వాసిరెడ్డి పద్మకూ పవన్‌ను లాగిపెట్టి కొట్టాలనిపిస్తోందట!

మహిళా కమిషన్ చైర్మన్ పదవి ఉందో లేదో తెలియదు .. ఆ పదవిని కాపాడుకోవాలంటే వైసీపీ మార్క్ బూతు లాంగ్వేజ్ ను ప్రయోగించకపోతే.. అంతే సంగతులని అర్థమయిందేమో కానీ పవన్ కల్యాణ్‌పై ప్రెస్ మీట్ పెట్టేశారు. ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడేశారు. పవన్ కల్యాణ్ ఎదురుగా వస్తే లాగిపెట్టి కొట్టాలనిపిస్తోందని.. కానీ సభ్యత ఉందని నోటీసులు ఇస్తున్నామని చెప్పుకొచ్చారు.

ఒక క్రిమినల్ కహానీ అల్లి ప్రభుత్వాన్ని పలచన చేయాలన్నది పవన్ కళ్యాణ్ కుట్ర. మూడు పెళ్లిళ్లు చేసుకుంటే తప్పేంటి అని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్. సినిమా హీరోలు ఏం చెప్పినా చెల్లుతుందా?, మాకు చాలా విషయాలు ప్రశ్నించాలని ఉంది. కనిపిస్తే.. ఎదురుపడితే లాగి లెంపకాయ కొట్టాలనిపిస్తుంది. సభ్యత ఉంది కనుకే నోటీసులు ఇస్తున్నాం.. అంటూ ఆవేశపడిపోయారు. వాడు, వీడు అంటూ రెచ్చిపోయారు. పవన్ కల్యాణ్ పెళ్లిళ్ల గురించీ మాట్లాడారు.

ఒకడు అమ్మాయి కనిపిస్తే ముద్దన్నా పెట్టాలి, కడుపు అయినా చేయాలి అంటాడు. సినీ రాజకీయ నాయకుల తీరుపై చర్చ జరగాలన్నారు. మహిళా కమిషన్‌కు రాజకీయ దురుద్దేశాన్ని ఆపాదిస్తున్నారని.. మహిళల సమక్షంలో రచ్చబండకు పవన్ కళ్యాణ్ రావాలని సవాల్ చేశారు. వాసిరెడ్డి పద్మ మాటల తీరు చూసి.. వైసీపీలో ఎవరికైనా బూతులందుకుటే తప్ప పదవులు గ్యారంటీ ఉండదన్న సంకేతాలు పంపినట్లేనని క్లారిటీ వస్తోంది.

అయినా పవన్ కల్యాణ్‌ను.. ప్రతిపక్ష నేతల్ని తిట్టడానికి .. మహిళా నేతల్ని పంపుతూండటం.. విస్మయకరంగా మారింది. దీనివల్ల వైసీపీకి ఎంత మేలు జరుగుతుందో కానీ.. తర్వాత ఆ మహిళా నేతలు మాత్రం..తీవ్ర అవమానాలకు గురవుతారన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దిల్ రాజు సినిమా మ‌ళ్లీ వాయిదా?

దిల్ రాజు బ్యాన‌ర్‌లో ర‌కూపొందించిన‌ 'ల‌వ్ మీ' మ‌ళ్లీ వాయిదా ప‌డే అవ‌కాశాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. ఏప్రిల్ లో విడుద‌ల కావాల్సిన సినిమా ఇది. ఎన్నిక‌ల హ‌డావుడి వ‌ల్ల ఈనెల 25కు వాయిదా...

మోదీకి నో రిటైర్మెంట్ !

75 ఏళ్లకు మోదీ రిటైర్ అవుతారని అమిత్ షా ప్రధాని అవుతారని సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో బయటకు వచ్చిన కేజ్రీవాల్ చేసిన ప్రకటన బీజేపీలో చిచ్చు పెట్టింది. అలాంటి చాన్సే...

ఈసీకి ఏం చెప్పాలి… కారణాలు వెతుక్కుంటున్న ఏపీ సీఎస్

ఏపీలో జరుగుతోన్న హింసాత్మక ఘటనలపై వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించడంతో ఏం చెప్పాలన్న దానిపై సీఎస్ , డీజీపీ మల్లాగుల్లాలు పడుతున్నారు. రాష్ట్రంలో అల్లర్లతో అట్టుడుకుతుంటే ఎం చేస్తున్నారని కేంద్ర ఎన్నికల సంఘం...

విభజనకు పదేళ్లు : పట్టించుకునే స్థితిలో లేని ఏపీ పాలకులు !

పునర్విభజన చట్టంలో పదేళ్లలో అన్ని సమస్యలు పరిష్కారమయ్యేలా వివాదాలు లేకుండా ఉండేలా చూసేలా ఏర్పాట్లు చేశారు. అందుకే ఉమ్మడి రాజధాని అంశాన్ని పదేళ్ల పాటు చేర్చారు. ఇప్పుడు జూన్‌ 2 నాటికి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close