ఏ కోర్టులో అయినా మార్గదర్శిపై జగన్ సర్కార్‌కు ఎదురు దెబ్బలే !

అధికార యంత్రాంగం మొత్తాన్ని మార్గదర్శిపై ప్రయోగించి.. ఏదో చేయాలనుకుంటున్న జగన్ రెడ్డి సర్కార్ కుట్రలు న్యాయస్థానాల్లో తేలిపోతున్నాయి. తెలంగాణ హైకోర్టులో మార్గదర్సి కేసుల విచారణ సాధ్యం కాదని.. ఏపీ హైకోర్టుకు మార్చాలని .. జగన్ రెడ్డి సర్కార్ పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ ను సుప్రీంకోర్టు నిర్మోహమాటంగా కొట్టేసింది. మార్గదర్శి కేసులను విచారించే న్యాయపరిధి తెలంగాణ హైకోర్టుకు లేదన్న ఏపీ ప్రభుత్వ వాదనను తోసిపుచ్ిచంది.

న్యాయపరిధి విషయాన్ని హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన బదిలీ పిటీషన్లు కాలం చెల్లినవని చెప్పిన సుప్రీంకోర్టు …మార్గదర్శి ఎండి శైలజాకిరణ్ పై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. మెరిట్స్ ఆధారంగా ఈ కేసును విచారించి నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ హైకోర్టుకు సూచించింది.

మార్గదర్శి చిట్ పండ్స్ కేసుల విషయంలో ఏపీ ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తోంది. ఒక్క ఫిర్యాదుదారు లేనప్పటికీ సంస్థ అవకతవకలకు పాల్పడుతోందని నగదు మళ్లిస్తోందని ఆరోపిస్తూ.. సోదాలు నిర్వహించారు. అలాగే చిట్స్ ను మూసేయడానికి .. చందాదారులకు బహిరంగనోటీసులు జారీ చేశారు. రాజకీయంగా కుట్ర చేసి వ్యాపార సంస్థను మూసి వేయడానికి జరుగుతున్న కుట్రగా మార్గదర్శి ఆరోపిస్తోంది. ఇంత వరకూ మార్గదర్శి విషయంలో ఫలానా తప్పు జరిగిందని.. ప్రభుత్వం నిరూపించలేకపోయింది. ప్రభుత్వ ప్రతి వాదనకూ మార్గదర్శి జవాబిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంత మోసమా కొమ్మినేని ? వైసీపీ క్యాడర్‌ని బలి చేస్తారా ?

వైసీపీ క్యాడర్ ను ఆ పార్టీ నేతలు, చివరికి సాక్షిజర్నలిస్టులు కూడా ఘోరంగా మోసం చేస్తున్నారు. ఫేకుల్లో ఫేక్ .. ఎవరు చూసినా ఫేక్ అని నమ్మే ఓ గ్రాఫిక్...

భ‌ళా బెంగ‌ళూరు..ప్లే ఆఫ్‌లో చోటు

ఎనిమిది మ్యాచ్‌లు ఆడితే.. అందులో 7 ఓట‌ములు. పాయింట్ల ప‌ట్టిక‌లో చిట్ట చివ‌రి స్థానం. ఇలాంటి ద‌శ‌లో బెంగ‌ళూరు ప్లే ఆఫ్‌కి వెళ్తుంద‌ని ఎవ‌రైనా ఊహించి ఉంటారా? కానీ బెంగ‌ళూరు అద్భుతం...

రేవంత్‌తో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేల భేటీ

సీఎం రేవంత్ రెడ్డితో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారు. ఈసీ పర్మిషన్ వస్తే మంత్రి వర్గ సమావేశం నిర్వహించాలనుకున్న రేవంత్ రెడ్డి సచివాలయంలోనే ఉన్నారు. అయితే హఠాత్తుగా ఆయనను...

టీమిండియా కోచ్ రేసులో గంభీర్ – అందుకే కోహ్లీ రిటైర్మెంట్ కామెంట్స్..?

టీమిండియా కోచ్ గా రాహుల్ ద్రవిడ్ కాంట్రాక్ట్ జూన్ నెలలో ముగుస్తుండటంతో తదుపరి ఎవరిని ఎంపిక చేస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఇదివరకు రికీ పాంటింగ్, స్టీఫెన్ ఫ్లెమింగ్ తో పాటు పలువురు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close