‘హిట్’ డైరెక్ట‌ర్‌తో.. దిల్ రాజు పాన్ ఇండియా మూవీ

హిట్ తో ఆక‌ట్టుకొన్నాడు శైలేష్ కొల‌ను. ఆ త‌ర‌వాత హిట్ 2 తీశాడు.. అదీ హిట్టే. అలా హిట్ టైటిల్ ఓ ఫ్రాంచైజీగా మారిపోయింది. ఇప్పుడు వెంక‌టేష్‌తో సైంధ‌వ్ తీస్తున్నాడు. ఈ డిసెంబ‌రులో విడుద‌ల అవుతోంది. ఆ త‌ర‌వాత‌.. నాని హీరోగా హిట్ 3 ప‌ట్టాలెక్కుతుంది. ఈలోగా దిల్ రాజు బ్యాన‌ర్‌లో ఓ సినిమా చేయ‌డానికి శైలేష్ సంత‌కాలు చేశాడు. ఈసారి పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌బోతున్నాడ‌ట‌. ఇది కూడా హిట్ లానే ఓ ఇన్వెస్టిగేష‌న్ థ్రిల్ల‌ర్‌. క‌థ సిద్ధ‌మైంది. ఓ బాలీవుడ్ హీరోకి ఈ క‌థ వినిపించే ప్ర‌య‌త్నాల్లో ఉన్నాడు దిల్ రాజు. అది కుద‌ర‌ని ప‌క్షంలో.. తెలుగు హీరోతోనే పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందిస్తాడ‌ని తెలుస్తోంది. ఈ సినిమా బ‌డ్జెట్ దాదాపుగా రూ.150 కోట్ల‌ని టాక్‌. శైలేంద్ర ఆ స్థాయిలో సినిమాని మోయ‌గ‌ల‌డా? లేదా? అనేది క్వ‌శ్చ‌న్ మార్క్‌. సైంధ‌వ్ భారీ బ‌డ్జెట్ సినిమానే. కాక‌పోతే వంద‌, రూ.150 కోట్ల స్థాయి కాదు. ఆ సినిమాని శైలేష్ ఎలా హ్యాండిల్ చేస్తాడ‌న్న‌దానిపై పాన్ ఇండియా సినిమా ఎప్పుడ‌న్న‌ది డిసైడ్ అవుతుంది. దిల్ రాజు ఈ మ‌ధ్య రిస్కీ నిర్ణ‌యాలు ఎక్కువే తీసుకొంటున్నాడు. సైంధ‌వ్ రిజ‌ల్ట్ ఎలా ఉన్నా.. శైలేష్ సినిమాని ప‌ట్టాలెక్కించాల్సిందే అనుకొంటున్నార్ట‌. కాక‌పోతే సైంధ‌వ్ హిట్ అయితే.. కావ‌ల్సిన హీరో దొరుకుతాడు. లేదంటే దొరికిన హీరోతో ఎడ్జ‌స్ట్ అయిపోవాలంతే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆర్జీవీకి కూడా ప్రజాధనంతో బిల్లు సెటిల్ చేసిన జగన్ !

రామ్ గోపాల్ వర్మ ఏపీ ప్రజాధనాన్ని దండుకున్నారు. బయటకు తెలిసిన వివరాల ప్రకారం రెండు చెక్కుల ద్వారా రూ. కోటి 14 లక్షలు ఆయన ఖాతాలో చేరాయి. ఆయనకు చెందిన ఆర్జీవీ...

కూతుర్ని ప్రాపర్టీతో పోల్చిన ముద్రగడ !

ముద్రగడ పద్మనాభం అంటే మంచీ చెడూ రాజకీయ నేత అనుకుంటారు. కానీ ఆయన కుమార్తెను ప్రాపర్టీగా చూస్తారు. అలా అని ఎవరో చెప్పడం కాదు. ఆయనే చెప్పుకున్నారు. ఉదయం తన తండ్రి రాజకీయ...

వైసీపీ మేనిఫెస్టోలో ట్విస్ట్ – ఈ మోసాన్ని ఎవరూ ఊహించలేరు !

వైసీపీ మేనిఫెస్టోలో అతిపెద్ద మోసం .. రాజకీయవర్గాల్లో సంచలనం రేపుతోంది. చాలా పథకాలకు రెట్టింపు ఇస్తామని ప్రచారం చేస్తున్నారు. కానీ ఒక్క రూపాయి కూడా పెంచలేదు. అసలు ట్విస్ట్ ఇప్పుడు లబ్దిదారుల్లోనూ సంచలనంగా...

కేసీఆర్ రూ. కోటి ఇచ్చినా … మొగులయ్య కూలీగా ఎందుకు మారారు?

కిన్నెర కళాకారులు, పద్మశ్రీ దర్శనం మొగులయ్య రోజు కూలీగా మారారంటూ ఓ చిన్న వీడియో, ఫోటోలతో కొంత మంది చేసిన పోస్టులతో రాజకీయం రాజుకుంది. తనకు రావాల్సిన పెన్షన్ రావడం లేదని.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close