విశ్వ‌క్ సేన్ తొలి సినిమాని మోసిన సాయిరాజేష్‌

బేబీ సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్ట‌య్యింది. ద‌ర్శ‌కుడిగా సాయి రాజేష్ స్టామినాకు అద్దం ప‌ట్టింది. త‌న‌కు ఇప్పుడు వ‌రుస అవ‌కాశాలు వ‌స్తున్నాయి. బేబీ చాలా విష‌యాల్లో టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా నిలిచింది. అందులో విశ్వ‌క్‌సేన్ కాంట్ర‌వ‌ర్సీ కూడా ఒక‌టి. బేబీ సినిమాలోని ఆనంద్ చేసిన పాత్ర కోసం ముందు విశ్వ‌క్‌నే సంప్ర‌దించారు. అయితే విశ్వ‌క్ క‌థ కూడా విన‌కుండా అవ‌మానించాడంటూ ఓ సంద‌ర్భంలో సాయిరాజేష్ ఆవేద‌న వ్య‌క్తం చేయ‌డం, దానికి విశ్వ‌క్ కౌంట‌ర్ ఇవ్వ‌డం జ‌రిగిపోయాయి. బేబీ హిట్ ని ఎంజాయ్ చేయండి కానీ, నా జోలికి రాకండి అన్న‌ట్టు.. విశ్వ‌క్ త‌న‌దైన శైలిలో కౌంట‌ర్ ఇచ్చాడు. దాంతో బేబీ వెర్స‌స్ విశ్వ‌క్ అంటూ సోష‌ల్ మీడియాలో కొంత చ‌ర్చ న‌డిచింది.

అయితే ఈ విష‌యంపై ఇప్పుడు మ‌రోసారి సాయి రాజేష్ మాట్లాడారు. ఈ ఇష్యూని కాంట్ర‌వ‌ర్సీ చేయ‌డం త‌న‌కు ఇష్టం లేద‌ని, విశ్వ‌క్ ఈ క‌థ విన‌క‌పోవ‌డం త‌న వ్య‌క్తిగ‌త నిర్ణ‌య‌మ‌ని, అయితే బేబీ పాట‌లు విడుద‌ల కాగానే.. పాట‌లు బాగున్నాయంటూ విశ్వ‌క్ మెచ్చుకొన్నాడ‌ని, ప్ర‌తీ హీరో, ప్ర‌తి ద‌ర్శ‌కుడి క‌థ వినాల్సిన అస‌వ‌రం లేదని, అయితే `విన‌ను` అనే మాట‌ని కాస్త గౌర‌వ ప్ర‌దంగా చెబితే బాగుంటుంద‌ని చెప్పుకొచ్చాడు. ఈ ఇష్యూ్కి సాధ్య‌మైనంత సున్నితంగా పుల్ స్టాప్ పెట్టాల‌న్న ప్ర‌య‌త్నం సాయి రాజేష్‌లో క‌నిపించింది.

ఇదే సంద‌ర్భంలో మ‌రో విష‌యాన్ని కూడా సాయిరాజేష్ గుర్తు చేయ‌డం విశేషం. విశ్వక్ సేన్ తొలి సినిమా వెళ్లిపోమాకే. ఈ సినిమా ట్రైల‌ర్ సాయిరాజేష్‌కి విప‌రీతంగా న‌చ్చింద‌ట‌. ఆ సినిమా ఆర్థిక ఇబ్బందుల్లో ప‌డి, విడుద‌ల కాని పొజీష‌న్‌లో ఈ సినిమాని దిల్ రాజు, అల్లు అర‌వింద్ ద‌గ్గ‌ర‌కు తీసుకెళ్లాడ‌ట‌. వాళ్ల‌తో విడుద‌ల చేయించ‌డానికి త‌న వంతు ప్ర‌య‌త్నాలు చేశాడ‌ట‌. ఈ విష‌యం విశ్వ‌క్‌సేన్‌కి కూడా తెలీద‌ట‌. ఇవ‌న్నీ.. ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చాడు సాయి రాజేష్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అప్పుడే ఓటమికి కారణాలు చెప్పేసిన మంత్రి..!?

సర్వేలన్నీ కూటమిదే అధికారమని తేల్చడం, పోలింగ్ శాతం పెరగడంతో వైసీపీ నేతలు అప్పుడే ఓటమికి కారణాలు వెతుక్కుంటున్నారు. కారణం ప్రభుత్వ వ్యతిరేకత కాదని, సొంత పార్టీ నేతలే వెన్నుపోటు పొడిచారని ఆరోపిస్తున్నారు. సాధారణ...

ఏపీలో ముగిసిన పోలింగ్ …పోలింగ్ పెరగడంతో వైసీపీలో టెన్షన్..?

ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. కొన్ని ప్రాంతాల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పలుచోట్ల ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పలు జిల్లాలో వైసీపీ , టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు...

పోలింగ్ తగ్గించాలనే వైసీపీ “దాడుల ప్లాన్” పెయిల్ !

వీలైనంత వరకూ పోలింగ్ తగ్గించాలని వైసీపీ ముందుగానే ప్లాన్ చేసుకుంది. కీలకమైన నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రారంభం కాక ముందే టీడీపీ ఏజెంట్లపై దాడులు చేసి వాటిని విస్తృతంగా ప్రచారం చేయాలనుకున్నారు. అనుకున్నట్లుగా...

ఆ చెంపదెబ్బ వైసీపీ ఎమ్మెల్యేకి కాదు వైసీపీకే !

ఏపీలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన వెంటనే అ పెద్ద అపశకునం వైసీపీకి వచ్చింది. అది కూడా తమ ఎమ్మెల్యేకు చెంపదెబ్బ రూపంలో. తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చెంప...

HOT NEWS

css.php
[X] Close
[X] Close