అక్రమాలు జరగకుండా చూస్తే చాలని.. ఎన్నికల తర్వాత మద్దతుగా ఉంటామని టీడీపీ వర్గాలు ప్రతిపాదిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. కారణం ఏదైనా ఎన్నికల వేడి ప్రారంభమైన సమయంలో మోదీ , షాలతో చంద్రబాబు భేటీ కానుండటం చర్చనీయాంశం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేసీఆర్, కేటీఆర్ లేకపోతే తెలంగాణ ఏమైపోతుందో !?

బీఆర్ఎస్ లేకపోతే తెలంగాణను ఎవరో ఎత్తుకుపోతారన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. తాము ఉన్నప్పుడంతా స్వర్గం.. ఇప్పుడు నరకం అని ప్రజలకు చెబుతున్నారు. విచిత్రం ఏమిటంటే.. కొత్తగా తాము లేకపోతే...

వాలంటీర్ల లేకపోతే ఇంటింటికి పెన్షన్లు ఇవ్వలేరా ?

ఒకటో తేదీన పించను ఇంటి వద్ద ఇవ్వడానికి ఉద్యోగులు సరిపోరని నమ్మించడానికి ఏపీ ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న వారు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. పించన్లను బ్యాంక్ అకౌంట్లలో...

కండోమ్స్ ఎక్కువగా వాడేది వారేనా..మోడీకి కౌంటర్

లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని మోడీ ప్రసంగం ఆశ్చర్యపరుస్తోంది. గతానికి భిన్నంగా మాట్లాడుతుండటమే ఇందుకు కారణం.గాంధీ కుటుంబంపై మాత్రమే విమర్శలు చేసే మోడీ గత కొద్ది రోజులుగా రూట్ మార్చారు. కాంగ్రెస్ అకారంలోకి...

ఔను..బీజేపీతో ఒప్పందం ఉందంటోన్న కేటీఆర్..!?

బీజేపీ - బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తోన్న వేళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాము బీజేపీతో కలిసే ఉన్నామనే పరోక్షంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close