మాది చిన్నదే తెలంగాణది రూ. 40వేల కోట్ల స్కామన్న ఏపీ సర్కార్ !

అప్పుల బండారాలు తవ్వేకొద్దీ బయటపడుతున్న ఏపీ సర్కార్…. తాము చేస్తున్న తప్పులు చిన్నవేనని.. తెలంగాణ సర్కార్ అంతకు మించి చేసిందనే విషయాలను బయట పెడుతోంది . ఈ అంశం ఇప్పుడు సంచలనంగా మారింది. రాయలసీమ ప్రాజెక్టులకు పైసా ఖర్చు చేయకుండా…. పనులు చేసినట్లుగా చూపించి రూ. 900 కోట్లను . .. నేరుగా రుణం తీసుకున్న ఆర్ఎఫ్‌సీ, పీఎఫ్‌సీ సంస్థల నుంచి కాంట్రాక్ట్ సంస్థ అయిన మేఘాకు మళ్లించారని పీఏసీ చైర్మన్ పయ్యావుల ఆరోపించారు. దీనిపై పత్రాలు బయట పెట్టారు. ఇది రాష్ట్రంలో సంచలనం అయింది.

దీనిపై ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. పనులు జరిగాయని చెప్పలేదు. కానీ పనులు జరిగినట్లుగా ఎన్జీటీ నిర్ధారించిందంటూ కొత్త కథలు చెప్పింది. రాయలసీమ కరువు నివారణ పేరుతో ఎలాంటి నిబంధనలు పాటించకుండా.. అనుమతులు తీసుకోకుండా ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టడంపై ఎన్జీటీ నిషేధం విధించింది. దీంతో ఆ ప్రాజెక్టు పనులు ఆగిపోయాయి. అప్పటికీ కొన్ని పనులుజరిగాయని ఎన్టీటీ రిపోర్టు ఇచ్చింది. ఆ రిపోర్టును అడ్డం పెట్టుకుని మేఘా కు నిధులు.. మళ్లించారు. ఎలక్ట్రో మెకానికల్ పనులు జరిగినట్లుగా ఆ నిధులు తీసుకున్నారు. కానీ అక్కడ అలాంటి పనులే జరగలేదని పయ్యావుల కేశవ్ ఆరోపించారు. దీనిపై ప్రభుత్వం వివరణ ఇవ్వలేదు.

అసలు ఏ అప్పు అయినా రణ సంస్థ నుంచి నేరుగా ఎలా కాంట్రాక్టర్ కు బదిలీ చేస్తారనేది సంచలనంగా మారింది. కన్సాలిడేటెడ్ ఫండ్ కు వస్తేనే… లెక్కల్లో కనిపిస్తుంది. లేకపోతే కనిపించదు. అయితే ఇలా రాకుండానే కాంట్రాక్టర్ కు ఇచ్చేయవచ్చని.. కాళేశ్వరం విషయంలో తెలంగాణ రూ. 40వేల కోట్లు ఇలా కాంట్రాక్ట్ సంస్థకు మళ్లించిందని సమర్థించుకుంది. ఏపీ సంగతి చెప్పమంటే.. సాక్ష్యంగా తెలంగాణ సర్కార్ ను చూపించడంతో .. ఇప్పుడు వివాదం ప్రారంభమయింది. తెలంగాణ మేఘా ఖాతాలోకి… రూ. నలభై వేల కోట్లు మళ్లించిందా అన్న చర్చ ప్రారంభమయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కర్ణాటకపై బీజేపీ నజర్..ఏక్ నాథ్ షిండే సంచలన వ్యాఖ్యలు..!!

మరోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే బీజేపీయేతర ప్రభుత్వాలను కూల్చుతుందని ప్రచారం జరుగుతోన్న వేళ మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మహారాష్ట్రలో లాగే కర్ణాటకలోనూ...

వన్స్ మోర్ ‘సుచి లీక్స్’: ఈసారి ధనుష్, జీవీ ప్రకాష్

సినిమా వార్తలని ఫాలో అయ్యేవారికి సుచీ లీక్స్ గురించి పరిచయం అవసరం లేదు. 'సుచీ లీక్స్‌' పేరుతో కోలీవుడ్‌లో దుమారం రేపారు సింగర్‌ సుచిత్ర. అప్పట్లో ఆమె నుంచి వచ్చిన...

పుష్ప ఇంపాక్ట్.. బన్నీ ఫుల్ క్లారిటీ

సినిమా ప్రభావం ఖచ్చితంగా సమాజంపై వుంటుందని కొందరి అభిప్రాయం. సమాజంలో ఉన్నదే సినిమాలో ప్రతిబింబిస్తుందని మరికొందరి మాట. సినిమాని సినిమాగా చుస్తారానినేది ఇంకొందరి వాదన. హీరో అల్లు అర్జున్ కూడా ఇదే అభిప్రాయాన్ని...

తీహార్ జైలుకు బాంబు బెదిరింపు… ఆందోళనలో కవిత అభిమానులు..?

అత్యంత భద్రత నడుమ ఉండే తీహార్ జైలుకు బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం రేపుతోంది. జైలును పేల్చేస్తామంటూ ఆగంతకులు మెయిల్ చేయడంతో అధికారులు అలర్ట్ అయి పోలీసులకు సమాచారం అందించారు. ఆగంతకుల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close