పవన్‌పై కేసు – సీఎంతో డీజీపీ భేటీ ! ఏం చేయబోతున్నారు ?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్రను ఎలాగైనా ఆపాలని వైసీపీ అధినేత అనుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. వాంటీర్లపై ఆయన చేసిన వ్యాఖ్యలు వర్గాల మధ్య ఘర్షణ సృష్టించి..శాంతి భద్రతల సమస్య ఏర్పడేలా చేశాయని ఓ వార్డు వాలంటీర్ తో ఫిర్యాదు చేయించి కేసు పెట్టేశారు. పవన్ కల్యాణ్‌పై మూడు సెక్షన్ల కింద కేసు రిజిస్టర్ చేశారు. సెక్షన్‌ 153, 153ఏ, 505(2) కింద కేసులు పెట్టారు. ఇందులో సెక్షన్‌ 153 రెండు వర్గాల మధ్య గొడవలు జరిగి శాంతిభద్రతకు విఘాతం కలిగే ప్రమాదం ఉందని చెబుతుంది.

రెండోది 153 ఏ ప్రకారం రెండు మతాలు, రెండు కులాల మధ్య విద్వేషాలు చెలరేగే ఆస్కారం ఉన్నప్పుడు పెట్టే సెక్షన్. 505(2) ప్రకారం రూమర్స్‌ను ప్రచారం చేస్తే పెట్టే కేసు. ఇలా రూమర్స్ వల్ల గొడవలు జరుగుతాయని చెప్పినప్పుడు ఈ సెక్షన్‌లో కేసు రిజిస్టర్ చేస్తారు. ఇలా మూడు సెక్షన్‌లలో కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసుల నమోదు గురించి బయటకు తెలిసిన కాసేపటికి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి..సీఎం జగన్ ను కలిశారు. ఏ టాపిక్ పై కలిశారో స్పష్టత లేదు. కానీ పవన్ కల్యాణ్ పై నమోదు చేసిన కేసుల విషయంలో తదుపరి చర్యలు తీసుకునే అంశంపై చర్చ జరిగినట్లుగా ప్రచారం జరుగుతోంది.

మూడు కేసులు సీరియస్ కేసులే. ఇలాంటి కేసుల్లో ఏపీ పోలీసులు అర్థరాత్రి.. అపరాత్రి అని చూడకుండా ఇంటి తలుపులు బద్దలు కొట్టి అరెస్ట్ చేసితీసుకెళ్లిపోతారు. అయితే.. పవన్ కల్యాణ్ వాలంటీర్స్ పై చేసిన వ్యాఖ్యలు ఆ సెక్షన్ల కింద ఎలా వస్తాయో ఎవరికీ తెలియదు. వైసీపీ నేతలు ఎవర్ని ఆరెస్ట్ చేయాలనుకున్నా.. ఎవరో ఒకరితో ఫిర్యాదు ఇప్పించి ఈ సెక్షన్ల కింద కేసులు పెడుతూంటారు. పవన్ విషయంలోనూ అదే చేస్తున్నారు. అయితే పవన్ ను అరెస్ట్ చేసే ధైర్యం చేస్తారా అన్నది కీలకంగా మారింది. జగన్ రెడ్డి మానసిక స్థితి గురించి తెలిసిన వారు అరెస్ట్ చేయించకపోతేనే ఆశ్చర్యపోవాలన్న అభిప్రాయం వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మోదీ ప్రెస్‌మీట్లు పెట్టకపోవడానికి మీడియానే కారణం !

మోదీ గత పదేళ్లకాలంలో ఒక్క సారే ప్రెస్ మీట్ పెట్టారు. 2019 ఎన్నికల ప్రచారం ముగిసిపోయిన తర్వాత అమిత్ షాతో కలిసి ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్మీట్ లో...

ఆరోగ్యశ్రీ ఆస్పత్రులను ఇప్పుడెవరు పట్టించుకుంటారు !?

పేదలకు వైద్యం ఆపేస్తామని ప్రభుత్వం బిల్లులు ఇవ్వలేదని ఏపీలోని ఆరోగ్యశ్రీ ఆస్పత్రులు అల్టిమేటం జారీ చేశాయి. ఇప్పుడు ప్రభుత్వం లేదు. ఆపద్ధర్మ ప్రభుత్వం ఉంది. ఆ ప్రభుత్వం తమకు...

125 సీట్లు వచ్చినా కేంద్రంలో కాంగ్రెస్ సర్కార్ !?

బీజేపీ 250 సీట్లు సాధించినా కాంగ్రెస్ పార్టీ 125 సీట్లు సాధించినా ఒకటేనని.. తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. అలా ఎలా సాధ్యమంటే.. కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షాలు మద్దతిస్తాయి...

సెఫాలజిస్టులందరి మాట టీడీపీ కూటమే !

దేశంలో అగ్రశ్రేణి సెఫాలజిస్టులు అందరూ ఏపీలో టీడీపీ కూటమే గెలుస్తుందని విశ్లేషిస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ ఎప్పటి నుంచో తన వాదన వినిపిస్తున్నారు. ఏపీలో విస్తృతంగా పర్యటించి ఇంటర్యూలు చేసి వెళ్లిన ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close