యువగళం : అసలైన నారా లోకేష్ !

యువగళం పాదయాత్ర ప్రారంభమయి ఐదు నెలలు అయింది. నారా లోకేష్ ఎన్ని రోజులు సెలవు తీసుకున్నారు…? పండుగ రోజులు.. ఓ కుటుంబ కార్యక్రమం.. మరో సారి ఎన్నికల నిబంధనల పేరుతో అడ్డుకున్న సందర్భం తప్ప… లోకేష్ తనకు అనారోగ్యమని.. లేకపోతే మరో వ్యక్తిగత కారణంతో కానీ ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదు. కాళ్లకు బొబ్బలెక్కినా నిరంతరాయంగా నడుస్తూనే ఉన్నారు. ఆ పట్టుదల అసామాన్యం. అసలు ఒక్క రోజు విరామం ఇద్దామనే ఆలోచనే రానీయడం లేదు.

పైగా రోజంతా లోకేష్ షెడ్యూల్ చాలా బిజీగా ఉంటుంది. తెల్లవారు జాము నుంచి అర్థరాత్రి వరకూ ఆయన ప్రజలు , పార్టీ క్యాడర్ మధ్యే ఉంటున్నారు. రోజూ వందల మందికి సెల్ఫీలు ఇస్తున్నారు. తనతో కలిసి నడిచేందుకు వస్తున్నవారందరితో మాట్లాడుతున్నారు. ఉదయం.. మధ్యాహ్నం… సాయంత్రం ఇలా ప్రతి సందర్భంలోనూ ఆయనచుట్టూ వందల మంది ఉంటున్నారు. అయినా ఎక్కడా చిన్న రిమార్క్ లేకుండా చిరునవ్వుతోనే ఉంటున్నారు. ప్రజల మధ్య ఉండటం తనకు ఇష్టమని చేతలతో చూపిస్తున్నారు.

అదే సమయంలో తన పాదయాత్ర లక్ష్యాలను నిర్దేశించుకోవడానికి ఆయన విభిన్న వర్గాలతో సమావేశం అవుతున్నారు. వారికి భరోసా ఇస్తున్నారు. ఎవరికైనా సాయం అవసరం అనుకుంటే తక్షణం చేస్తున్నారు. లోకేష్ దృక్పథం ఇతర పార్టీల సానుభూతిపరుల్ని కూడా ఆకర్షిస్తోంది. అందుకే పాదయాత్రకు రాను రాను ఆదరణ పెరుగుతోంది. మొదట కుప్పంలో పాదయాత్ర ప్రారంభమైన తర్వాత చిత్తూరు జిల్లాలో పాదయాత్రకు జనం లేరంటూ చెప్పడానికి ప్రత్యర్థులు ప్రయత్నించారు కానీ ఇప్పుడు ఆ సాహసం చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఎక్కడికక్కడ లోకేష్ వెంట నడిచేవారిలో పది వేల మంది కంటే తక్కువ ఎక్కడా ఉండటం లేదు.

నిజానికి లోకేష్ సీఎం అభ్యర్థి కాదు.. ఓ పార్టీ అధ్యక్షుడు కాదు.. ఏ ప్రత్యేకమైన పదవిలో లేరు. కానీ పార్టీ కోసం పని చేసిన ఇమేజ్ ఆయనకు ఇలా అటెన్షన్ తీసుకొచ్చింది. పట్టుదలతో తన ఇమేజ్ మేకోవర్ చేసుకోవడంలో లోకేష్ అద్భుతమైన పురోగతి సాధించారు. చివరికి లక్ష్యం చేరగలడని అందరిలోనూ నమ్మకం కలిగించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రూ. 14 వేల కోట్లు లబ్దిదారుల ఖాతాల్లో వేస్తారా ? లేదా ?

పోలింగ్ ముగిసింది. ఇప్పుడు గత ఆరు నెలలకు ఏపీ ప్రజలకు ఆపిన పథకాల డబ్బులను ఏపీ ప్రభుత్వం ప్రజల ఖాతాల్లో వేస్తుందా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది. పోలింగ్ కు మందు...

అన్నీ తెలుసు కానీ ఈసీ చూడటానికే పరిమితం !

దాడులపై ఇంటలిజెన్స్ నుంచి ముందస్తు సమాచారం ఉందని సీఈవో మఖేష్ కుమార్ మీనా చెప్పుకొచ్చారు. మరి ఎందుకు ఆపలేకపోయారనే విషయాన్ని మాత్రం ఆయన చెప్పలేకపోయారు. వైసీపీ ఎన్నికల్లో గెలవడానికి ఎంచుకున్న మార్గం.. దాడులు,...

ద్వేషం స్థాయికి వ్యతిరేకత – జగన్ చేసుకున్నదే!

ఏ ప్రభుత్వంపైనైనా వ్యతిరేకత ఉంటుంది. అది సహజం. కానీ ద్వేషంగా మారకూడదు. మారకుండా చూసుకోవాల్సింది పాలకుడే. కానీ పాలకుడి వికృత మనస్థత్వం కారణంగా ప్రతి ఒక్కరిని తూలనాడి.. తన ఈగో ...

పల్నాడులో దెబ్బకు దెబ్బ – వైసీపీ ఊహించనిదే !

పల్నాడులో పోలింగ్ రోజు మధ్యాహ్నం నుంచి జరిగిన పరిణామాలు సంచలనంగా మారాయి. ఉదయం కాస్త ప్రశాంతంగా పోలింగ్ జరిగినా.. తమకు తేడా కొడుతుందని అంచనాకు రావడంతో మధ్యాహ్నం నుంచివైసీపీ నేతలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close