టీడీపీతో కలిసే పోటీ చేస్తామని జాతీయ మీడియాకు చెబుతున్న పవన్

జగన్ ను ఓడించేందుకు టీడీపీతో క‌ల‌సి పోటీ చేస్తామ‌ని జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ తేల్చి చెప్పారు. విప‌క్షాల ఓట్లు చీల‌కుండా ఉండాల‌నేది త‌మ పార్టీ విధానమని ఢిల్లీలో జాతీయ మీడియాలకు ఇచ్చిన ఇంటర్యూల్లో చెప్పారు. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసే పోటీ చేస్తాయ‌ని చెబుతున్నారు. ల టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తులతో 2014లో కలిసి పోటీ చేశాయని.. 2019లో విడిపోవడం జరిగిందన్నారు. మళ్లీ బీజేపీ, జనసేన కలిసినా.. టీడీపీ, బీజేపీ మధ్య అండర్‌స్టాడింగ్ ఇష్యూ ఉందన్నారు.

టీడీపీ, బీజేపీ మధ్య ఉన్న సమస్యలపై మాట్లాడటం సరికాదన్న పవన్‌ కల్యాణ్ కచ్చితంగాఅంద‌రం కలిసి పోటీ చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంపైనా స్పందించారు. సీఎం ఎవరనేది సమస్య కాదన్న అంటూ జనసేన కేడర్ త‌న‌ను సీఎంగా చూడాలనుకుంటున్నారన్నారు. క్షేత్రస్థాయిలో బలాబలాల ఆధారంగా నిర్ణయాలు ఉంటాయన్నారు.. ఎన్నికల సమయంలో సీఎం అభ్యర్ధిపై స్పష్టత వస్తుందన్నారు. తమ ప్రాధాన్యత కేవలం వైసీపీని ఓడించి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమేనని పవన్‌ స్పష్టం చేశారు.

జ‌గ‌న్ పాల‌న‌పై మాట్లాడుతూ, ఆధార్‌ లాంటి వ్యక్తిగత డేటా ఎందుకు ఇవ్వాలని చర్చ జరుగుతున్న సమయంలో ఏపీలో నెలకు ఐదు వేలకు రిక్రూట్ చేసిన ప్రైవేటు వ్యక్తులు డేటా సేకరిస్తున్నారని ఆరోపించారు . ఐరిష్‌, ఆధార్, బ్యాంక్ అకౌంట్స్ లాంటి సెన్సిటివ్‌ డేటాను తెలంగాణలో స్టోర్‌ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో లా అండ్‌ ఆర్డర్ ఇష్యూ ఉందన్నారు. మౌలిక వసతులు పూర్తిగా లేవని, రైతులకు మద్దతు ధర రావడం లేదన్నారు పవన్‌. ఉద్యోగులకు సక్రమంగా జీతాలు రావడం లేదు. ఇలాంటివి ప్రశ్నించడానికి జనసేన ముందుకోచ్చిందని దీనికి ప్రజామద్దతు కూడా ఉందని పవన్ కల్యాణ్ చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పాల్ గారి పార్టీ టిక్కెట్ కోసం రూ. 50 లక్షలు ఇచ్చాడట !

సమాజంలో కొన్ని వింతలు జరగుతూ ఉంటాయి. నమ్మాలా వద్దో తేల్చుకోలేము. కేఏ పాల్ ఎల్బీ నగర్ టిక్కెట్ ఇస్తానంటే రూ. 50 లక్షలు పాల్ కు ఇచ్చేశాడట. చివరికి పాల్ టిక్కెట్ ఇవ్వలేదని...

“ఈ ఆఫీస్” భద్రం – స్పందించిన ఈసీ

ఏపీ ప్రభుత్వం జీవోలను అన్నీ దాచిన ఈ ఆఫీస్ ను అప్ గ్రేడేషన్ పేరతో సమూలంగా మాల్చాలనుకున్న ఏపీ ప్రభుత్వానికి ఈసీ చెక్ పెట్టింది. ఈ ఆఫీస్ అప్ గ్రేడేషన్ పేరుతో...

విజయ్ సేతుపతి నుంచి ఓ వెరైటీ సినిమా

హీరోగానే కాకుండా ప్రతి నాయకుడిగానూ కనిపించి ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకున్న విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతి. హీరోయిజం లెక్కలు వేసుకోకుండా పాత్రలకు ప్రాధాన్యత ఇస్తూ ఆయన ప్రయాణం సాగుతోంది. ఇదే ఆయన్ని...

చంద్రముఖి కన్నా ఘోరం… ఆర్ఎస్పీ పై సోషల్ మీడియా ఫైర్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి తీహార్ జైల్లోనున్న ఎమ్మెల్సీ కవితను కలిసిన బీఆర్ఎస్ నేత ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close