పరిపాలించేవాళ్లది ఘోరమైన మనస్థత్వం అయితే ప్రజలు ఎంత దారుణమైన పరిస్థితుల్లోకి వెళ్లిపోతారో.. బతకడం కంటే చావే మంచిదనే మానసిక భావనకు వెళ్లిపోతారో ఏపీనే ఉదాహరణ. ఆత్మహత్యల్లో ఏపీ నెంబర్ వన్ గా నిలిచింది. సాధారణంగా అత్యంత భారీ జన సాంద్రత ఉన్న మెట్రో నగరాలు ఉన్న రాష్ట్రాల్లో ఆత్మహత్యలు ఎక్కువగా ఉంటాయి. కానీ పూర్తిగా గ్రామీణ వాతావణం ఉండే ఏపీలో ఆత్మహత్యలు పెరిగిపోవడం అందర్నీ విస్మయ పరుస్తోంది.
2019 నుంచి ఆత్మహత్యల్లో భారీ పెరుగుదల
ఆత్మహత్యలు వివిధ రకాల సమస్యలతో ఉంటాయి. అందుకే ప్రతీ చోటా బలవన్మరణాలకు పాల్పడే వారు ఉంటారు. చుట్టూ ఉండే పరిస్థితులు నిరాశాపూరిత వాతావరణం, ప్రభుత్వ పరమైన వేధిపుల కారణంగా ఏపీలో ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నవారి జాతీయ సగటు 10.4 శాతం ఉండగా… ఏపీలో 12.4 శాతం వరకూ ఉంది. దీనికి సాక్ష్యం 2019 తర్వాత రాష్ట్రంలో ఆత్మహత్యల సంఖ్య పెరిగిపోవడమే. 2017, 2018లో 5 వేల మంది ఆత్మహత్యలు చేసుకుంటే, 2021లో 8 వేల మంది ఆత్మహత్య చేసుకున్నారు.
రాజకీయ వేధింపుల ఆత్మహత్యలు ఎక్కువ
రాజకీయ పరమైన వేధింపులు, బిల్లులు రాకపోవడం, రైతులకు సరైన ఆదరణ లేకపోవడం వంటి కారణాల వల్ల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. వైసీపీ అధికారంకి వచ్చాక కోడెల శివప్రసాదరావు వంటి నాయకుడే రాజకీయ వేధింపులకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది. అంటే వేధింపులు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. వేధింపులు గురి కాని విపక్ష నేతల లేరంటే అతిశయోక్తి కాదు. అదే సమయంలో… వైసీపీ నేతలుకూడా బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ ఘటనలన్నీ సంచలనం అయ్యాయి.
ఆత్మహత్యల నివారణకు చర్యలు శూన్యం!
ప్రజల మానసిక పరిస్థితులు ఎలా ఉండాలన్నది ప్రభుత్వ వ్యవహారాలను బట్టే ఎక్కువ ఉంటుది. నిరాశజనకమైన పాలన.. భవిష్యత్ ఉండదేమోనని భయంతో ఎక్కువ మంది ఆత్మహత్యలు చేసుకుంటూఉంటారు. ఈ బలవన్మరణాలు తగ్గించడానికి ముఖ్యంగా మానసిక ఒత్తిడి తగ్గించేందుకు ప్రభుత్వాసుపత్రుల్లో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని రాష్ట్రాలకు నిధులు కూడా కేటాయించింది. వీటి అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. కేంద్రం సూచనలు పాటించకపోగా, మానసిక సమస్యలతో బాధపడుతున్న వారి కోసం స్పెషల్ కేర్ తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.