పవన్ కళ్యాణ్ విడాకుల పుకార్లు – అవి పుట్టింది బ్లూ మీడియాలోనే !?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితాన్ని లక్ష్యంగా చేసుకుని ఆయన రాజకీయ జీవితాన్ని దెబ్బకొట్టడానికి ఏపీలో అధికార పార్టీ చేయని ప్రయత్నాలే లేవు. నేరుగా విమర్శించడమే కాదు తెర వెనుక కూడా ప్రయత్నాలు చేస్తారు. ఆయన మాజీ భార్యతో సొంత చానల్‌లో ఇంటర్యూలు ఇప్పించి వివాదాస్పదమైన మాటలు చెప్పించి క్యారెక్టర్ ను దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు మరోసారి ఆయన విడాకులు తీసుకున్నారంటూ ప్రచారం ప్రారంభించేశారు.

పవన్ కళ్యాణ్,, ఆయన మూడో భార్య అన్నా లెజ్‌నోవా విడిపోయారా ? అనే క్వశ్చన్ మార్క్ తో ప్రముఖ ఇంగ్లిష్ , హిందీ వెబ్ సైట్లు కూడా కథనాలు రాసేస్తున్నాయి. వాటికి ఆ సమాచారం ఎక్కడి నుంచి వచ్చిందంటే… తెలుగులోని కొన్ని బ్లూ మీడియా విభాగాల నుంచే. వారు రాసిన కొన్ని క్వశ్చన్ మార్క్ స్టోరీలతో వారు కూడా అదే ప్రచారం చేస్తున్నారు. వారి అనుమానాలకు బేసిస్… అన్నా లెజ్‌నోవా ఇటీవలి కాలంలో అసలు కుటుంబ కార్యక్రమాల్లో పాల్గొనకపోవడం. ఆమె కుటుంబ కార్యక్రమాల్లో పాల్గొన్నట్లుగా ఫోటోలు కూడా బయటకు రావడం లేదు కాబట్టి ఆమె విడిపోయారని తీర్మానించుకుని కథలు రాసేస్తున్నారు.

పిల్లల చదువుల కోసం లెజ్ నోవా చాలా కాలంగా విదేశాల్లో ఉంటున్నారు. పిల్లల్ని సింగపూర్‌లో చదివిస్తున్నారన్న ప్రచారం ఉంది. సెలబ్రిటీ పిల్లలుగా ఎక్కువ ఫోకస్ పడకుండా అందరిలాగే పెంచాలన్న ఉద్దేశంతో వీలైనంత వరకూ మీడియా కు దూరంగా ఉంటున్నారుని మెగా ఫ్యామిలీ వర్గాలు చెబుతున్నాయి. కొన్ని కుటుంబపరమైన కార్యక్రమాలకూ పవన్ కల్యాణ్ కూడా వెళ్లరన్న సంగతిని వారు గుర్తు చేస్తున్నారు.

నిజానికి ఇది కుటుంబపరమైన విషయం. దీనిపై వారు అధికారికంగా వారు ప్రకటించేదాకా ఇలా ప్రచారం చేయడం వారి వ్యక్తిగత విషయాల్లో చొరబడటమే అవుతుంది. నిజానికి పవన్ కల్యాణ్ విషయంలో ఇది మరీ సున్నితం. ఎందుకంటే ఆయన ప్రజా జీవితంలో ఉన్నారు. ఆయన కుటుంబపరమైన విషయాలను మరింత కేర్ ఫుల్ గా డీల్ చేయాల్సి ఉంటుంది. కానీ ఆయన వ్యక్తిత్వాన్ని, వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేసుకునే అధికార పార్టీ .. ఆయనపై పన్నే కుట్రలు ఏ స్థాయిలో ఉంటాయో ఊహించడం కష్టమే. అందులో భాగంగానే ఈ ప్రచారాలన్న అనుమానాలు జనసైనికులు ఎక్కువగా వ్యక్తం చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

స్మూత్ గా ఓట్ల బదిలీ ఖాయం – ఫలించిన కూటమి వ్యూహం !

ఏపీలో ఎన్డీఏ కూటమి మధ్య ఓట్ల బదిలీ సాఫీగా సాగిపోయే వాతావరణం కనిపిస్తోది. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేయాలని అనుకున్నప్పుడు చాలా మంది ఓటు బదిలీపై...

బెట్టింగ్ రాయుళ్ల టార్గెట్ ప‌వ‌న్‌!

ఏపీ మొత్తానికి అత్యంత ఫోక‌స్ తెచ్చుకొన్న నియోజ‌క వ‌ర్గం పిఠాపురం. ప‌వ‌న్ క‌ల్యాణ్ అక్క‌డి నుంచి పోటీ చేయ‌డంతో పిఠాపురం ఒక్క‌సారిగా టాక్ ఆఫ్ ఏపీ పాలిటిక్స్ అయ్యింది. గ‌త ఎన్నిక‌ల్లో భీమ‌వ‌రం,...

ప్రధాని రేసులో ఉన్నా : కేసీఆర్

ముఖ్యమంత్రి పదవి పోతే పోయింది ప్రధానమంత్రి పదవి కోసం పోటీ పడతానని కేసీఆర్ అంటున్నారు. బస్సు యాత్రతో చేసిన ఎన్నికల ప్రచారం ముగియడంతో .. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ఈ...

ఎక్స్ క్లూజీవ్‌: ర‌ణ‌వీర్‌, ప్ర‌శాంత్ వ‌ర్మ‌… ‘బ్ర‌హ్మ‌రాక్ష‌స‌’

'హ‌నుమాన్' త‌రువాత ప్ర‌శాంత్ వ‌ర్మ రేంజ్ పెరిగిపోయింది. ఆయ‌న కోసం బాలీవుడ్ హీరోలు, అక్కడి నిర్మాణ సంస్థ‌లు ఎదురు చూపుల్లో ప‌డిపోయేంత సీన్ క్రియేట్ అయ్యింది. ర‌ణ‌వీర్ సింగ్ తో ప్ర‌శాంత్ వ‌ర్మ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close