బీజేపీ, మోదీ మాటెత్తకుండానే కేసీఆర్ బహిరంగసభ ప్రసంగం !

కేసీఆర్ బహిరంగసభా వేదికపై గత రెండు, మూడేళ్లలో ఎక్కడ మాట్లాడినా ఆయన ప్రసంగంలో సగం బీజేపీ, మోదీని విమర్శించడానికే ఉండేది. తాను జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నానని బీజేపీ సంగతి చూస్తానని చెప్పేవారు . బీజేపీ చేసిన నిర్వాకాలంటూ ఎండగట్టేవారు. గత ఏడాదిన్నర కాలంలో చాలా జిల్లాల సమీకృత కలెక్టరేట్ల ప్రారంభోత్సవాలకు వెళ్లి బహిరంగసభలు ఏర్పాటు చేశారు. అన్నింటిలోనూ బీజేపీపై యుద్ధం ప్రకటించారు. కానీ ఈ ఆదివారం మహారాష్ట్ర సరిహద్దులోని నిర్మల్ కలెక్టరేట్ ఓపెనింగ్ వెళ్లి నిర్వహించిన బహిరంగసభలో బీజేపీ, మోదీ మాటే ప్రస్తావించలేదు. కేంద్రాన్ని పల్లెత్తు మాట అనలేదు.

దేశమమంతా తెలంగాణ మోడల్ కోరుతోందని చెప్పుకొచ్చారు. దశాబ్ది వేడుకల్లో గంటన్నర ప్రసంగించిన తర్వాతకూడా చేసినవి చెప్పడానికి ఇంకా మిగిలిపోయాయని కేసీఆర్ చెప్పుకొచ్చారు. మెడికల్ కాలేజీలు సమైక్య రాష్ట్రంలో ఉంటే అసుల వచ్చేవి కాదన్నారు. ఎన్నిక‌ల త‌ర్వాత ఫుడ్ ప్రాసెసింగ్ సెంట‌ర్లు ఏర్పాటు చేస్తామని భరోసా ఇచ్చారు. గ‌తంలో తాగు, క‌రెంట్, సాగునీటి స‌మ‌స్య‌లు ఉండేవి. వీట‌న్నింటిని 9 ఏండ్ల‌లో అధిగ‌మించామని.. రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి బాగుంది కాబ‌ట్టి.. భ‌విష్య‌త్ కోసం పురోగ‌మించాలని పిలుపునిచ్చారు.

మ‌హారాష్ట్ర ప్ర‌జ‌లు మ‌న ప‌థ‌కాల‌ను చూసి తెలంగాణ మోడ‌ల్ కావాల‌ని కోరుతున్నారు. తెలంగాణ మోడ‌ల్ భార‌త‌దేశ‌మంతా మార్మోగుతుంది. అందుకు మీరే కార‌ణం అని కేసీఆర్ ఉద్యోగుల‌ను అభినందించారు. కేసీఆర్ ప్రసంగంలో జాతీయ అంశాలు లేకపోవడంతో బీఆర్ఎస్ నేతలుకూడా ఆశ్చర్యపోతున్నారు. కవితను అరెస్ట్ చేయకుండా బీజేపీతో ఒప్పందానికి రావడం వల్లనే కేసీఆర్ ప్రసంగంలో మార్పు వచ్చిందన్న అభిప్రాయం వినిపిస్తోంది. కేసీఆర్ ఇలా బీజేపీని విమర్శించకపోవడం.. బీజేపీ నేతలకు కూడా ఇబ్బందికరంగా మారింది. ఏదో లాలూచీ జరిగిందన్న ప్రచారానికి ఇది బలం ఇస్తోందని వారు వాపోతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close