ఆర్కే పలుకు : రామోజీ వెంట్రుక కూడా జగన్ పీకలేరు !

ఓ పథకం బటన్ నొక్కే ప్రసంగంలో నా బొచ్చు కూడా పీకలేరు అని జగన్ రెడ్డి డైలాగ్ చెప్పారు. ఇప్పుడు ఆర్కే.. అలాంటి భాష నేరుగా వాడలేదు కానీ.. రామోజీ వెంట్రుక కూడా జగన్ పీకలేరు అని కొత్త పలుకు ద్వారా తేల్చేశారు. ఏపీ సీఎం జగన్ రెడ్డి ఎంత ప్రమాదకరమైన రాజకీయ ఆట ఆడుతున్నారో చెప్పేందుకు ఈ వారం వేమూరి రాధాకృష్ణ కొత్త పలుకు వివరించారు. ఇలా చెప్పడం ఆయనకు సలహాలివ్వడం అవుతుంది కాబట్టి… పరోక్ష పద్దతిలో చెప్పారు. రాజకీయ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రత్యర్థుల ఆర్థిక మూలాల్ని దెబ్బతీయాలనుకుంటే… ఆ అధికారం మారితే ఏమవుతుంది అనే ఓ ప్రశ్నను జగన్ రెడ్డికి వదిలారు. భారతి సిమెంట్ మూసి వేత తప్పదని చెప్పారు. భారతీ సిమెంట్ పై లెక్కలేనన్ని కాలుష్య ఆరోపణలు ఉన్నాయి. నివేదికలూ ఉన్నాయి. లేకపోయినా పర్వాలేదు. ఇప్పుడు ప్రభుత్వం పరిశ్రమల్ని ఎలా మూయించారో దారి చూపించింది. అ ప్రకారం… జగన్ రెడ్డి అధికారం పోయిన మరుక్షణం ఆయనకు చెందిన వ్యాపార సంస్థలు మనుగడ సాగించడం కష్టమే.

భారతి సిమెంట్ కు … ఒక్క ప్లాంటే ఉంది. బయట ఎక్కడా మరో ప్లాంట్ లేదు. అది వికాట్ అనే ఫ్రెంచ్ కంపెనీకి 51 శాతం వాటా అమ్మారు కానీ.. అతి ఉత్తుత్తికే అని కార్పొరేట్ వర్గాలకు తెలుసు. ఆ కంపెనీ తరపున పేరుకే డైరక్టర్లు ఉంటారు… నిర్వహణ.. లాభాలు.. వ్యాపారాలు మొత్తం జగన్ రెడ్డి కుటుంబ కనుసన్నల్లో ఉంటాయి. మామూలుగా మెజార్టీ వాటా ఉన్న వాళ్లు ఆ సంస్థను స్వాధీనం చేసుకుంటారు. ఇక్కడ అలాంటిదేమీ జరగలేదంటేనే ఎంత గోల్ మాల్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక కార్మికులకు వేతనాలు దగ్గర్నుంచి కాలుష్య నిబంధనలు పాటించడం వరకూ చాలా లోపాలున్నాయి.

ఒక్క భారతీ సిమెంట్ మాత్రమే కాదు… జగన్ రెడ్డి ఆర్థిక మూలాలు ఏపీలో ఎక్కువే ఉన్నాయి. అవి బయట ప్రపంచానికి తెలియవు కానీ… రాజకీయవర్గాలకు బాగా తెలుసు. వాటిని ఎలా దెబ్బకొట్టాలో అలా కొడతారు. కొట్టకపోతే చేతకానితనం అనుకుంటారు. ఇక జగన్ రెడ్డి చూపించిన బాటలోనే… ఆ పార్టీ ముఖ్య నేతల ఆర్థిక మూలాలను టార్గెట్ చేసుకుంటారు. వ్యాపారవేత్తలకు రాజకీయం అనేది.. తమ వ్యాపారాలకు అదనపు బలమే కానీ.. రాజకీయం కోసం తాము దివాలా తీయాలని అనుకోరు.. రాంకీ రెడ్డి అయినా… రియల్ ఎస్టేట్ వేమిరెడ్డి అయినా ఇదే చేస్తారు. వాళ్లకు ఆర్థికంగా నష్టం అయితే వెంటనే జగన్ రెడ్డికి గుడ్ బై చెప్పేస్తారు. ఇవన్నీ గుర్తుకు వచ్చేలా ఆర్కే తన తన కొత్తపలుకులను వివరించారు. ఇలా చెప్పడానికి .. మార్గదర్శిపై ప్రభుత్వం జరుపుతున్న ఏకపక్ష దాడుల్ని వాహకంగా ఉపయోగించుకున్నారు. అంతే కాదు.. రామోజీరావు కాలిగోటిని కూడా తాకలేరని తేల్చేశారు.

ఇక కేసీఆర్ పైనా … ఆర్కేకు కోపం వచ్చింది. ప్రభుత్వ కార్యక్రమాలకూ ఆహ్వానాలు లేకపోవడంతో… దొరల పాలన ఇలాగే ఉండేదంటూ పలు కారణాలు చూపించారు. ఒకప్పుడు తెలంగాణలో టీడీపీకి మద్దతుగా ఉండేందుకు ఆర్కే కేసీఆర్ ను వ్యతిరేకించేవారని చెప్పుకునేవారు. కానీ ఇప్పుడు అక్కడ టీడీపీ లేదు. అయినా జర్నలిజం ప్రమాణాలను పాటిస్తున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో ఆర్కే నిఖార్సైన జర్నలిస్టుగా తన ఇమేజ్ నిలుపుకుంటూనే ఉన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ముగ్గురు ఎస్పీలు, కలెక్టర్‌పై వేటు – ఈసీ కఠిన చర్యలు

ఏపీలో ఎన్నికల అనంతర హింసపై ఈసీ కొడఢా ఢుళిపించింది. పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు, శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. తిరుపతి ఎస్పీపై బదిలీ వేటుతో పాటు శాఖాపరమైన విచారణకు ఆదేశాలు...

పవన్ పోటీ చేసిన పిఠాపురంలో బిగ్ డిబేట్ ఇదే..!!

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి పిఠాపురం నియోజకవర్గంనే నెలకొంది. కూటమి గెలుపు అవకాశాలపై ఎంత చర్చ జరుగుతుందో అంతకుమించిన స్థాయిలో పవన్ గెలుపు అవకాశాలపై డిస్కషన్ కొనసాగుతోంది.పవన్ గెలుపు...

కౌంటింగ్‌కు ముందే జీవోల క్లీనింగ్ !

ఏపీ అధికారులు తొందర పడుతున్నారు. ఓ వైపు పోలింగ్ జరిగి తీర్పు ఈవీఎంలలో ఉన్న సమయంలో అనుమానాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ ఆఫీస్ సాఫ్ట్ వేర్ అప్ గ్రేడ్ పేరుతో మూసేస్తున్నారు. ఈ...

ఏపీ పోలీసు అధికారులపై మరో సారి ఈసీ కొరడా రెడీ !

ఏపీలో ఎన్నికల కోడ్ ఉన్నంత వరకూ ఏ చిన్న ఘటన జరిగినా కఠిన చర్యలు తీసుకునేందుకు ఈసీ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఢిల్లీలో ఎన్నికల సంఘం ఎదుట ఏపీ సీఎస్, డీజీపీ హాజరయ్యారు. ఏపీలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close