చైతన్య : ఏపీలో ఓట్ల గల్లంతు – ఈ మాత్రం దానికి ఎన్నికలు అవసరమా ?

ప్రజాస్వామ్యం అంటే ప్రజలు అందరూ ఓట్లేసి పాలకుల్ని ఎంచుకోవడం. అయితే ఓట్లేసే వాళ్లను పరిమితం చేసి… ఓట్లను గల్లంతు చేసి.. తమకు అనుకూలమైన వాళ్లతోనే ఓట్లు వేయించుకుని గెలుస్తామంటే అది ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది..?. టెక్నాలజీ ఇంత పెరిగిన తర్వాత కూడా ఎవరి ఇష్టారీతిన వాళ్లు ఓట్లు తొలగించుకుని.. కావాల్సిన వారిని చేర్పించుకుని గెలవాలనుకుంటే ఇక ప్రజాస్వామ్యం ఎందుకు ?. మెజార్టీప్రజల అభిప్రాయం ప్రకారమే పాలకులు ఉండాలి. ప్రజలు వ్యతిరేకిస్తారని ఓట్లే తీసేస్తే.. అది ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది. ప్రస్తుతం ఏపీలో అవే పరిస్థితులు ఉన్నాయి.

గుంటూరులో ఒక్క పోలింగ్ బూత్ వందల కొద్దీ దొంగ ఓట్లు

ఓటర్ల జాబితా ప్రకారం మచ్చుకు అక్కడక్కడా పరిశీలన జరిపితే గుంటూరులో శ్యామలా నగర్ అనే ప్రాంతంలో ఒక్క ఇంట్లోనే రెండు వందలకుపైగా దొంగ ఓట్లు నమోదు చేశారు. అది చిన్న విషయం కాదు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం మొత్తం మీద ఇలా ఎన్ని ఓట్లు నమోదు చేశారో.. ఎంత మంది ఓట్లు తొలగించారో చెప్పడం కష్టం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేస్తారనుకున్న వారందరి ఓట్లు తొలగిస్తున్నారు. దొంగ ఓట్లు చేరుస్తున్నారు. ఇలా తొలగింపు ఎంత దారుణంగా సాగుతుందో.. విశాఖలో పరిస్థితులు కళ్ల ముందు కనిపిస్తున్నాయి. ఓ పోలింగ్ బూత్ లో సగం మందిని తీసేసిన సందర్భాలు కనిపిస్తున్నాయి.

ప్రజల ప్రాథమికహక్కును హరిస్తే ఇక ఎన్నికలు ఎందుకు ?

ఒక్క సారి ప్రజలు అధికారం ఇచ్చారని వారి ప్రాథమిక హక్కులుకూడా హరించి . ఎల్లకాలం తామే అధికారంలో ఉంటామని బలప్రయోగం చేసేదానికి ప్రజాస్వామ్యం ఎందుకు ? వెంటనే తమకు అలవాటైన రీతిలో వైసీపీ కార్యకర్తలకు మాత్రమే ఓటు హక్కు అని అర్థరాత్రి ఓ జీవో జారీ చేసేస్తే సరిపోతుంది. లేదా ఎన్నికలను రద్దు చేస్తున్నామని శాశ్వత ముఖ్యమంత్రిగా ప్రకటించుకుంటున్నామని చెప్పుకోవచ్చు. ఏం చేసినా ప్రజల కోరిక మేరకే అని చెప్పడం అలవాటు కాబట్టి.. అలాగే ప్రకటించేసుకుంటే.. ప్రజలకు కూడా ఓ బాధ తప్పుతుంది.

నేర మనస్థత్వం ఉన్న పాలకుల చేతిలో ప్రజాస్వామ్యం ఇంతే !

అత్యంత ఘోరమైన నేర, క్రూర మనస్థత్వం ఉన్న వారి చేతిలోకి పాలనా పగ్గాలు పోతే.. వ్యవస్థలన్నీ అంతే మారిపోతాయి. దానికి ఏపీనే ఉదాహరణ. తప్పుడు పనులుచేయడం ఏపీలో ఉన్న ప్రతి అధికారికి కామన్. జరిగిన తప్పుల్ని పట్టించుకోరు కానీ.. తప్పులు చేస్తారంటూ కొంత మందిని టార్గెట్ చేస్తారు. జరుగుతున్న అవినీతిని పట్టించుకోరు కానీ.. అప్పట్లో అవినీతి చేయబోయారని కేసులు పెడతారు. గెలవాలంటే.. అరాచకాలు చేయాల్సిందేనని.. డిసైడయ్యారు. రాజ్యాంగ వ్యవస్థలు ఓటర్ల ప్రాథమిక హక్కును కూడా కాపాడలేకపోతే ఈ దేశానికి ప్రజాస్వామ్యం అనే పదానికి అర్థం లేకుండా పోతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సీఐ అంజూ యాదవ్‌నూ సాగనంపారు !

తిరుపతిలో అత్యంత వివాదాస్పదమైన మహిళా సీఐ అంజూ యాదవ్ ను కూడా ఈసీ సాగనంపింది. పోలింగ్ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ విధుల్లో ఉండకూదని ఆర్థరాత్రే బదిలీ చేస్తూ ఈసీ ఉత్తర్వులు...

అల్లు అర్జున్ టూర్ : నంద్యాల ఎస్పీ, డీఎస్పీ, సీఐలపై ఈసీ చార్జ్‌షీట్

అల్లు అర్జున్ నంద్యాల పర్యటన పోలీసులపై కూడా కేసులు నమోదయ్యేలా చేసింది. అల్లు అర్జున్ నంద్యాల పర్యటనకు పోలీసులు అనుమతి తీసుకోలేదు. మామూలుగా అయితే పెద్దగా మ్యాటర్ కాదు....

వారణాశిలో మోడీ నామినేషన్‌కు చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడును వారణాశిలో తన నామినేషన్ కు రావాల్సిందిగా ప్రధాని మోడీ ఆహ్వానించారు. మంగళవారం ప్రధాని మోద ీనామినేషన్ వేయనున్నారు. వారణాశిలో ఎన్నికలు చివరి విడతలో జరగున్నాయి. పదమూడో తేదీన...

మిత్రుడు దంతులూరి కృష్ణ కూడా జగన్‌కు వ్యతిరేకమే !

జగన్మోహన్ రెడ్డికి అధికారం అందిన తర్వాత ఆ అధికారం నెత్తికెక్కడంతో దూరం చేసుకున్న వారిలో తల్లి, చెల్లి మాత్రమే కాదు స్నేహితులు కూడా ఉన్నారు. చిన్న తనం నుంచి అంటే 35...

HOT NEWS

css.php
[X] Close
[X] Close